ఇళయరాజా కొడుకు ముస్లీం మతంలోకి ఎందుకు మారాడు?

తమిళనాడులో ఆలయ ప్రవేశం నిరాకరించారన్న వార్తలతో ఇళయరాజా వార్తల్లోకెక్కారు. అయితే ఆయన గురించి తనయుడు యువన్ శంకర్ రాజా వెల్లడించిన చర్చనీయాంశమవుతున్నాయి. ఇళయరాజా తనయుడు ఇప్పటికే మతం మార్చుకున్నారు. ఆయన హిందూ మతం వీడి ముస్లీం మతం స్వీకరించారు. ఆ సమయంలో తన తండ్రి గురించి ఆయన కీలకమైన వ్యాఖ్యానాలు చేశారు. “మా నాన్న హిందూమతాన్ని ఫాలో అవుతారు, ఆయనకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఇంట్లో చిన్న గాజుగ్లాసు పగిలినా, అదొక అపశకునమని పండితున్ని పిలిచి పూజలు…

Read More

హుందాగా అల్లు అర్జున్, విడుదల తర్వాత పెదవి విప్పిన ఐకాన్ స్టార్

పుష్ప2 ద్వారా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన అల్లు అర్జున్ అనుకోని కష్టాల్లో ఏకంగా జైలు పాలుకావడం సంచలనంగా మారింది. చివరకు ఒకరోజు జైలులో గడిపిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. తొలుత భార్య బిడ్డల దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్ అక్కడే మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన హుందాగా వ్యవహరించడం ఆకట్టుకుంది. “చట్టాన్ని…

Read More

Allu Arjun Arrest: కేసుని వైఎస్సార్సీపీ వాదిస్తోందా?

అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అడ్వకేట్ గా ఉండడం విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే ఆపార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి కూడా స్పందించారు. తొక్కిసలాట పేరుతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో చంద్రబాబుని ఎన్నిమార్లు అరెస్ట్ చేయాలంటూ ప్రశ్నించారు. అదే సమయంలో ఎంపీ నిరంజన్ రెడ్డి ఈ అరెస్ట్ కేసుని డీల్ చేయడం ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీ నేత స్వయంగా రంగంలో దిగి అల్లు అర్జున్ కి…

Read More

భగవద్గీత అమ్మకాలను అడ్డుకున్న ఎమ్మెల్యే

గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు చర్చనీయాంశమవుతోంది. ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాలను అమ్ముతుండగా ఆమె అడ్డుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇస్కాన్ పేరుతో కొందరు భగవద్గీత అమ్మకాల పేరుతో వీధి వీధి తిరుగుతుండగా గుంటూరులో వారు ఎమ్మెల్యే కంటబట్టారు. వారిని నిలదీసిన గల్లా మాధవి వారిని నిలదీశారు. భగవద్గీత పుస్తకాలు అమ్మే అధికారం మీకు ఎక్కడిదీ అంటూ ప్రశ్నించారు. దాంతో ఆమె తీరు మీద ఇస్కాన్ ప్రతినిధులు విస్తుపోవాల్సి వచ్చింది….

Read More

మహానటి కీర్తి సురేష్ పెళ్లి , ప్రేమించి పెళ్లి పీటలెక్కిన స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడారు. ఆంటోని తెట్టిల్ ను గోవా వేదికగా జరిగిన పెళ్లిలో సంప్రదాయబద్ధంగా మనువాడారు. కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటి సినిమాతో ఆమెకు జాతీయ అవార్డ్ కూడా దక్కింది. తెలుగులో స్టార్ హీరోలు మహేష్ బాబు సహా పలువురి సరసన నటించి, మెప్పించింది. అయితే తన చిన్న నాటి స్నేహితుడితో ప్రేమాయణం విషయాన్ని…

Read More

మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్! మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు!

సినీ నటుడు మోహన్ బాబు వ్యవహారం దుమారం రేపుతోంది. ఆయన మీద హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును హత్యాయత్నంగా మార్చారు. ఆయన నివాసం వద్ద మంగళవారం సాయంత్రం టీవీ9 ప్రతినిధి రంజిత్ మీద మైక్ తో దాడి కేసులో పోలీసులు స్పందించారు. మీడియా ప్రతినిధుల ఆందోళనతో కేసును సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా మోహన్ బాబు మీద నమోదు చేసిన కేసులో బీఎన్ఎస్ సెక్షన్ 109ను జత చేశారు. తొలుత ఈ కేసుని…

Read More

వైఎస్సార్సీపీని వీడిన మరో మాజీ మంత్రి!ఆయన కూడా అటే!!

2014లో టీడీపీ తరుపున ఎంపీగా గెలిచిన ఆయన 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరి భీమిలి నుంచి గెలిచారు. 2009లోనూ పీఆర్పీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 నుంచి 2022 వరకూ జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. గంట- అరగంట అంటూ ఆయన మీద తీవ్ర దుమారం రేగింది. 2024లో ఓటమి తర్వాత వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు….

Read More

మోహన్ బాబు- మనోజ్ బాబు- మీడియా తప్పు ఎవరిది? శిక్ష ఎవరికీ?

మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం కొత్తది కాదు. కొంతకాలంగా దాని ఆనవాళ్లు బయటకు వస్తూనే ఉన్నాయి. వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. చివరికిలా బయటపడింది. అయితే ఈసారి కూడా భౌతికదాడులు, బౌన్సర్ల తో గొడవలు, గేట్లు నెట్టుకోవడాలు, కేసులు పెట్టుకోవడాలు వంటివి చూస్తున్నాం. సహజంగానే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి వాళ్ల చుట్టూ ఏం జరిగినా జనాల్లో ఆసక్తి ఉంటుంది. మీడియాకు మంచి సరుకుగా మారుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అనూహ్యంగా మీడియానే నిందిస్తూ, మితిమీరి…

Read More

మూడు ఎంపీ సీట్లు ఏకగ్రీవం, 6 నెలల తర్వాత మళ్లీ రాజ్యసభకు టీడీపీ ఎంపీ!

ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు సీట్లు కూటమి ఖాతాలో చేరాయి. ఇద్దరు టీడీపీ తరుపున, ఒకరు బీజేపీ తరుపున బరిలో నిలవడంతో వారి ఎన్నికకు మార్గం సుగమమయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్ధులుగా బీద మస్తాన్ రావు,సానా సతీష్ బాబు,బిజెపి తరుపువ ఆర్.కృష్ణయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు.మంగళవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా…

Read More

ఏపీ శాసనమండలిలో పెరిగిన పీడీఎఫ్‌ బలం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఊపు

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో పీడీఎఫ్‌ తన బలం పెంచుకుంది. సిట్టింగ్ టీచర్ సీటుని నిలబెట్టుకుంది. గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీటుకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది. 65 శాతం పైబడి ఓట్లు దక్కించుకుంది. త్వరలో జరగబోతున్న రెండు గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికలకు తమ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. టీచర్ ఎమ్మెల్సీగా ఉండగా షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆ సీటుకి ఉప ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి సునాయాసంగా…

Read More