కెప్టెన్ మీద కోపగించి గ్రౌండ్ నుంచి వెళ్లిపోయిన క్రికెటర్..!

క్రికెట్లో చాలామందికి టెంపర్ మెంట్ ఉంటుంది. కొందరు దాన్ని ఫీల్డ్ లోనే ప్రదర్శిస్తారు. అలాంటిదే ఒకటి తాజాగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డే సందర్భంగా బయటపడింది. విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ అనూహ్యంగా గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. తన బౌలింగ్ లో కెప్టెన్ నిర్ణయం నచ్చలేదని డ్రెస్సింగ్ రూమ్ కి దారితీశాడు. దాంతో కొంతసేపు ఆ జట్టు పది మందితోనే ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తీరుతో జోసెఫ విబేధించి…

Read More

జమిలీ ఖాయమే కానీ, ఇప్పుడే కాదంటున్న చంద్రబాబు!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జమిలీ ఎన్నికలు జరగబోతున్నట్టు పరోక్షంగా అంగీకరించారు. కానీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్ ఛాట్ గా మాట్లాడిన ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామన్నారు. 2027లోనే ఎన్నికలు ఖాయమంటూ సాగుతున్న ప్రచారంపై స్పందిస్తూ వైసీపీ పబ్బం…

Read More

ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం లభించింది. తాత్కాలిక కెప్టెన్ జస్ఫ్రిత్ బుమ్రా అధ్భుతంగా రాణించి జట్టుని విజయపథంలో నడిపించాడు. ముఖ్యంగా సెనా దేశాల గడ్డ మీదనే అత్యధిక తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో ఏకంగా 295 రన్స్ ఆధిక్యంతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గత సీజన్ లో జరిగిన పెర్త్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. న్యూజీలాండ్‌తో సొంత గడ్డపై 0-3 తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత.. ఆసీస్ గడ్డపై జరుగుతున్న బీజీటీ…

Read More

చంద్రబాబు మీద వెంకయ్య అనుమానం!

చంద్రబాబు సామర్థ్యం మీద నమ్మకం ఉందని చెబుతూనే తాము కదులుతుండగానే అమరావతి పూర్తి చేయాలని బహిరంగంగానే చెప్పడం ద్వారా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తిగా వ్యాఖ్యానించారు. అమరావతి పనుల మీద ప్రజల్లో ఇప్పటికే సందేహాలున్నాయి. ఇప్పుడు వెంకయ్య కూడా అలాంటి అనుమానాలు రేకెత్తించడం ఏపీ రాజధాని భవితవ్యం మీద సందేహాలు బలపడుతున్నాయి. పూర్తి వివరాలు వీడియోలో

Read More

జమిలీ వచ్చినా కూటమిగానే బరిలోకి, తేల్చేసిన చంద్రబాబు

ఏపీలో జమిలీ ఎన్నికల అవకాశాన్ని పాలకపక్షాలు కూడా గుర్తించాయి. దానికి తగ్గట్టుగా సన్నద్దమవుతున్నాయి. ఇప్పటికే పాలకకూటమిలోని మూడు పార్టీల మధ్య పలు చోట్ల విబేధాలు పొడచూపినప్పటికీ కూటమి మాత్రం కొనసాగుతుందన్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. తమ పార్టీ శ్రేణులకు దానికి తగ్గట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం లో శాంతి భద్రతలు క్షీణించినట్టు ఇప్పటికీ డీసీఎం పవన్ కళ్యాణ్ విమర్శించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయినప్పటికీ సర్ధుకుపోవడమేనని టీడీపీ భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే…

Read More

ఇకపై‌ ఆ విన్యాసాలు కుదరవు..క్రికెట్ లో కొత్త రూల్

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే మార్లిబాన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) క్రికెట్ క్తాచింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. ఎంసీసీ రూల్స్‌నే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అమలు చేస్తుంది. ఇటీవల కాలంలో బౌండరీల వద్ద క్యాచ్‌లు పట్టే సమయంలో ఫీల్డర్ల విన్యాసాలను మనం చూస్తూనే ఉన్నాం. బౌండరీల వద్ద క్యాచ్ చేసే సమయంలో బ్యాలెన్స్ కోల్పోతున్నామని అనుకున్నప్పుడు.. బంతిని గాల్లోకి విసిరి.. బౌండరీ దాటి వెళ్లి..‌మళ్లీ తిరిగి వచ్చి బంతులు పడుతున్నారు. టీ20 వరల్డ్…

Read More

జనసేన నాయకుడి ఇంట్లో బాలుడి అనుమానాస్పద మృతి, దర్యాప్తు కోసం ఆందోళన

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడి ఇంట్లో బాలుడి మృతి కలకలం రేపుతోంది. బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ఎల్బీనగర్ కు చెందిన ఆటోడ్రైవర్ కుక్కల మల్లేశ్వరరావు కుమారుడు కుక్కల చరణ్ శ్రీ తేజ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ ఇంటికి సమీపంలోనే ఉన్న రాజేశ్వరి రెసిడెన్సీ వద్ద ఈ ఘటన జరిగింది. అపార్ట్ మెంట్ వాచ్…

Read More