బాలినేని బల ప్రదర్శనకు అడ్డంకులు ఏమిటి ?

బహిరంగ వేదికలపై టీడిపి, జనసేన నాయకుల కోట్లాటలు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు తల నొప్పిగా మారాయి. ఇలాంటి ఘటనల వలన… వలస నేతలను చేర్చుకునేందుకు టిడిపి జనసేనలు భయపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో మొదలయిన ఈ అసంతృప్త జ్వాలలు అన్నీ నియోజకవర్గాలకు విస్తరించాయి. ఒంగోలు, దెందులూరు, నెల్లిమర్ల,పిఠాపురం నియోజకవర్గాల బాటలో చాలా నియోజకవర్గాలు చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరి దాదాపు 50 రోజులు పైనే…

Read More

దీపావళి హిట్ కొట్టేసిన ఆ మూడు సినిమాలు ఓటీటీలో ఎక్కడంటే..!

ఈసారి పండుగ సినీ ఇండస్ట్రీకి సంతోషాన్ని నింపింది. ఒకేసారి విడుదలయిన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. అందులో తెలుగు హీరో కిరణ్‌ అబ్బవరం సినిమా క మంచి మార్కులు దక్కించుకుంది. దాంతో పాటుగా తమిళ్ స్టార్ శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్ తో పాటుగా మళయాళీ యంగ్ హీరో దుల్కర్ సల్మన్ స్ట్రయిట్ మువీ లక్కీ భాస్కర్ సైతం మంచి రెస్పాన్స్ సాధించాయి. పాజిటివ్ గా ఓపెనింగ్స్ కనిపించాయి. ఇప్పుడీ మూడు సినిమాలు…

Read More

సీఎం రమేశ్ ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి పంపించిన ఎంపీ

అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేశ్ కి షాక్ తగిలింది. ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం తగదంటూ ఆయనకు సహచర మంత్రి హితువు పలికారు. ఖరీదైన కానుకలతో ఎంపీలను మభ్యపెట్టాలనే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. బీహార్ ఎంపీ సుదామ ప్రసాద్ తీరుతో సీఎం రమేశ్‌ ఖంగుతినాల్సి వచ్చింది. పార్లమెంట్ లో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేశ్ ఉన్నారు. ఆయన నాయకత్వంలోని కమిటీ స్టడీ టూర్ కి వెళ్లిన సమయంలో కమిటీ సభ్యులకు…

Read More

రాజ్యసభలో డబ్బు కట్టలు

భారత పార్లమెంట్ లోని ఎగువ సభ రాజ్యసభలో డబ్బులు కలకలం రేపాయి. డబ్బుల కట్ట లభించడంతో అంతా అప్రమత్తమయ్యారు. రాజ్యసభ చైర్మన్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. అమెరికాలో అదానీ మీద కేసుల గురించి చర్చించాలని విపక్షం పట్టుబడుతోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించాలని డిమాండ్ చేస్తోంది. శుక్రవారం కూడా సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు ఇరుసభల్లో ఆందోళనకు పూనుకున్నారు. అదే సమయంలో రాజ్యసభలో డబ్బుల కట్ట దుమారం రేపుతోంది. ఎంపీ అభిషేక్‌…

Read More

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుందా, పనులేమయినా జరుగుతున్నాయా?

అమరావతిలో రాకపోకలకు కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం ఆరేళ్ల పాటు ఒక్క అడుగు కూడా పడలేదు. ఏపీ రాజధాని నగర నిర్మాణంలో ముఖ్యమైన రోడ్డు పనులు సాగకపోవడంతో సీఎం, చీఫ్‌ జస్టిస్ సహా అంతా అవస్థలు పడ్డారు. కరకట్ట రోడ్డుని ఆశ్రయించక తప్పని స్థితిలో సాగారు. అయితే రైతులు భూములివ్వకపోవడం వల్ల వెంకటపాలెంలో ఆగిన రోడ్డులో చిన్న పాటి కదలిక వచ్చింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో వీడియోలో చూడండి

Read More

బ్యాటర్ల తీరు మారకుంటే సిరీస్ గోవిందా! షమీ ఎప్పుడొస్తాడు?

ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సాధించిన రికార్డ్ విజయం మరచిపోకముందే పింక్ బాల్ టెస్టులో ఓటమి పాలయ్యింది. బుమ్రా నాయకత్వంలో గెలిచిన టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీలో అడిలైడ్ లో పరాభవం ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే. టీమిండియా బ్యాటింగ్ పేలవ ప్రదర్శనతో రెండో టెస్టులో ఓటమి పాలయ్యింది. ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ లో చరిత్రలో వేగంగా ముగిసిన టెస్ట్ గా ఈ మ్యాచ్ మిగిలిపోయింది. టీమిండియా బ్యాటర్లలో ముఖ్యంగా సీనియర్లు…

Read More

Allu Arjun Arrest: కేసుని వైఎస్సార్సీపీ వాదిస్తోందా?

అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అడ్వకేట్ గా ఉండడం విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే ఆపార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి కూడా స్పందించారు. తొక్కిసలాట పేరుతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో చంద్రబాబుని ఎన్నిమార్లు అరెస్ట్ చేయాలంటూ ప్రశ్నించారు. అదే సమయంలో ఎంపీ నిరంజన్ రెడ్డి ఈ అరెస్ట్ కేసుని డీల్ చేయడం ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీ నేత స్వయంగా రంగంలో దిగి అల్లు అర్జున్ కి…

Read More

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ సిగ్గుపడాల్సిన విషయం! ఏపీకి ఇలా, కర్ణాటకలో అలా!

వైజాగ్ స్టీల్ అవస్థలు పడుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో అతలాకుతలం అవుతోంది. ఇంకా చెప్పాలంటే ఉన్నత స్థానంలో ఉన్న సంస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో రాష్ట్రీయ ఇష్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊపిరితీసే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో కర్ణాటకలో అందుకు భిన్నంగా సాగుతోంది. భద్రావతిలో ఉన్న సర్ ఎం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీని పరిరక్షించుకునేందుకు పెద్దమొత్తంలో కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా 15వేల కోట్ల…

Read More
pawan kalyan serious on varma

పిఠాపురం వర్మ మీద వేటు తప్పదా, పవన్ కళ్యాణ్‌ తో వివాదానికి ప్రతిఫలం చెల్లించాల్సిందేనా?

నేరుగా కాకున్నా.. పరోక్షంగానైనా పిఠాపురం వర్మ.. జనసేనానితో యుద్దానికి కాలు దువ్వుతున్నట్టే కన్పిస్తోంది. పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే రకమైన డౌట్లు వస్తున్నాయి. పిఠాపురం సెగ్మెంట్లో వర్మకు బలం ఉంటే ఉండొచ్చు.. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ పవన్ కల్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతతో.. అది కూడా టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న ఓ పార్టీ అధినేతతో నేరుగా యుద్దానికి దిగేటంతటి రేంజీకి పరిస్థితిని తెచ్చుకోవడం వర్మ రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బందని…

Read More

భగవద్గీత అమ్మకాలను అడ్డుకున్న ఎమ్మెల్యే

గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు చర్చనీయాంశమవుతోంది. ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాలను అమ్ముతుండగా ఆమె అడ్డుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇస్కాన్ పేరుతో కొందరు భగవద్గీత అమ్మకాల పేరుతో వీధి వీధి తిరుగుతుండగా గుంటూరులో వారు ఎమ్మెల్యే కంటబట్టారు. వారిని నిలదీసిన గల్లా మాధవి వారిని నిలదీశారు. భగవద్గీత పుస్తకాలు అమ్మే అధికారం మీకు ఎక్కడిదీ అంటూ ప్రశ్నించారు. దాంతో ఆమె తీరు మీద ఇస్కాన్ ప్రతినిధులు విస్తుపోవాల్సి వచ్చింది….

Read More