టీమిండియాలో గంభీర్ చిచ్చు పెట్టారా.. పరాజయాల పరంపరలో కోచ్ పాత్ర ఎంత?

టీమిండియా ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత పేలవ ప్రదర్శన చేసింది. న్యూజీలాండ్ తో సొంత గడ్డ మీద సిరీస్ లో ఏకంగా మూడుకి మూడు టెస్టులు ఓడిపోయింది. అయితే ఓటమి కన్నా జట్టులో కీలక ఆటగాళ్ల ప్రదర్శన మీద తీవ్ర చర్చ సాగుతోంది. అందులో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముంగిట జట్టులో పరిణామాల మీద ఆందోళన వ్యక్తమవుతోంది. జట్టు కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా తగిన స్థాయిలో ప్రతిభ కనబర్చలేకపోతోంది….

Read More

ఉచిత బస్సుపై నీలినీడలు..పొరుగున సంకేతాలు ఏమిటి?

ఎన్నికల్లో ఓటరు తీర్పును స్థానిక పరిస్థితులే కాకుండా పొరుగున జరిగే సంఘటనలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. దక్షణాది రాష్ట్రాలకు ఈ వాక్యం కచ్చితంగా సరిపోతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ 6 ఫార్ములాను తీసుకువచ్చింది. వాటిల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తమ మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని జాతీయ నాయకులు నుంచి రాష్ట్ర నాయకులు వరకు ప్రగల్భాలు పలికారు.2023 మే లో జరిగిన…

Read More

యశశ్వి జైశ్వాల్ రికార్డులతో టీమిండియా పట్టు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. యంగ్ ఓపెనర్ యశశ్వి జైశ్వాల్ అద్భుత సెంచరీతో పర్యటక జట్టు ముందు ఆసీస్ పేస్ త్రయం తేలిపోయింది. ఆ క్రమంలోనే టీమిండియా నయా సంచలనం రికార్డుల మోత మోగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోపీ తొలిటెస్టులో సెంచరీ సాధించి ఆస్ట్రేలియా గడ్డ మీద మొదటి మ్యాచ్ లో వంద పరుగులు సాధించిన ఉద్దండుల సరసన చేరాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్,…

Read More

జగన్ పుంజుకుంటున్నాడంటున్న ఏబీఎన్ ఆర్కే, ఎందుకలా?

ఏబీఎన్ రాధాకృష్ణ ఆందోళన చెందుతున్నాడా.. చంద్రబాబు పాలనా తీరుతో అసంతృప్తిగా ఉన్నారా.. బాబు విధానాల కారణంగా మళ్లీ వైఎస్ జగన్ కి ఆదరణ పెరుగుతోందని కలత చెందుతున్నారా. తాజాగా ఆయన రాతలు అందుకు సాక్ష్యంగా ఉన్నాయి. వైఎస్ జగన్ పుంజుకుంటున్నారని ఆందోళన చెందుతున్నట్టు చాటుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి బలపడుతున్న అంశాన్ని వేమూరి రాధాకృష్ణ తన వీకెంట్ కామెంట్ లో పరోక్షంగా చెప్పేశారు. చంద్రబాబుని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని వెల్లడించేశారు. సీఎంగా అద్భుత పనితీరు అంటే విజన్…

Read More

ఈవీఎంల భాగోతం బయటపడుతున్నా, విపక్షాలు ఎందుకలా ఉంటున్నాయి?

పోలయిన ఓట్ల కన్నా ఎక్కువే లెక్కిస్తున్నారుఈవీఎం ఛార్జింగ్ ఎక్కడా తగ్గడం లేదువీవీ పాట్ల లెక్క తేల్చడం లేదుఈవీఎంలు ఓటేసిన వాళ్లే రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు దేశంలో ఎన్నికల వ్యవస్థ చుట్టూ సందేహాలు చెలరేగుతున్నాయి. ఈ అనుమానాలు రానురాను బలపడుతున్నాయి. ఇప్పటికప్పుడు అపోహలు తొలగించాల్సిన ఎన్నికల కమిషన్ వాటికి మరింత ఊతమిస్తోంది. ప్రజల్లోంచి వస్తున్న సందేహాలు తీర్చడానికి ససేమీరా అంటోంది. భవిష్యత్తులో ఇది పెను దుమారం దిశగా సాగుతోంది. మహారాష్ట్రలో తాము ఓటేసిన పార్టీకి సున్నా ఓట్లు వచ్చి…

Read More

తెలుగువారిని అంతఃపురం సేవకులుగా వర్ణించిన సినీ నటి!

సినీ నటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలుగువారి పట్ల చేసిన విమర్శలు ఆమెను వివాదాల్లోకి నెట్టాయి. ఆ నటి తీరు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకి ఆమె తలొగ్గాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా సీనియర్ నటి కస్తూరి కామెంట్స్ కారణంగా చెలరేగిన కలకలం తర్వాత పరిస్థితి. తాజాగా తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారి గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇచ్చారు. ఆమె తెలుగువారినుద్దేశించి చేసిన…

Read More

దళిత చేతిలో బీజేపీ పగ్గాలు పెడతారా, వ్యూహాత్మక ప్రచారమా?

బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం కొంతకాలంగా నానుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర క్యాబినెట్లో చేరిన జేపీ నడ్డా రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం వరకూ ఆయన పార్టీ పగ్గాలు మోస్తానని ప్రకటించారు. కానీ తీరా 8 నెలలుగా ఆ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి ఫిబ్రవరి నాటికి నూతన అధ్యక్షుడి విషయంలో స్పష్టత వస్తుందన్న ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి…

Read More

తెలుగు రాష్ట్రాల విపక్షాలది ఒకే వ్యూహమా? అరెస్టు కోసం ఎదురుచూస్తున్నారా?

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో Arrest Me అనే కామెంట్లు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ Arrest Me కామెంట్లపై చర్చ పెరిగింది. తెలంగాణలో Arrest Me రాగాన్ని కేటీఆర్ గత కొంత కాలంగా ఆలపిస్తుంటే.. తాజాగా వైసీపీ అధినేత జగన్ కూడా అదే తరహా రాగం అందుకున్నారు. హైదరాబాదులో ఫార్మూలా-ఈ రేసింగ్ కోసం 55 కోట్ల రూపాయలను కెబినెట్ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించేశారనేది బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్…

Read More

విశాఖలో ఆరుగురు అమ్మాయిలు మాయం, కళ్లలో కారం జల్లిపారిపోయారని ఫిర్యాదు

విశాఖ జిల్లాలో ఒకేరోజు ఆరుగురు అమ్మాయిలు పరారయ్యారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్వధార్ హోం నుంచి వారంతా పారిపోయారు. దాంతో ఈ ఘటన సంచలనంగా మారింది. పెందుర్తి మండలంలోని స్వధార్ గృహం నుంచి ఆరుగురు బాధిత యువతులు పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. వారంతా వివిధ కేసుల్లో న్యాయస్థానం నుంచి ఆదేశాల మేరకు స్వధార్ లో ఉంటున్నారు. వారికి తగిన సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా నిర్వాహకులను కత్తితో బెదిరించి అక్కడి నుంచి పరారయినట్టు పోలీసులకు…

Read More