గ్యాస్ ధర మళ్లీ పెరిగింది!విమాన ఛార్జీల వాయింపే!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీకి శ్రీకారం చుడుతున్న వేళ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ ధర పెంచింది. ఓవైపు పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్న వేళ దేశీయంగా గ్యాస్ కంపెనీలు ధరలు సవరించడం ఆందోళనకరంగా మారుతోంది. దీపావళి పండుగ తెల్లవారే గ్యాస్ సిలెండర్ల ధర సవరిస్తూ ప్రకటన వెలువడింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. చమురు కంపెనీలు తాజాగా విడుదల చేసిన ధరల…
మీకు 2 రోజుల పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఆగిపోతాయి, ఎవరికి, ఎప్పుడో తెలుసా?
యూపీఐ వ్యవస్థ ఇప్పుడు సర్వజనీనమయిపోయింది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకూ అందరూ స్కానర్ ద్వారా పేమెంట్స్ కి ప్రాధాన్యతనిస్తున్నారు. నెలా నెలా పెరుగుతున్న లావాదేవీలతో యూపీఐ పేమెంట్స్ రికార్డుల మోత మోగిస్తోంది. అయితే తాజాగా బ్యాంకుల నిర్వహణ కోసమంటూ యూపీఐ కార్యకలాపాలు బంద్ చేయబోతున్నారు. రెండు రోజుల పాటు వాటిని నిలిపివేసే అవకాశం ఉంది. నవంబర్ లోనే HDFC బ్యాంక్ తన ఖాతాదారులకు ఈ సేవలు నిలిపివేయబోతోంది. తొలుత HDFC అకౌంట్ హోల్డర్లకు రెండు…
పాకిస్తాన్ ఉగ్రవాద పీచమణచమంటే కరాచీ బేకరీలు, మైసూర్ పాక్ పేర్లు మారుస్తారా?
ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్ పనిబడతారని అంతా ఆశించారు. కానీ భారత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సాగింది. పట్టు చిక్కుతున్న దశలో జారవిడిచేసేసింది. అమెరికా ఆదేశాలతో గట్టి ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేసింది. వాస్తవానికి సైనిక చర్యకు ముందే పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు దౌత్య యుద్ధం జరగాలి. ప్రపంచమద్ధతు కోరాలి. కానీ ఇప్పుడు చేతులు కాల్చుకుని పలువురిని ప్రపంచంలోని వివిధ దేశాలకు తరలించారు. దాని వల్ల ప్రయోజనమెంత అన్నది ప్రశ్నార్థకమే….
హుందాగా అల్లు అర్జున్, విడుదల తర్వాత పెదవి విప్పిన ఐకాన్ స్టార్
పుష్ప2 ద్వారా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన అల్లు అర్జున్ అనుకోని కష్టాల్లో ఏకంగా జైలు పాలుకావడం సంచలనంగా మారింది. చివరకు ఒకరోజు జైలులో గడిపిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. తొలుత భార్య బిడ్డల దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్ అక్కడే మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన హుందాగా వ్యవహరించడం ఆకట్టుకుంది. “చట్టాన్ని…
షర్మిల రాజకీయ సలహాదారుగా ఏబీఎన్ ఆర్కే..!జగన్ ఆస్తుల తగాదా ఇప్పట్లో చల్లారదా?
ఏబీఎన్ రాధాకృష్ణ ఆసక్తికర పాత్ర పోషిస్తున్నారు. కొంతకాలంగా ఆయన రెండు పడవల మీద కాలేశారు. ఓవైపు టీడీపీని ఉద్దరించడమే లక్ష్యంగా చేసుకున్న ఆయన అదే సమయంలో షర్మిలకు చేదోడుగా నిలవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిలను రాజకీయంగా ఎదగించేందుకు ఆర్కే తపన పడడమే ఆసక్తికరం. ఏబీఎన్ రాధాకృష్ణకు వైఎస్సార్ అంటే అసలు గిట్టదు. ఆయన సీఎంగా ఉన్న సయమంలోనూ ఆంధ్రజ్యోతి రెచ్చిపోయింది. ఆరెండు పత్రికలూ అంటూ ఈనాడుతో కలిపి జ్యోతిని వైఎస్సార్ నిందించాల్సి వచ్చేది….
విరాట్ వైఫల్యం టీమిండియాకు శాపంగా మారుతోందా? సీనియర్లే టీమ్ కి భారమా?
టీమిండియా తీవ్రంగా సతమతమవుతోంది. ముఖ్యంగా టెస్టుల్లో జట్టు కుదురుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గడిచిన ఐదు టెస్టుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. నాలుగు టెస్టుల్లో ఓటమి పాలయ్యింది. బ్రిస్బేన్ లో వర్షం ఆపకపోతే ఐదో టెస్ట్ ఓటమి అంచున ఉంది. ఆస్ట్రేలియాకు సిరీస్ అప్పగించే పనిలో కనిపిస్తోంది. జట్టులో ఆటగాళ్లు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమవుతున్నారు. బౌలింగ్ లో బుమ్రా, బ్యాటింగ్ లో కొంత మేర కేఎల్ రాహుల్ మినహా మిగిలిన వాళ్లంతా…
ట్రంప్- మస్క్ బంధం చెడింది! ‘బ్రొమాన్స్’ ముగిసింది!
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన రాజ్యాధినేతకు, బడా బిలియనీర్కు మధ్య ఇన్నాళ్లూ కొనసాగిన బ్రొమాన్స్ ఇక ముగిసిపోయింది. అమెరికా ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగిన వ్యక్తి ఎలాన్ మస్క్. అమెరికాలో ఎంతో మంది బిలియనీర్లు, టెక్ జెయింట్లు ఉన్నా.. కేవలం మస్క్ మాత్రమే డొనాల్డ్ ట్రంప్ను బహిరంగంగా సపోర్ట్ చేస్తూ.. డెమోక్రటిక్ పార్టీని విమర్శిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ట్రంప్ ఎక్కడకు వెళ్తే.. అక్కడకు వెంట వెళ్లాడు…
కార్యకర్తలే బలిపశువులు, చంద్రబాబు, జగన్ ఎవరైనా అదే తంతు!
అధికారంలో టీడీపీ ఉందా లేక వైఎస్సార్సీపీనే కొనసాగుతుందా అన్నది తెలీయడం లేదు- ఇదీ ఓ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. అంతకుముందు వైఎస్సార్సీపీ హయంలోనూ ఇలాంటి మాటలే వినిపించాయి. ఇంకా చెప్పాలంటే మేమంతా కష్టపడితే గెలిచిన సీఎం ఈయనేనా అని అప్పుడూ, ఇప్పుడూ సందేహించే పరిస్థితి ఆయా పార్టీల శ్రేణుల్లో ఉంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఏలూరు పరిస్థితి చూద్దాం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ శ్రేణుల మీద పలు కేసులు పెట్టారు. ఆ…
విజయసాయిరెడ్డి కరెక్ట్ ఆప్షన్ ఎంచుకున్నారా?
వైఎస్సార్సీపీని వీడిపోయిన విజయసాయిరెడ్డి రేపోమాపో కాషాయ కండువా కప్పుకుంటారు. అది తక్షణమే జరుగుతుందా, కొన్ని నెలల తర్వాత జరుగుతుందా అన్నదే ప్రశ్న. నేరుగా వైఎస్సార్సీపీ నుంచి బీజేపీలో చేరితే తన అభిమానులు జీర్ణించుకునే అవకాశం లేదు కాబట్టి కొంత విరామం తీసుకుని ఆయన మళ్లీ బీజేపీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీని వీడడం ద్వారా ఆపార్టీ కంటే వ్యక్తిగతంగా జగన్ ఎక్కువ నష్టపోతారనడం కూడా నిస్సందేహం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుట్టంతా…