విశాఖ డెయిరీలో టీడీపీ లక్ష్యం నెరవేరిందా?

విశాఖ డెయిరీని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో పాలక టీడీపీకి సానుకూల సంకేతం దక్కింది. ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీలో ఉన్న ఆ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్, ఇతర డైరెక్టర్లు రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీని వీడుతున్నట్టు వెల్లడించారు. దాంతో వారిని టీడీపీలో చేర్చుకోవడమా లేక బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్న అడారి ఆనంద్ కి సహకరించడమా అన్నదే మిగిలింది. 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరుపున బరిలో దిగిన అడారి ఆనంద్ ఓటమి…

Read More

జోరు వాన, జారుతున్న బురదలోనూ పవన్ ముందుకే!

మన్యంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పనసభద్ర పంచాయతీ బాగుజోల వెళ్లారు. గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 40 కోట్లతో నిర్మిస్తున్న 19 రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం జరగబోతోంది. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి…

Read More

కార్యకర్తలే బలిపశువులు, చంద్రబాబు, జగన్ ఎవరైనా అదే తంతు!

అధికారంలో టీడీపీ ఉందా లేక వైఎస్సార్సీపీనే కొనసాగుతుందా అన్నది తెలీయడం లేదు- ఇదీ ఓ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. అంతకుముందు వైఎస్సార్సీపీ హయంలోనూ ఇలాంటి మాటలే వినిపించాయి. ఇంకా చెప్పాలంటే మేమంతా కష్టపడితే గెలిచిన సీఎం ఈయనేనా అని అప్పుడూ, ఇప్పుడూ సందేహించే పరిస్థితి ఆయా పార్టీల శ్రేణుల్లో ఉంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఏలూరు పరిస్థితి చూద్దాం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ శ్రేణుల మీద పలు కేసులు పెట్టారు. ఆ…

Read More

ఏపీలో పెట్టుబడుల మీద తెలంగాణా మంత్రి కీలక వ్యాఖ్యలు

తెలంగాణా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమరావతికి వరద ముప్పు కారణంగా ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదంటూ అభిప్రాయపడ్డారు. ఏపీలో చంద్రబాబు రాగానే హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందనేది తప్పుడు ప్రచారం మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. పెట్టుబడిదారులు అమరావతి కంటే హైదరాబాద్‌, బెంగళూరుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటూ మంత్రి పొంగులేటి అన్నారు. ఏపీలో ఇటీవల ప్రభుత్వం వరుసగా…

Read More

ఇళయరాజాకి కులవివక్ష, గర్భగుడి ప్రవేశాన్ని అడ్డుకున్న అర్చకులు, జీయర్లు

దేశంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకి చుక్కెదురయ్యింది. ఆయన ఆలయంలో అడుగుపెట్టే ప్రయత్నానికి అభ్యంతరం వ్యక్తమయ్యింది. గర్భగుడిలో ఆయన ప్రవేశించడానికి నిరాకరించారు. దాంతో ఇళయరాజా నిరాశ చెందాల్సి వచ్చింది. గర్భగుడిలోకి వెళ్లేందుకు ఇళయరాజా ప్రయత్నించగా ‘గర్బగుడిలోకి మీకు లోపలికి ప్రవేశం లేదని’ పూజారులు, జీయర్లు వెనక్కి పంపించేశారు. తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. గర్భుగడిలో ప్రవేశించేందుకు చేసిన యత్నానికి స్థానిక పూజార్లు, ఆలయ అర్చకులు అంగీకరించకపోవడం వివాదంగా మారుతోంది. ఇళయరాజా…

Read More

అదీ పవన్.. అదే రూటు! పిఠాపురంలో పట్టు సడలకూడదంటే..!

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో దిగి గెలిచారు. అంతకుముందు గాజువాక, భీమవరం ఓటర్లు ఆయన్ని ఓడిస్తే పిఠాపురం ప్రజలు మాత్రం ఆదరించారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కోరిక తీర్చారు. దాంతో ఆయన ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఓటర్లంతా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల పిఠాపురం పట్టణ అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత పిఠాపురం అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ ఏర్పాటునకు…

Read More

జగన్ పుంజుకుంటున్నాడంటున్న ఏబీఎన్ ఆర్కే, ఎందుకలా?

ఏబీఎన్ రాధాకృష్ణ ఆందోళన చెందుతున్నాడా.. చంద్రబాబు పాలనా తీరుతో అసంతృప్తిగా ఉన్నారా.. బాబు విధానాల కారణంగా మళ్లీ వైఎస్ జగన్ కి ఆదరణ పెరుగుతోందని కలత చెందుతున్నారా. తాజాగా ఆయన రాతలు అందుకు సాక్ష్యంగా ఉన్నాయి. వైఎస్ జగన్ పుంజుకుంటున్నారని ఆందోళన చెందుతున్నట్టు చాటుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి బలపడుతున్న అంశాన్ని వేమూరి రాధాకృష్ణ తన వీకెంట్ కామెంట్ లో పరోక్షంగా చెప్పేశారు. చంద్రబాబుని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని వెల్లడించేశారు. సీఎంగా అద్భుత పనితీరు అంటే విజన్…

Read More

జమిలీ ఖాయమే కానీ, ఇప్పుడే కాదంటున్న చంద్రబాబు!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జమిలీ ఎన్నికలు జరగబోతున్నట్టు పరోక్షంగా అంగీకరించారు. కానీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్ ఛాట్ గా మాట్లాడిన ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామన్నారు. 2027లోనే ఎన్నికలు ఖాయమంటూ సాగుతున్న ప్రచారంపై స్పందిస్తూ వైసీపీ పబ్బం…

Read More

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్! చంద్రబాబు మళ్లీ వెనక్కి మళ్లుతున్నారా?

చంద్రబాబు పదే పదే టెక్నాలజీకి సంబంధించిన పదాలతో ప్రజలను ఆకట్టుకోవాలని చూడడం ఆశ్చర్యం ఏమీ కాదు. దశాబ్దాలుగా ఆయన పాలనా విధానంలో పెద్దగా మార్పు ఉండదు. కానీ ఆనాటికి టెక్ ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలను ఆయన ఉపయోగిస్తూ ఉంటారు. అందరికీ గుర్తుండే ఉంటుంది..2019 కి పూర్వం ఆయన పదే పదే లాజిస్టిక్స్ హబ్ అంటూ చెప్పుకొచ్చేవారు. విశాఖను లాజిస్టిక్స్ హబ్ గా చేస్తానని కూడా ఆయన అన్నారు. మరి ఇప్పుడెందుకు ఆయన మాట మరచిపోయారు. ఇప్పుడెందుకు డీప్…

Read More

బాలినేనికి మరో ఎదురుదెబ్బ, మాజీ మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జనసేన

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన నాటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి అన్నీ ఎదురుదెబ్బలే. తాజాగా మరోసారి ఆశాభంగమయ్యింది. తొలుత ఆయన ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరాలని ఆశించారు. కానీ ఆపార్టీ అధిష్టానం అందుకు భిన్నంగా ఆలోచించింది. కనీసం బాలినేని అనుచరులను కూడా వెంట తీసుకురాకుండా ఆయనతో పాటు అతి కొద్దిమందికి మాత్రమే అవకాశం ఇచ్చింది. అయినా సర్థుకుని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని భారీ సభ…

Read More