మంచు ఇంట్లో చిచ్చు, మోహన్ బాబు మీద మనోజ్ ఫ్యామిలీ ఫిర్యాదు!

ఆస్తుల కోసం, పెత్తనం కోసం సాగే వివాదాలు ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టడం చాలా సహజం. అందులో చిన్నా, పెద్దా, సెలబ్రిటీ అన్న తేడా ఏమీ ఉండదని తాజాగా మంచు ఫ్యామిలీ నిరూపిస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారంలో తగాదా తారస్థాయికి చేరింది. తాజాగా తమకు అన్యాయం జరుగుతోందంటూ మోహన్ మీద మంచు మనోజ్, ఆయన భార్య ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది. చిత్తూరు జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారంలో మంచు విష్ణు,…

Read More

గోదావరి పుష్కరాల ముహూర్తమిదే, ఈసారి వచ్చే యాత్రికులెందరంటే!

కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. దీంతో, ప్రభుత్వం..స్థానిక నేతలు – యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనుల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాజాగా పుష్కరాల నిర్వహణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి…

Read More

అన్నం- చపాతి, ఏది బెస్ట్, ఏం తినాలి?

చాలామంది ఆహారం విషయంలో సందిగ్ధం ఉంటుంది. తమ ఆరోగ్యానికి ఏది మంచిదన్న సందేహాలు చుట్టుముడుతూ ఉంటాయి. ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో అన్నమే ప్రధాన ఆహారం. ఉత్తరాది రాష్ట్రాలలో రొట్టెలు, చపాతీలు ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ కాలం మారుతోంది. క్రమంగా ఆహారపు ఆలవాట్లలో కూడా మార్పులు వస్తున్నాయి. షుగర్, బిపి, అధిక బరువు, హార్మోన్ సమస్యలు వంటివి ప్రభావితం చేస్తున్న దశలో అందరూ ఆహారం మీద కేంద్రీకరణ పెంచుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం కోసమంటూ కొందరు అన్నానికి బదులు…

Read More

ఆ పెళ్లి మీద ట్రోలింగ్ ఎందుకు బ్రో..?

సినీ నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ గడుపుతున్నారు. అందులో హీరో ప్రభాస్, టీవీ స్టార్లు యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి వాళ్ల పేర్లుంటాయి. చాలాకాలం పాటు వెయిట్ చేసిన సుబ్బరాజు ప్రస్తుతం వాళ్ల లిస్టు నుంచి బయటపడడం విశేషమే. చాలాకాలంగా తన పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తున్న సుబ్బరాజు తాజాగా తన వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్…

Read More

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ సిగ్గుపడాల్సిన విషయం! ఏపీకి ఇలా, కర్ణాటకలో అలా!

వైజాగ్ స్టీల్ అవస్థలు పడుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో అతలాకుతలం అవుతోంది. ఇంకా చెప్పాలంటే ఉన్నత స్థానంలో ఉన్న సంస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో రాష్ట్రీయ ఇష్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊపిరితీసే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో కర్ణాటకలో అందుకు భిన్నంగా సాగుతోంది. భద్రావతిలో ఉన్న సర్ ఎం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీని పరిరక్షించుకునేందుకు పెద్దమొత్తంలో కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా 15వేల కోట్ల…

Read More

గ్యాస్ ధర మళ్లీ పెరిగింది!విమాన ఛార్జీల వాయింపే!!

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీకి శ్రీకారం చుడుతున్న వేళ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గ్యాస్ సిలెండర్ ధర పెంచింది. ఓవైపు పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారుతున్న వేళ దేశీయంగా గ్యాస్ కంపెనీలు ధరలు సవరించడం ఆందోళనకరంగా మారుతోంది. దీపావళి పండుగ తెల్లవారే గ్యాస్ సిలెండర్ల ధర సవరిస్తూ ప్రకటన వెలువడింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలెండర్ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. చమురు కంపెనీలు తాజాగా విడుదల చేసిన ధరల…

Read More

సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లికి అంతా రెడీ

ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ మరోసారి పెళ్లి పీటలెక్కుతున్నాడు. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధమయ్యింది. నవంబర్ 10న వారి వివాహం జరుగుతుంది. 16వ తేదీన బంధు మిత్రులు, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటుచేశారు. డైరెక్టర్ క్రిష్ కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆమె కూడా డాక్టర్ రమ్య వైద్యురాలే. తొలుత అమెరికాలో గడిపిన జాగర్లమూడి క్రిష్‌ ఆ తర్వాత సినిమాల…

Read More

పీకే అక్కడ ఏమీ పీకలేకపోతున్నారు, యువత తిరుగుబాటుతో తలపట్టుకున్న నేత

ఎన్నికల వ్యూహకర్త ముసుగులో సకల అరాచకాలకు శ్రీకారం చుట్టిన ప్రశాంత్ కిషోర్ కి సొంత రాష్ట్రంలో చీవాట్లు తప్పడం లేదు. 2014లో బీజేపీ, 2019లో వైఎస్సార్సీపీ, 2024లో టీడీపీ కోసం పనిచేసి అడ్డమైన పనులతో ప్రజలను నమ్మించడానికి తెగించిన ఈ తుంటరికి తగిన శాస్తి జరుగుతోందంటూ గిట్టని వారు సంతోషపడుతుండడం విశేషం. ఒక ఎన్నికల్లో బీజేపీకి, ఆ వెంటనే కాంగ్రెస్ కి కూడా పనిచేసిన నేపథ్యం అతడిది. ఏపీలో కూడా వైఎస్సార్సీపీకి, టీడీపీ కి మద్ధతుగా నిలిచిన…

Read More

తెలుగువారిని అంతఃపురం సేవకులుగా వర్ణించిన సినీ నటి!

సినీ నటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలుగువారి పట్ల చేసిన విమర్శలు ఆమెను వివాదాల్లోకి నెట్టాయి. ఆ నటి తీరు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకి ఆమె తలొగ్గాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా సీనియర్ నటి కస్తూరి కామెంట్స్ కారణంగా చెలరేగిన కలకలం తర్వాత పరిస్థితి. తాజాగా తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారి గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇచ్చారు. ఆమె తెలుగువారినుద్దేశించి చేసిన…

Read More

ఉపాధ్యాయుల ఒత్తిడికి తలొగ్గిన నారా లోకేశ్

ఏపీ విద్యాశాఖ మంత్రి వెనకడుగు వేశారు. ఓవైపు ఉపాధ్యాయులు, మరోవైపు సంఘాలు ఒత్తిడి తీసుకురావడంతో నిర్ణయం ఉపసంహరించుకున్నారు. హైస్కూళ్ల సమయాలు మార్చాలన్న నిర్ణయం మార్చుకున్నారు. దాంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. డిసెంబరు 2 నుంచి పాఠశాలల వేళలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి అమలుచేసేందుకు పూనుకున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పాఠశాలలు…

Read More