Editor

జమ్మలమడుగు ఆదినారాయణ సంగతి చూస్తామంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహారం రచ్చకు దారితీస్తోంది. ఇప్పటికే అదానీ సంస్థల కాంట్రాక్ట్ తీసుకున్న సీఎం రమేశ్ తో తగాదా ఏకంగా ఆస్తుల ధ్వంసం వరకూ వెళ్లింది. తాజాగా తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలు అడ్డుకునే వరకూ సాగుతోంది. దీని మీద జేసీ ఘాటుగా స్పందించారు. కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లైయాష్‌ తరలిస్తున్న జేసీకి చెందిన వాహనాలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. తమ…

Read More

ఈవీఎంల భాగోతం బయటపడుతున్నా, విపక్షాలు ఎందుకలా ఉంటున్నాయి?

పోలయిన ఓట్ల కన్నా ఎక్కువే లెక్కిస్తున్నారుఈవీఎం ఛార్జింగ్ ఎక్కడా తగ్గడం లేదువీవీ పాట్ల లెక్క తేల్చడం లేదుఈవీఎంలు ఓటేసిన వాళ్లే రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు దేశంలో ఎన్నికల వ్యవస్థ చుట్టూ సందేహాలు చెలరేగుతున్నాయి. ఈ అనుమానాలు రానురాను బలపడుతున్నాయి. ఇప్పటికప్పుడు అపోహలు తొలగించాల్సిన ఎన్నికల కమిషన్ వాటికి మరింత ఊతమిస్తోంది. ప్రజల్లోంచి వస్తున్న సందేహాలు తీర్చడానికి ససేమీరా అంటోంది. భవిష్యత్తులో ఇది పెను దుమారం దిశగా సాగుతోంది. మహారాష్ట్రలో తాము ఓటేసిన పార్టీకి సున్నా ఓట్లు వచ్చి…

Read More

అనుష్క శర్మ ఉంటేనే కోహ్లీ సెంచరీలా?

విరూష్క అంటూ పిలుచుకునే ఈ జంట గురించి అనేక ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్ కి తెలుసు. తాజాగా టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి మరో విషయం వెలుగులోకి తెచ్చాడు. అనుష్క శర్మ స్టాండ్స్ లో ఉంటే విరాట్ రెచ్చిపోతుంటాడంటూ ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకు గతంలో జరిగిన పరిణామాలను ఉదహరించాడు. తాజాగా పెర్త్ టెస్ట్ లో విరాట్ సెంచరీ చేసిన సమయంలో అనుష్క శర్మ అక్కడే ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. 2015 లో రావిశాస్త్రి మన…

Read More

ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం లభించింది. తాత్కాలిక కెప్టెన్ జస్ఫ్రిత్ బుమ్రా అధ్భుతంగా రాణించి జట్టుని విజయపథంలో నడిపించాడు. ముఖ్యంగా సెనా దేశాల గడ్డ మీదనే అత్యధిక తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్టులో ఏకంగా 295 రన్స్ ఆధిక్యంతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గత సీజన్ లో జరిగిన పెర్త్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. న్యూజీలాండ్‌తో సొంత గడ్డపై 0-3 తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత.. ఆసీస్ గడ్డపై జరుగుతున్న బీజీటీ…

Read More

రిషబ్ పంత్ కొత్త రికార్డు, శ్రేయస్ అయ్యర్ తో ఆషామాషా కాదు

ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025లో టీమిండియా ప్లేయర్లు దుమ్ము రేపుతున్నాడు. ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పొతున్నారు. సెట్ 1లో ఉన్న రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ పరమయ్యాడు. చివరి వరకూ దిల్లీ ఆర్ టీ ఎం ఉపయోగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారీ మొత్తానికి ఎల్ఎస్జీ ఆఫర్ చేయడంతో పంత్ లక్నో టీమ్ సొంతమయ్యాడు. అయితే అందరూ ఊహించిన విధంగా పంత్ కోసం సీఎస్కే, ఆర్సీబీ ఆసక్తి చూపకపోవడం విశేషం. కొంత సేపు…

Read More

యశశ్వి జైశ్వాల్ రికార్డులతో టీమిండియా పట్టు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. యంగ్ ఓపెనర్ యశశ్వి జైశ్వాల్ అద్భుత సెంచరీతో పర్యటక జట్టు ముందు ఆసీస్ పేస్ త్రయం తేలిపోయింది. ఆ క్రమంలోనే టీమిండియా నయా సంచలనం రికార్డుల మోత మోగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోపీ తొలిటెస్టులో సెంచరీ సాధించి ఆస్ట్రేలియా గడ్డ మీద మొదటి మ్యాచ్ లో వంద పరుగులు సాధించిన ఉద్దండుల సరసన చేరాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్,…

Read More

అదానీ కేసులో ఏపీ ఐఏఎస్ లు కూడా ఇరుక్కుంటారా?

అదానీ సంస్థల మీద అమెరికాలో నమోదయిన కేసు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయంగానూ, అధికార వర్గాల్లోనూ విస్తృత చర్చకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు దీని చుట్టూనే రాజకీయం రంజుగా సాగుతోంది. అమెరికా అధికారులు కోర్టులో సమర్పించిన పత్రాల్లో మాజీ సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఏపీలో దీనికి సంబంధించి హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఓవైపు ఈ రాజకీయం రంజుగా సాగుతుండగానే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ఓ ట్విట్ ఈ ఎపిసోడును…

Read More

ఉపాధ్యాయుల ఒత్తిడికి తలొగ్గిన నారా లోకేశ్

ఏపీ విద్యాశాఖ మంత్రి వెనకడుగు వేశారు. ఓవైపు ఉపాధ్యాయులు, మరోవైపు సంఘాలు ఒత్తిడి తీసుకురావడంతో నిర్ణయం ఉపసంహరించుకున్నారు. హైస్కూళ్ల సమయాలు మార్చాలన్న నిర్ణయం మార్చుకున్నారు. దాంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. డిసెంబరు 2 నుంచి పాఠశాలల వేళలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి అమలుచేసేందుకు పూనుకున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పాఠశాలలు…

Read More

ఆస్ట్రేలియాతో టెస్టులో టీమిండియాను ఆదుకున్న తెలుగోడు

ఆంధ్రా జట్టు ఆటగాడు ఆరంభ మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల మధ్య టీమిండియా స్కోర్ 150 రన్స్ కి చేరడంలో కీలకంగా వ్యవహరించాడు. తన ఆరంభ మ్యాచ్ లోనే జట్టు తరుపున హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. కెరీర్ తొలి ఇన్నింగ్స్ లోనే 6 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 41 రన్స్ చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ 37 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు కలిసి కొంత సేపు ఆస్ట్రేలియన్ బౌలర్లను ప్రతిఘటించారు….

Read More