నితీశ్ కెరీర్ కి మీడియా హైప్ ముప్పుగా మారుతుందా?

టీమిండియా ఆటగాళ్ళను ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పతనానికి పడేయడం చాలా సహజం. ఒక్క మ్యాచ్ లో లేదా ఒక సిరీస్ లో రాణించగానే అంతా, ఇంతా అంటూ కొనియాడడం, అంతలోనే కొన్ని ఫెయిల్యూర్స్ కి తీవ్రంగా నిందించడం అనేది అభిమానులకే కాదు మీడియాకు కూడా అలవాటు. తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి ఉదంతం చూస్తుంటే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. మెల్బోర్న్ లో అద్భుతంగా రాణించిన ఆటగాడి పట్ల మీడియా స్పందించిన తీరు అతిగా ఉందనే వాదన వినిపిస్తోంది….

Read More

పోలీసులే హద్దులు మీరితే ఎలా? క్షమాపణలు చెప్పిన హైదరాబాద్ సీపీ

అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వివాదంలో పోలీసులు కొందరు చేస్తున్న అతి వివాదాలకు దారితీస్తోంది. అల్లు అర్జున్ ని విలన్ గా చిత్రీకరించాలని సీఎం సంకల్పించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వీరంగం చేసిన ఏసీపీ వంటి వాళ్లు అందులో పావులుగా మారారు. ఆఖరికి సీనియర్ అధికారి, హైదరాబాద్ సీపీ కూడా ఆ క్రమంలో హద్దులు మీరి అనవసర వివాదంలో చిక్కుకున్నారు. చివరకు క్షమాపణలు చెప్పాల్సి…

Read More

నాగార్జున వియ్యంకుడు దుబాయ్ లో చానా రిచ్!

అఖిల్ అక్కినేని మరోసారి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పటికే ఓసారి జీవీకే మనుమరాలు శ్రేయస్ భూపాల్ తో నిశ్చితార్థం వరకూ వెళ్ళి వెనక్కి తగ్గిన ఈ అక్కినేని చిన్నోడు ఈసారి కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న తన సహచరి జైనబ్ రావుడ్జీతో పెళ్లికి రెడీ అవుతున్నాడు. జైనబ్ కుటుంబానికి దుబాయ్ లో పెద్ద నెట్ వర్క్ ఉంది. పశ్చిమాసియాలోనే పలుకుబడి కలిగిన బడా బిజినెస్ మేన్ ఆమె తండ్రి. గతంలో ఎనర్జీ సెక్టార్ లో…

Read More

అమరావతి – నవారాయ్‌పూర్ రెండు నగరాల అనుకూల, ప్రతికూలతలేంటి?

ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ నగరాల అభివృద్ధి విషయంలో భిన్నమైన అనుభవాలున్నాయి. అభివృద్ధి విషయంలోనే భిన్న పాఠాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తే విజయవాడ వంటి నగరాలను తోసిరాజని విశాఖపట్నం దూసుకుపోయిన తీరు అందుకు ఓ కొలమానం. దేశవ్యాప్తంగా గాంధీనగర్, నవా రాయ్‌పూర్ అనుభవాలున్న సమయంలోనే నోయిడా లాంటివి కూడా మనకి కనిపిస్తాయి. ఇలాంటి అనేక నగరాలను పరిశీలిస్తే అర్థమవుతున్న అంశం ఒక్కటే. ఉపాధి కల్పన, సామాన్యులకు నివాసయోగ్యంగా ఉండే ప్రాంతాలు మాత్రమే అభివృద్ది అయ్యాయి. మిగిలిన ప్రాజెక్టులన్నీ కునారిల్లిపోతున్నాయి. హైదరాబాద్ కి…

Read More

చంద్రబాబుకి పోలీసు విన్నపం, వైరల్ అవుతున్న లేఖ! రాసినందుకు చర్యలు ఖాయమా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డీసీఎం పవన్ కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ పేరుతో రాసిన లేఖ వైరల్ అవుతోంది. తీవ్ర మనోవేధనతో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆవేదన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతనలేదంటూ పోలీస్ శాఖ ఉద్యోగి వాపోయిన తీరు వైరల్ అవుతోంది. తమ మీద ఇంత వివక్ష ఎందుకంటూ ప్రశ్నించిన తీరు ఆలోచన రేకెత్తించేలా ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్…

Read More

అక్కడ అన్ని పార్టీలు ఒక్కటే, మరిక్కడ ఇలా కలిసెళ్లి విజయవాడ వరద సహాయం అడగలరా?

పైన ఫోటోలో కేంద్ర హోం శాఖ మంత్రికి వినతిపత్రం అందిస్తున్న నేతలంతా ఒక్క పార్టీ కాదు. కానీ ఒక్క రాష్ట్రం వారే. తమ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల వరకూ తామంతే ఒకటేనని చాటుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని కేంద్రం మీద ఒత్తిడి పెంచుతున్నారు. కేరళకి చెందిన ఎంపీలతో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమావేశం నిర్వహించారు. అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. తమ అభిప్రాయాలు వ్యక్త పరిచారు. ఉమ్మడిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నించాలని నిర్ణయించారు. అందులో…

Read More

జర్నలిస్టుల సంక్షేమ పథకాలకు బడ్జెట్లలో నిధులు కేటాయించండి

దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర.. బడ్జెట్లలో అవసరమైన మేరకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాలను తమ జాతీయ రాష్ట్ర కార్యవర్గాల ద్వారా కోరడం జరుగుతుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి( ఎన్ ఏ జె)ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు.. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు.. బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రతిసారి తాము కేటాయింపులు కోసం వినతి పత్రాలు అందిస్తూనే ఉన్నామన్నారు.. జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు.. ఆరోగ్య…

Read More

యురేనియం తవ్వకాలపై పవన్ వైఖరి మారిందా?

ప్రతిపక్ష నాయకులు చేసే పోరాటం ఆ కాలానికే సరిపోతుందా? వారు అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పరిష్కరించలేరా? నేడు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నాయకులు గతంలో చెప్పిన మాట ఏమిటి ? నేడు చేస్తుంది ఏమిటి? యురేనియం తవ్వకాలను ఆపాలి.. నల్లమల అడవులను రక్షించాలని నాటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి లు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఇది తెలుగు వారి సమస్యని రాష్ట్రాలను పక్కన పెట్టీ…

Read More

ఆడబిడ్డల భద్రతే మొదటి ప్రాధాన్యం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువు తీరి కేవలం నాలుగైదు మాసాలే అయింది. ఈ సమయంలోనే ఏదో జరిగిపోయినట్లు వైసీపీ నాయకులు,వారి మద్దతుదారులు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసే వారిని ఇకపై ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, మద్దతుదారులు ఘోరమైన ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారం మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. మహిళలపై ఎవరు అసభ్య దూషణలు చేసినా…

Read More