మహానటి కీర్తి సురేష్ పెళ్లి , ప్రేమించి పెళ్లి పీటలెక్కిన స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడారు. ఆంటోని తెట్టిల్ ను గోవా వేదికగా జరిగిన పెళ్లిలో సంప్రదాయబద్ధంగా మనువాడారు. కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటి సినిమాతో ఆమెకు జాతీయ అవార్డ్ కూడా దక్కింది. తెలుగులో స్టార్ హీరోలు మహేష్ బాబు సహా పలువురి సరసన నటించి, మెప్పించింది. అయితే తన చిన్న నాటి స్నేహితుడితో ప్రేమాయణం విషయాన్ని…

Read More

దీపావళి హిట్ కొట్టేసిన ఆ మూడు సినిమాలు ఓటీటీలో ఎక్కడంటే..!

ఈసారి పండుగ సినీ ఇండస్ట్రీకి సంతోషాన్ని నింపింది. ఒకేసారి విడుదలయిన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. అందులో తెలుగు హీరో కిరణ్‌ అబ్బవరం సినిమా క మంచి మార్కులు దక్కించుకుంది. దాంతో పాటుగా తమిళ్ స్టార్ శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్ తో పాటుగా మళయాళీ యంగ్ హీరో దుల్కర్ సల్మన్ స్ట్రయిట్ మువీ లక్కీ భాస్కర్ సైతం మంచి రెస్పాన్స్ సాధించాయి. పాజిటివ్ గా ఓపెనింగ్స్ కనిపించాయి. ఇప్పుడీ మూడు సినిమాలు…

Read More

బోరుగడ్డ అనిల్ కేసులో టీవీ5 ప్రతినిధి అరెస్ట్

ఏపీలో విపక్షం మీదనే కాదు.. టీడీపీ గొంతుగా మారిన టీవీ5 జర్నలిస్టులను కూడా పోలీసులు వదలడం లేదు. తాజాగా గుంటూరులో టీవీ5 జర్నలిస్ట్ పాలడుగు వంశీకృష్ణను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గుంటూరులో ఆయన కెమెరామేన్ గా పనిచేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. బోరుగడ్డ అనిల్ కుమార్ రిమాండ్ లో ఉన్న కాలంలో ఆయనకు సకల సదుపాయాలు కల్పించారంటూ టీవీ5 కొన్ని కథనాలు ప్రచారం చేసింది. పోలీస్ స్టేషన్ కి చెందిన సీసీ ఫుటేజ్ ను…

Read More

ఫీజు రీయంబెర్స్మెంట్ రాకపోవడంతో పిల్లలకు భోజనాలు లేవు- మంత్రి నారా లోకేశ్ చూస్తున్నారా?

కాకినాడలో ఓ నర్సింగ్ కాలేజ్ యజమాన్యం అడ్డగోలుగా వ్యవహరించింది. విద్యార్థులను రోడ్డుకి నెట్టింది. ఫీజు రీయంబెర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఫీజులు కట్టని పిల్లలకు భోజనాలు పెట్టలేం అంటూ హాస్టల్ మూసేసింది. దాంతో విద్యార్థులు తీవ్రంగా సతమతమయ్యారు. చివరకు సమీపంలోని ఫంక్షన్ హాళ్లలో ఓ పూట కడుపు నింపుకున్నారు. కానీ ఆదివారం నాడు అలాంటి అవకాశం కూడా లేకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జోక్యం చేసుకుని ఆర్డీవో మల్లిబాబుని కాలేజ్…

Read More

సీఎం రమేశ్ ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి పంపించిన ఎంపీ

అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేశ్ కి షాక్ తగిలింది. ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం తగదంటూ ఆయనకు సహచర మంత్రి హితువు పలికారు. ఖరీదైన కానుకలతో ఎంపీలను మభ్యపెట్టాలనే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. బీహార్ ఎంపీ సుదామ ప్రసాద్ తీరుతో సీఎం రమేశ్‌ ఖంగుతినాల్సి వచ్చింది. పార్లమెంట్ లో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేశ్ ఉన్నారు. ఆయన నాయకత్వంలోని కమిటీ స్టడీ టూర్ కి వెళ్లిన సమయంలో కమిటీ సభ్యులకు…

Read More

బాహుబలిలో బిజ్జాలదేవుడిలా జగన్ కి సజ్జల అన్నట్టేనా, ఎందుకలా?

బాహుబలి గుర్తుంది కదా. అందులో బిజ్జలదేవుడి పాత్రనే సజ్జల రామకృష్ణారెడ్డి పోషిస్తున్నారా.. ఎందుకో వైఎస్సార్సీపీ క్యాడర్ లో మెజార్టీ అలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. అధికారంలో ఉండగా అన్నీ తానై అన్నట్టుగా చక్రం తిప్పిన సజ్జల తీరు మీద నోరుమెదపలేకపోయారు గానీ ఆ తర్వాత చాలా గగ్గోలు పెట్టారు. అయినా గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వెంట సజ్జల మినహా మరొకరికి ఛాన్స్ ఉండదని చెబుతున్నారు. తాజాగా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్…

Read More

ఏపీ పీఏసీ కోసం ఎన్నికలే, ఏకగ్రీవానికి అంగీకరించని కూటమి నేతలు

సంప్రదాయానికి భిన్నంగా సాగుతోంది ఎన్డీయే ప్రభుత్వం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని విపక్షానికి అప్పగించడం 1966 నుంచి అమలవుతోంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆపార్టీ పక్షాన పులవర్తి రామాంజనేయులుకి పీఏసీ దక్కబోతోంది. తొలుత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని వైఎస్సార్సీపీ ప్రతిపాదించగానే ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు ప్రచారం సాగుతోంది. దాంతో అంతా ఏకగ్రీవం అనుకున్నారు. తీరా అందుకు భిన్నంగా జనసేన నేతను బరిలో దింపాలని కూటమి నేతలు…

Read More

గోదావరి పుష్కరాల ముహూర్తమిదే, ఈసారి వచ్చే యాత్రికులెందరంటే!

కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. దీంతో, ప్రభుత్వం..స్థానిక నేతలు – యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనుల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాజాగా పుష్కరాల నిర్వహణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి…

Read More

మెడికల్ కాలేజీల పీపీపీపై చంద్రబాబు ముందుకే, జగన్ వార్నింగ్స్ పనిచేస్తాయా?

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల అమ్మకానికి పూనుకుంది. టెండర్లు పిలుస్తోంది. పీపీపీ మోడల్ అంటూ ప్రైవేటుపరం చేస్తోంది. ప్రజలు వ్యతిరేకిస్తున్నా, విపక్షం హెచ్చరిస్తున్నా కూటమి సర్కారు పట్టనట్టే ముందుకెళ్తోంది. ఏపీలోని కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇక రావని చాటుతోంది. పూర్తి వివరాలు కింద వీడియోలో

Read More

విరాట్ వైఫల్యం టీమిండియాకు శాపంగా మారుతోందా? సీనియర్లే టీమ్ కి భారమా?

టీమిండియా తీవ్రంగా సతమతమవుతోంది. ముఖ్యంగా టెస్టుల్లో జట్టు కుదురుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గడిచిన ఐదు టెస్టుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. నాలుగు టెస్టుల్లో ఓటమి పాలయ్యింది. బ్రిస్బేన్ లో వర్షం ఆపకపోతే ఐదో టెస్ట్ ఓటమి అంచున ఉంది. ఆస్ట్రేలియాకు సిరీస్ అప్పగించే పనిలో కనిపిస్తోంది. జట్టులో ఆటగాళ్లు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమవుతున్నారు. బౌలింగ్ లో బుమ్రా, బ్యాటింగ్ లో కొంత మేర కేఎల్ రాహుల్ మినహా మిగిలిన వాళ్లంతా…

Read More