గ్యాస్ ధర మళ్లీ పెరిగింది!విమాన ఛార్జీల వాయింపే!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీకి శ్రీకారం చుడుతున్న వేళ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ ధర పెంచింది. ఓవైపు పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్న వేళ దేశీయంగా గ్యాస్ కంపెనీలు ధరలు సవరించడం ఆందోళనకరంగా మారుతోంది. దీపావళి పండుగ తెల్లవారే గ్యాస్ సిలెండర్ల ధర సవరిస్తూ ప్రకటన వెలువడింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. చమురు కంపెనీలు తాజాగా విడుదల చేసిన ధరల…
టీమిండియాలో గంభీర్ చిచ్చు పెట్టారా.. పరాజయాల పరంపరలో కోచ్ పాత్ర ఎంత?
టీమిండియా ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత పేలవ ప్రదర్శన చేసింది. న్యూజీలాండ్ తో సొంత గడ్డ మీద సిరీస్ లో ఏకంగా మూడుకి మూడు టెస్టులు ఓడిపోయింది. అయితే ఓటమి కన్నా జట్టులో కీలక ఆటగాళ్ల ప్రదర్శన మీద తీవ్ర చర్చ సాగుతోంది. అందులో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముంగిట జట్టులో పరిణామాల మీద ఆందోళన వ్యక్తమవుతోంది. జట్టు కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా తగిన స్థాయిలో ప్రతిభ కనబర్చలేకపోతోంది….
లక్కీ భాస్కర్ – మట్కా – పుష్ప : మూడు సినిమాలు ఒకటే సారాంశం!
దాదాపు నెల రెండు నెలల వ్యవధిలో రిలీజైన్ లక్కీ భాస్కర్, మట్కా, పుష్ప-2 సినిమాలను చూస్తే ఒకటే కథాంశం కనిపిస్తుంది. అక్రమ మార్గాల్లో కోట్లు కొల్లగొట్టడం ఎలా అనేదే ఈ మూడు సినిమాల సారాంశం. కథ జరిగే కాలాలే వేరు తప్ప…కథానాయకుల తీరు ఒక్కటే. లక్కీభాస్కర్ సినిమాలో హీరో బ్యాంకుల మోసం చేసి, ఆ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి, ఆ మార్కెట్లోనూ తన కుతంత్రాన్ని ప్రయోగించి కోట్లు కొల్లగొడతాడు. మట్కా సినిమా కథానాయకుడు…మట్కా అనే…
బాహుబలిని బీట్ చేసిన పుష్ప2! ఇక మిగిలింది ఆ సినిమానే!
ఇండియన్ మువీ ఇండస్ట్రీలో పుష్ప2 కొత్త రికార్డ్ బ్రేక్ చేసింది. టాలీవుడ్ సత్తాను చాటిచెప్పింది. బాహుబలిని బీట్ చేసి రికార్డ్ కలెక్షన్లు సాధించింది. 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 1799 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. కొత్త రికార్డ్ నెలకొల్పింది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్ మువీ బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు ను పుష్ప 2 బ్రేక్ చేసినట్లు అయింది. బాహబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1788 కోట్ల రూపాయల…
యశశ్వి జైశ్వాల్ రికార్డులతో టీమిండియా పట్టు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. యంగ్ ఓపెనర్ యశశ్వి జైశ్వాల్ అద్భుత సెంచరీతో పర్యటక జట్టు ముందు ఆసీస్ పేస్ త్రయం తేలిపోయింది. ఆ క్రమంలోనే టీమిండియా నయా సంచలనం రికార్డుల మోత మోగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోపీ తొలిటెస్టులో సెంచరీ సాధించి ఆస్ట్రేలియా గడ్డ మీద మొదటి మ్యాచ్ లో వంద పరుగులు సాధించిన ఉద్దండుల సరసన చేరాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్,…
కడప రెడ్డమ్మకు అవమానమా, ఎమ్మెల్యే మాధవి నిరసన
కడప రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా మునిసిపల్ కార్పోరేషన్ వ్యవహారాల్లో పెత్తనం కోసం ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవికి మేయర్ సురేష్ బాబు కి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. తాజాగా మేయర్ ఛాంబర్ లో ఎమ్మెల్యే కుర్చీలు కూడా తీసివేయించారంటూ ఎమ్మెల్యే మాధవి ఆరోపిస్తున్నారు. తమను అవమానించారంటూ ఆమె నిరసనకు దిగారు. తాజాగా మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె నిలబడి తన నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేయర్ స్పందించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్…
బోరుగడ్డ అనిల్ కేసులో టీవీ5 ప్రతినిధి అరెస్ట్
ఏపీలో విపక్షం మీదనే కాదు.. టీడీపీ గొంతుగా మారిన టీవీ5 జర్నలిస్టులను కూడా పోలీసులు వదలడం లేదు. తాజాగా గుంటూరులో టీవీ5 జర్నలిస్ట్ పాలడుగు వంశీకృష్ణను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గుంటూరులో ఆయన కెమెరామేన్ గా పనిచేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. బోరుగడ్డ అనిల్ కుమార్ రిమాండ్ లో ఉన్న కాలంలో ఆయనకు సకల సదుపాయాలు కల్పించారంటూ టీవీ5 కొన్ని కథనాలు ప్రచారం చేసింది. పోలీస్ స్టేషన్ కి చెందిన సీసీ ఫుటేజ్ ను…
చంద్రబాబుని పవన్ కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?
తమ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని స్వయంగా పవన్ కళ్యాణ్ అంగీకరించారు. నిజానికి అలాంటి విమర్శలు విపక్షం నుంచి వస్తుంటాయి. దానిని పాలక కూటమి నేతలు తప్పుబడుతూ ఉంటారు. అందుకు విరుద్ధంగా పరిస్థితి అదుపుతప్పిందని అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం చెప్పడంతో టీడీపీ డిఫెన్స్ లో పడింది. పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక లక్ష్యం ఏమిటా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. యధాలాపంగా ఆయన ఇంతటి తీవ్రమైన విమర్శలు చేసి ఉండకపోవచ్చన్నది అంగీకరించాల్సిన విషయం. అందులోనూ లా…