ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?

ప్రపంచం బాధను తన బాధగా భావిస్తారని శ్రీ శ్రీ గురించి.. తన బాధను ప్రపంచం బాధగా చూస్తారని కృష్ణశాస్త్రి గురించి సాహితీ లోకంలో ఉన్న టాక్. ఇప్పుడు టీడీపీ సానుభూతిపరుల్లో కొందరు శ్రీ శ్రీలు, ఇంకొందరు కృష్ణశాస్త్రిలుగా మారిపోయినట్టే కన్పిస్తోంది. జీవీ రెడ్డి-దినేష్ కుమార్ ఎపిసోడులో కొందరు శ్రీ శ్రీలుగా మారిపోయారు.. ఇంకొందరు కృష్ణశాస్త్రిలుగా మారిపోయారు. ఎవరి అభిప్రాయాలను వారు చెప్పేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా చంద్రబాబు కంటే జీవీ రెడ్డే గ్రేట్ అనే స్థాయిలో కామెంట్లు కూడా…

Read More

నితీశ్ కెరీర్ కి మీడియా హైప్ ముప్పుగా మారుతుందా?

టీమిండియా ఆటగాళ్ళను ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పతనానికి పడేయడం చాలా సహజం. ఒక్క మ్యాచ్ లో లేదా ఒక సిరీస్ లో రాణించగానే అంతా, ఇంతా అంటూ కొనియాడడం, అంతలోనే కొన్ని ఫెయిల్యూర్స్ కి తీవ్రంగా నిందించడం అనేది అభిమానులకే కాదు మీడియాకు కూడా అలవాటు. తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి ఉదంతం చూస్తుంటే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. మెల్బోర్న్ లో అద్భుతంగా రాణించిన ఆటగాడి పట్ల మీడియా స్పందించిన తీరు అతిగా ఉందనే వాదన వినిపిస్తోంది….

Read More

రెహ్మాన్ కి మాటిచ్చిన రామ్ చరణ్ అక్కడికెళ్లారు..

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ మాట నిలబెట్టుకున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ్మాన్‌కిచ్చిన మాట‌కు తగ్గట్టుగా వ్యవహరించారు. క‌డ‌ప ద‌ర్గాను సంద‌ర్శిస్తాన‌న్న చ‌ర‌ణ్‌.. ఇచ్చిన మాట ప్ర‌కారం క‌డ‌ప ద‌ర్గాలో జ‌రిగిన 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యారు. ఈ ద‌ర్గాను ఎ.ఆర్‌.రెహ్మాన్‌ క్ర‌మ త‌ప్ప‌కుండా సంద‌ర్శిస్తుంటారు. 2024లో ఇక్క‌డ జ‌రిగే 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌కు చ‌ర‌ణ్‌ను తీసుకొస్తాన‌ని ఆయ‌న అన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చ‌ర‌ణ్‌ను ఆహ్వానించారు. ఓ వైపు బిజీ షెడ్యూల్‌…..

Read More

తెలుగువారిని అంతఃపురం సేవకులుగా వర్ణించిన సినీ నటి!

సినీ నటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలుగువారి పట్ల చేసిన విమర్శలు ఆమెను వివాదాల్లోకి నెట్టాయి. ఆ నటి తీరు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకి ఆమె తలొగ్గాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా సీనియర్ నటి కస్తూరి కామెంట్స్ కారణంగా చెలరేగిన కలకలం తర్వాత పరిస్థితి. తాజాగా తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారి గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇచ్చారు. ఆమె తెలుగువారినుద్దేశించి చేసిన…

Read More

భారీ వర్ష సూచన, రైతులు సర్దుకోండి!

నవంబర్ నెలాఖరులో ఏపీలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అంతా అప్రమత్తం కావాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందంటూ అంచనా వేసింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెబుతోంది. తర్వాత,…

Read More

కాకినాడ పోర్టులో షిప్ సీజ్ చేయలేమని తేల్చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్న పనామా స్టెల్లా షిప్ ను సీజ్ చేయలేమని ఏపీ ప్రభుత్వం తేల్చేసింది. అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దానికి తగ్గట్టుగా ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులు సహా ఇతర అక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ…

Read More

చంద్రబాబుకి పోలీసు విన్నపం, వైరల్ అవుతున్న లేఖ! రాసినందుకు చర్యలు ఖాయమా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డీసీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ పేరుతో రాసిన లేఖ వైరల్ అవుతోంది. తీవ్ర మనోవేధనతో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆవేదన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతనలేదంటూ పోలీస్ శాఖ ఉద్యోగి వాపోయిన తీరు వైరల్ అవుతోంది. తమ మీద ఇంత వివక్ష ఎందుకంటూ ప్రశ్నించిన తీరు ఆలోచన రేకెత్తించేలా ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్…

Read More
pawan kalyan

పవన్ కళ్యాణ్‌ కి తెలిసే అన్నారా..తెలియక హోం మంత్రిని బద్నాం చేశారా?

“హోమ్ శాఖ మంత్రి బాగా పనిచేయటం లేదు. ఆడపిల్లల ప్రాణాలు పోతున్నాయి. బయటకు వెళ్తే ప్రజలు తిడుతున్నారు. నేను ఆ శాఖ కూడా తీసుకుంటే ఇరగతీస్తాను. అందుకే చెప్తున్నాను పని తీరు మార్చుకోండి.” ఈమాటలన్నది స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం. అంటే ఏపీలో శాంతిభద్రతలు బాలేదని, ప్రజలు తిడుతున్నారని, పరిస్థితి చక్కదిద్దాలని ఆయన గుర్తించారు. కానీ పవన్ కళ్యాణ్‌ విస్మరించిన వాస్తవం ఏమంటే ఏపీలో శాంతిభద్రతల విభాగం వంగలపూడి అనిత చేతిలో లేదు. పైగా పవన్ కళ్యాణ్‌…

Read More

బోరుగడ్డ అనిల్ కేసులో టీవీ5 ప్రతినిధి అరెస్ట్

ఏపీలో విపక్షం మీదనే కాదు.. టీడీపీ గొంతుగా మారిన టీవీ5 జర్నలిస్టులను కూడా పోలీసులు వదలడం లేదు. తాజాగా గుంటూరులో టీవీ5 జర్నలిస్ట్ పాలడుగు వంశీకృష్ణను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గుంటూరులో ఆయన కెమెరామేన్ గా పనిచేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. బోరుగడ్డ అనిల్ కుమార్ రిమాండ్ లో ఉన్న కాలంలో ఆయనకు సకల సదుపాయాలు కల్పించారంటూ టీవీ5 కొన్ని కథనాలు ప్రచారం చేసింది. పోలీస్ స్టేషన్ కి చెందిన సీసీ ఫుటేజ్ ను…

Read More