
పాకిస్తాన్ ఉగ్రవాద పీచమణచమంటే కరాచీ బేకరీలు, మైసూర్ పాక్ పేర్లు మారుస్తారా?
ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్ పనిబడతారని అంతా ఆశించారు. కానీ భారత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సాగింది. పట్టు చిక్కుతున్న దశలో జారవిడిచేసేసింది. అమెరికా ఆదేశాలతో గట్టి ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేసింది. వాస్తవానికి సైనిక చర్యకు ముందే పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు దౌత్య యుద్ధం జరగాలి. ప్రపంచమద్ధతు కోరాలి. కానీ ఇప్పుడు చేతులు కాల్చుకుని పలువురిని ప్రపంచంలోని వివిధ దేశాలకు తరలించారు. దాని వల్ల ప్రయోజనమెంత అన్నది ప్రశ్నార్థకమే….