ఇకపై‌ ఆ విన్యాసాలు కుదరవు..క్రికెట్ లో కొత్త రూల్

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే మార్లిబాన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) క్రికెట్ క్తాచింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. ఎంసీసీ రూల్స్‌నే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అమలు చేస్తుంది. ఇటీవల కాలంలో బౌండరీల వద్ద క్యాచ్‌లు పట్టే సమయంలో ఫీల్డర్ల విన్యాసాలను మనం చూస్తూనే ఉన్నాం. బౌండరీల వద్ద క్యాచ్ చేసే సమయంలో బ్యాలెన్స్ కోల్పోతున్నామని అనుకున్నప్పుడు.. బంతిని గాల్లోకి విసిరి.. బౌండరీ దాటి వెళ్లి..‌మళ్లీ తిరిగి వచ్చి బంతులు పడుతున్నారు. టీ20 వరల్డ్…

Read More

ప్రజారోగ్యం పడకేస్తోంది.. ఆరోగ్య మంత్రి ఏమయ్యారో?

ఆంధ్రప్రదేశ్‌ లో వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే పీజీ కోర్సుల్లో చేరే వైద్య విద్యార్థుల విషయంలో ప్రభుత్వ తీరు మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. నేరుగా మంత్రి సత్యకుమార్ నే నిలదీశారు. గుంటూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్నలకు మంత్రి ఖంగుతిన్నారు. పీజీ కోసం ఫీజులు ఖరారు చేయకుండా అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేసి పీజీలో ఫీజులు పెంచే ప్రతిపాదన మీద మండిపడ్డారు. అది మరచిపోకముందే తాజాగా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు నిరసనలకు…

Read More

యురేనియం తవ్వకాలపై పవన్ వైఖరి మారిందా?

ప్రతిపక్ష నాయకులు చేసే పోరాటం ఆ కాలానికే సరిపోతుందా? వారు అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పరిష్కరించలేరా? నేడు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నాయకులు గతంలో చెప్పిన మాట ఏమిటి ? నేడు చేస్తుంది ఏమిటి? యురేనియం తవ్వకాలను ఆపాలి.. నల్లమల అడవులను రక్షించాలని నాటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి లు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఇది తెలుగు వారి సమస్యని రాష్ట్రాలను పక్కన పెట్టీ…

Read More
చత్తీస్‌ఘడ్‌ సచివాలయం మహానది భవనం

గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సిటీ: అమరావతి కన్నా ముందుగా కట్టిన నవా రాయ్‌పూర్ నేర్పుతున్న పాఠమేంటి?

దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అన్న గురజాడ మాటలు గుర్తురాక తప్పదు. ఎందుకంటే రాజధాని అంటే అందమైన భవనాలు, అదిరిపోయే రోడ్లు, ఆకట్టుకునే నిర్మాణాలు మాత్రమే కాదని..అక్కడ నివశించే జనాలని పాలకులకు అర్థమయ్యేలా చెబుతున్న పాఠం ఇది. ఎంత అందంగా డిజైన్ చేశామో, ఎంత అద్భుతంగా నిర్మించామో, ఎంత పెద్దమొత్తంలో ఖర్చు చేశామో అన్నది ఏ నగరానికి కొలబద్ధ కాదనే వాస్తవాన్ని చాటుతున్న విషయమిది. దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సిటీ నిర్మాణానికి చత్తీస్‌ఘడ్‌ శ్రీకారం చుట్టింది….

Read More

జమిలీ వచ్చినా కూటమిగానే బరిలోకి, తేల్చేసిన చంద్రబాబు

ఏపీలో జమిలీ ఎన్నికల అవకాశాన్ని పాలకపక్షాలు కూడా గుర్తించాయి. దానికి తగ్గట్టుగా సన్నద్దమవుతున్నాయి. ఇప్పటికే పాలకకూటమిలోని మూడు పార్టీల మధ్య పలు చోట్ల విబేధాలు పొడచూపినప్పటికీ కూటమి మాత్రం కొనసాగుతుందన్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. తమ పార్టీ శ్రేణులకు దానికి తగ్గట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం లో శాంతి భద్రతలు క్షీణించినట్టు ఇప్పటికీ డీసీఎం పవన్ కళ్యాణ్ విమర్శించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయినప్పటికీ సర్ధుకుపోవడమేనని టీడీపీ భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే…

Read More

ఫీజు రీయంబెర్స్మెంట్ రాకపోవడంతో పిల్లలకు భోజనాలు లేవు- మంత్రి నారా లోకేశ్ చూస్తున్నారా?

కాకినాడలో ఓ నర్సింగ్ కాలేజ్ యజమాన్యం అడ్డగోలుగా వ్యవహరించింది. విద్యార్థులను రోడ్డుకి నెట్టింది. ఫీజు రీయంబెర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఫీజులు కట్టని పిల్లలకు భోజనాలు పెట్టలేం అంటూ హాస్టల్ మూసేసింది. దాంతో విద్యార్థులు తీవ్రంగా సతమతమయ్యారు. చివరకు సమీపంలోని ఫంక్షన్ హాళ్లలో ఓ పూట కడుపు నింపుకున్నారు. కానీ ఆదివారం నాడు అలాంటి అవకాశం కూడా లేకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జోక్యం చేసుకుని ఆర్డీవో మల్లిబాబుని కాలేజ్…

Read More

దళిత చేతిలో బీజేపీ పగ్గాలు పెడతారా, వ్యూహాత్మక ప్రచారమా?

బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం కొంతకాలంగా నానుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర క్యాబినెట్లో చేరిన జేపీ నడ్డా రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం వరకూ ఆయన పార్టీ పగ్గాలు మోస్తానని ప్రకటించారు. కానీ తీరా 8 నెలలుగా ఆ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి ఫిబ్రవరి నాటికి నూతన అధ్యక్షుడి విషయంలో స్పష్టత వస్తుందన్న ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి…

Read More

ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?

ప్రపంచం బాధను తన బాధగా భావిస్తారని శ్రీ శ్రీ గురించి.. తన బాధను ప్రపంచం బాధగా చూస్తారని కృష్ణశాస్త్రి గురించి సాహితీ లోకంలో ఉన్న టాక్. ఇప్పుడు టీడీపీ సానుభూతిపరుల్లో కొందరు శ్రీ శ్రీలు, ఇంకొందరు కృష్ణశాస్త్రిలుగా మారిపోయినట్టే కన్పిస్తోంది. జీవీ రెడ్డి-దినేష్ కుమార్ ఎపిసోడులో కొందరు శ్రీ శ్రీలుగా మారిపోయారు.. ఇంకొందరు కృష్ణశాస్త్రిలుగా మారిపోయారు. ఎవరి అభిప్రాయాలను వారు చెప్పేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా చంద్రబాబు కంటే జీవీ రెడ్డే గ్రేట్ అనే స్థాయిలో కామెంట్లు కూడా…

Read More

జనసేన నాయకుడి ఇంట్లో బాలుడి అనుమానాస్పద మృతి, దర్యాప్తు కోసం ఆందోళన

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడి ఇంట్లో బాలుడి మృతి కలకలం రేపుతోంది. బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ఎల్బీనగర్ కు చెందిన ఆటోడ్రైవర్ కుక్కల మల్లేశ్వరరావు కుమారుడు కుక్కల చరణ్ శ్రీ తేజ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ ఇంటికి సమీపంలోనే ఉన్న రాజేశ్వరి రెసిడెన్సీ వద్ద ఈ ఘటన జరిగింది. అపార్ట్ మెంట్ వాచ్…

Read More

మంచు ఇంట్లో చిచ్చు, మోహన్ బాబు మీద మనోజ్ ఫ్యామిలీ ఫిర్యాదు!

ఆస్తుల కోసం, పెత్తనం కోసం సాగే వివాదాలు ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టడం చాలా సహజం. అందులో చిన్నా, పెద్దా, సెలబ్రిటీ అన్న తేడా ఏమీ ఉండదని తాజాగా మంచు ఫ్యామిలీ నిరూపిస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారంలో తగాదా తారస్థాయికి చేరింది. తాజాగా తమకు అన్యాయం జరుగుతోందంటూ మోహన్ మీద మంచు మనోజ్, ఆయన భార్య ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది. చిత్తూరు జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారంలో మంచు విష్ణు,…

Read More