
Politics


పోలీసుల తీరుతో కలత చెందిన పవన్ కళ్యాణ్, బాధితులకు క్షమాపణ
ఏపీ ఉపముఖ్యమంత్రి మరోసారి పోలీసుల తీరుతో కలత చెందారు. ఈసారి ఏకంగా బాధితులకు క్షమాపణ కూడా చెప్పారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం విషయంలో పోలీసుల వ్యవహారశైలితో పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చింది. అంతేగాకుండా తన ట్రస్ట్ తరుపున బాధిత కుటుంబానికి రూ. 2లక్షల నష్టపరిహారం కూడా అందించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పోలీసులు…

వాలంటీర్ వ్యవస్థకు వెన్నుపోటు
వాలంటీర్ల వ్యవస్థ అమలుపై ఎన్నికల ప్రచారంలో టిడిపి, జనసేన అధినేతలు ఊదర గొట్టారు.వైసిపి ప్రభుత్వం ఇస్తున్న 5000 జీతం కంటే మెరుగైన గౌరవ వేతనం ఇస్తాం.వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాం. వాలంటిర్లలో డిగ్రీ , పీజీ చేసిన వారు కూడా ఉన్నారు.వారికి శిక్షణ ఇచ్చి సాప్ట్ వేర్ ఉద్యోగులుగా తీర్చి దిద్దుతాము.తమపై వైసిపి చేసే ప్రచారాన్ని నమ్మకండని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రజలను కోరారు.ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీయే విజయం సాధించింది.మంత్రులకు శాఖలు కేటాయింపులో వార్డు వాలంటర్…

వైఎస్ కుటుంబ ఆస్తుల తగాదా తేలాలంటే ఇంకో నెల ఆగాల్సిందే..
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల తగాదాలో వచ్చిన విబేధాల మీద విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన కేసు డిసెంబర్ 13కి వాయిదా వేస్తున్నట్టు ఎన్సీఎల్టీ ప్రకటించింది. దాంతో ఈ వ్యవహారంలో స్పష్టతకు మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. సరస్వతి పవర్ లో వైఎస్ జగన్, ఆయన భార్య భారతి పేరు మీద ఉన్న వాటాలను వైఎస్ విజయమ్మకు గిఫ్ట్ డీడ్ గా రాశారు. దానిని…

రాహుల్ గాంధీకి వర్తించని నిభందన…మీకు ఎలా సాధ్యం జగన్ ?
ప్రభుత్వ విధానాలను చర్చిండానికి, ప్రశ్నించడానికి ప్రతిపక్షానికి గొప్ప వేదికలు చట్ట సభలు.అలాంటి ప్రజాస్వామ్య అవకాశం అందరికి దొరుకుతుందా? రాజ్యంగ బద్ధ సంస్థ ద్వారా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష శాసనసభ్యలు ఆ విషయాన్నే మర్చిపోయారా? ప్రతిపక్ష నేతగా గుర్తించనప్పుడు అసెంబ్లీ ఎందుకు అని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తున్నారు? పార్టీ కార్యాలయం నుంచే పాలక పార్టీ ని ప్రశ్నిస్తూ ఉంటాము అని ప్రకటిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అధికార ప్రతినిధి వరకు…

ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకున్న వైఎస్సార్సీపీ!ఎవరికి కలిసొస్తుంది?
ఏపీలో శాసనమండలి స్థానాలకు జరుగుతున్న ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని ఆపార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతిభద్రతల కారణంగా ఎన్నికల తీరు మీద తమకు విశ్వాసం లేదని ప్రకటించింది. రెండు జిల్లాల పార్టీ నేతలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. నాయకుల అబిప్రాయం సేకరించారు. తొలుత కార్మిక నాయకుడు పి గౌతమ్ రెడ్డిని పోటీలో పెట్టాలని భావించిన వైఎస్సార్సీపీ చివరకు…

కడప రెడ్డమ్మకు అవమానమా, ఎమ్మెల్యే మాధవి నిరసన
కడప రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా మునిసిపల్ కార్పోరేషన్ వ్యవహారాల్లో పెత్తనం కోసం ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవికి మేయర్ సురేష్ బాబు కి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. తాజాగా మేయర్ ఛాంబర్ లో ఎమ్మెల్యే కుర్చీలు కూడా తీసివేయించారంటూ ఎమ్మెల్యే మాధవి ఆరోపిస్తున్నారు. తమను అవమానించారంటూ ఆమె నిరసనకు దిగారు. తాజాగా మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె నిలబడి తన నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేయర్ స్పందించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్…

ఏలూరు మెడికల్ కాలేజీకి యల్లాప్రగడ పేరు ఖరారు
ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాల పేరును “డా. ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ వైద్య కళాశాల, ఏలూరు”గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలపడంతో కాలేజ్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మెడకిల్ కాలేజ్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి బయో కెమిస్ట్రీలో విశేష పరిధోనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన…

గ్రంథి శ్రీనివాస్ పై ఐటీ దాడుల వెనుక రాజకీయ లక్ష్యాలున్నాయా?
దేశంలో ఎక్కడ ఐటీ, ఈడీ దాడులకు పూనుకున్నా దాని వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. ఎవరినైనా తమ దారికి తెచ్చుకోవాలని ఆశిస్తున్న పాలక పెద్దలు ఆయా దర్యాప్తు సంస్థలు వినియోగిస్తున్నారన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయ నేత గ్రంథి శ్రీనివాస్ కి చెందిన సంస్థలు, ఇళ్లపై ఐటీ అధికారుల దాడులు అందులో భాగమేనా అన్న సందేహం కూడా కలుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాపారాలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారుల…

డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కారు ఆటలు!
అదిగో డీఎస్సీ..ఇదిగో నోటిఫికేషన్ అంటూ ఊరిస్తున్నారు. ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోయింది. అయినా తొలి ఐదు సంతకాల్లో ఒకటైన డీఎస్సీ నోటిఫికేషన్ కి మోక్షం లేదు. ఇది ఆశావాహులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. నిరుద్యోగ ఉపాధ్యాయులతో ఆటలాడుతున్నట్టుగా ఉంది. నవంబర్ 3న నోటిఫికేషన్ అంటూ తొలుత ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ విదేశీయాత్ర ముగించుకుని రాలేదని 6వ తేదీకి వాయిదా వేశారు. తీరా ఆరు నాడు కూడా రిలీజ్ కాలేదు. మరో వారం పడుతుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటన….