రాధాకృష్ణ అసలు బాధేంటి? నిజంగా బాబుకి పాలన మీద పట్టు చిక్కడం లేదా?

చంద్రబాబు పాలనలో ఏమీ బాలేదా..చంద్రబాబు రాజకీయాలు చేయలేకపోతున్నారా..వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌ పోటీ పడితే నారా లోకేశ్ వాళ్లను ఎదుర్కోలేరామర్రి చెట్టు కింద మొక్కలా లోకేశ్ మిగిలిపోతున్నారాఅసలెందుకిలా ఏబీఎన్ ఎండీ మండిపడే పరిస్థితి వచ్చింది. ఆసక్తికరమైన రాతలతో రాధాకృష్ణ తీరు చర్చనీయాంశమవుతోంది. అయితే ఆయన అనేక కథనాలు ప్రస్తావించడం, ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు దాని మాటే మరచిపోవడం ఆనవాయితీ. ఆ మధ్య సానా ముదురు అంటూ ఎంపీ సానా సతీశ్ గురించి…

Read More

అచ్చెన్నాయుడి సోదరుడైతే రిటైర్మెంట్ తర్వాత కూడా పోస్టింగ్!

ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ కథనం వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత బుడితి రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి సర్వీస్ పొడిగింపునకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి బాబాయ్ అయిన కింజరాపు ప్రభాకర్ కి రిటైర్మెంట్ తర్వాత ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దాని మీద ఏమంటుందో మరి జ్యోతి. జ్యోతి రాతలు పక్కన పెడితే రాష్ట్రంలో…

Read More

పీకే అక్కడ ఏమీ పీకలేకపోతున్నారు, యువత తిరుగుబాటుతో తలపట్టుకున్న నేత

ఎన్నికల వ్యూహకర్త ముసుగులో సకల అరాచకాలకు శ్రీకారం చుట్టిన ప్రశాంత్ కిషోర్ కి సొంత రాష్ట్రంలో చీవాట్లు తప్పడం లేదు. 2014లో బీజేపీ, 2019లో వైఎస్సార్సీపీ, 2024లో టీడీపీ కోసం పనిచేసి అడ్డమైన పనులతో ప్రజలను నమ్మించడానికి తెగించిన ఈ తుంటరికి తగిన శాస్తి జరుగుతోందంటూ గిట్టని వారు సంతోషపడుతుండడం విశేషం. ఒక ఎన్నికల్లో బీజేపీకి, ఆ వెంటనే కాంగ్రెస్ కి కూడా పనిచేసిన నేపథ్యం అతడిది. ఏపీలో కూడా వైఎస్సార్సీపీకి, టీడీపీ కి మద్ధతుగా నిలిచిన…

Read More

బాబు స్కెచ్ పెద్దది..కానీ అంత సీన్ ఉంటుందా?

గోదావరి జలాలను రాయలసీమ తరలించడం గురించి చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడారు. గోదావరి- పెన్నా అనుసంధానం అంటూ 2014-19 మధ్య పలుమార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టుకి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడది తెరమరుగయ్యింది. కొత్తగా బనకచర్లకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ముందుకు తెచ్చారు. డీపీఆర్ సిద్ధంచేసి, మూడు నెలల్లో టెండర్లని చెబుతున్నారు. పైగా ఇదే ఏపీకి గేమ్ ఛేంజర్ అంటూ వర్ణించారు. ఎప్పుడైనా నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అందరూ ఆహ్వానించాలి. అది అవసరం. కానీ…

Read More

చంద్రబాబుకి పోలీసు విన్నపం, వైరల్ అవుతున్న లేఖ! రాసినందుకు చర్యలు ఖాయమా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డీసీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ పేరుతో రాసిన లేఖ వైరల్ అవుతోంది. తీవ్ర మనోవేధనతో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆవేదన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతనలేదంటూ పోలీస్ శాఖ ఉద్యోగి వాపోయిన తీరు వైరల్ అవుతోంది. తమ మీద ఇంత వివక్ష ఎందుకంటూ ప్రశ్నించిన తీరు ఆలోచన రేకెత్తించేలా ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్…

Read More

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ సిగ్గుపడాల్సిన విషయం! ఏపీకి ఇలా, కర్ణాటకలో అలా!

వైజాగ్ స్టీల్ అవస్థలు పడుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో అతలాకుతలం అవుతోంది. ఇంకా చెప్పాలంటే ఉన్నత స్థానంలో ఉన్న సంస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో రాష్ట్రీయ ఇష్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊపిరితీసే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో కర్ణాటకలో అందుకు భిన్నంగా సాగుతోంది. భద్రావతిలో ఉన్న సర్ ఎం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీని పరిరక్షించుకునేందుకు పెద్దమొత్తంలో కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా 15వేల కోట్ల…

Read More

ఏబీఎన్ ఆర్కే రెండో పెళ్లి చేసుకున్నారా?

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీగా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అధినేతగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో ఉండే వేమూరి రాధాకృష్ణ వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి ఆయన రెండో పెళ్లి చుట్టూ చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆయన పెళ్లి మీద పలు కథనాలు వచ్చాయి. చివరకు పెళ్ళి పూర్తయ్యిందంటూ తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏబీఎన్ ఆర్కే భార్య, ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ గా పనిచేసిన కనకదుర్గ కొన్నేళ్ల క్రితం మరణించారు….

Read More

పోలీసులే హద్దులు మీరితే ఎలా? క్షమాపణలు చెప్పిన హైదరాబాద్ సీపీ

అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వివాదంలో పోలీసులు కొందరు చేస్తున్న అతి వివాదాలకు దారితీస్తోంది. అల్లు అర్జున్ ని విలన్ గా చిత్రీకరించాలని సీఎం సంకల్పించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వీరంగం చేసిన ఏసీపీ వంటి వాళ్లు అందులో పావులుగా మారారు. ఆఖరికి సీనియర్ అధికారి, హైదరాబాద్ సీపీ కూడా ఆ క్రమంలో హద్దులు మీరి అనవసర వివాదంలో చిక్కుకున్నారు. చివరకు క్షమాపణలు చెప్పాల్సి…

Read More

నారా దేవాన్ష్ రికార్డ్, వేగంగా పావులు కదుపుతున్న సీఎం మనవడు

మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్ “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ “చెక్‌మేట్ మారథాన్” పేరుతో ప్రపంచ రికార్డును…

Read More

ఆలయ కమిటీల్లో ఆ రెండు కులాలకు చోటు, మరి మిగిలిన వాళ్లేం చేశారు?

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పాలకమండళ్ల నియామకాలకు సిద్ధమవుతోంది. ఆక్రమంలో కొత్తగా కమిటీల్లో రెండు కులాల వారికి చోటు కల్పించాలని నిర్ణయించింది. అందులో బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ దేవాలయ కమిటీల్లో ఆయా ప్రాంతాలను బట్టి కమిటీల్లో చోటు లభిస్తుంది. కులాల వారీగా కేటాయింపులు లేవు. కానీ తొలిసారిగా ఆ రెండు కులాల వారికి చోటు కల్పించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా ఉత్తర్వులు వెలువడ్డాయి….

Read More