babu pawan

చంద్రబాబుని పవన్ కళ్యాణ్‌ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

తమ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని స్వయంగా పవన్ కళ్యాణ్‌ అంగీకరించారు. నిజానికి అలాంటి విమర్శలు విపక్షం నుంచి వస్తుంటాయి. దానిని పాలక కూటమి నేతలు తప్పుబడుతూ ఉంటారు. అందుకు విరుద్ధంగా పరిస్థితి అదుపుతప్పిందని అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం చెప్పడంతో టీడీపీ డిఫెన్స్ లో పడింది. పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక లక్ష్యం ఏమిటా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. యధాలాపంగా ఆయన ఇంతటి తీవ్రమైన విమర్శలు చేసి ఉండకపోవచ్చన్నది అంగీకరించాల్సిన విషయం. అందులోనూ లా…

Read More

ఆ పెళ్లి మీద ట్రోలింగ్ ఎందుకు బ్రో..?

సినీ నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ గడుపుతున్నారు. అందులో హీరో ప్రభాస్, టీవీ స్టార్లు యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి వాళ్ల పేర్లుంటాయి. చాలాకాలం పాటు వెయిట్ చేసిన సుబ్బరాజు ప్రస్తుతం వాళ్ల లిస్టు నుంచి బయటపడడం విశేషమే. చాలాకాలంగా తన పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తున్న సుబ్బరాజు తాజాగా తన వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్…

Read More

అదీ పవన్.. అదే రూటు! పిఠాపురంలో పట్టు సడలకూడదంటే..!

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో దిగి గెలిచారు. అంతకుముందు గాజువాక, భీమవరం ఓటర్లు ఆయన్ని ఓడిస్తే పిఠాపురం ప్రజలు మాత్రం ఆదరించారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కోరిక తీర్చారు. దాంతో ఆయన ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఓటర్లంతా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల పిఠాపురం పట్టణ అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత పిఠాపురం అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ ఏర్పాటునకు…

Read More

కడప రెడ్డమ్మకు అవమానమా, ఎమ్మెల్యే మాధవి నిరసన

కడప రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా మునిసిపల్ కార్పోరేషన్ వ్యవహారాల్లో పెత్తనం కోసం ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవికి మేయర్ సురేష్ బాబు కి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. తాజాగా మేయర్ ఛాంబర్ లో ఎమ్మెల్యే కుర్చీలు కూడా తీసివేయించారంటూ ఎమ్మెల్యే మాధవి ఆరోపిస్తున్నారు. తమను అవమానించారంటూ ఆమె నిరసనకు దిగారు. తాజాగా మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె నిలబడి తన నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేయర్ స్పందించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్…

Read More

మహానాడు వక్తలకు రాజబోగం.. ఐటిడిపికి మొండిచెయ్యి

నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ ఐటిడిపి సోషల్ మీడియా వింగ్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి, రెండవ జాబితాల్లో ఐటిడిపి నుంచి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోడంపై మీడియా ముందుకు వచ్చి వాపోతున్నారు. వైసిపి అధికారంలో ఉండగా తాము కూడా కేసులు ఎదుర్కొన్నామని..పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా పదవులు రావడంలేదని మొరపెట్టుకుంటున్నారు. వైసిపి సోషల్ మీడియా వలన ఐదేళ్లుగా వ్యక్తిగతంగా తాము చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నామని.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు న్యాయం చేయలేపోతున్నారాని…

Read More

పాకిస్తాన్ ఉగ్రవాద పీచమణచమంటే కరాచీ బేకరీలు, మైసూర్ పాక్ పేర్లు మారుస్తారా?

ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్ పనిబడతారని అంతా ఆశించారు. కానీ భారత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సాగింది. పట్టు చిక్కుతున్న దశలో జారవిడిచేసేసింది. అమెరికా ఆదేశాలతో గట్టి ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేసింది. వాస్తవానికి సైనిక చర్యకు ముందే పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు దౌత్య యుద్ధం జరగాలి. ప్రపంచమద్ధతు కోరాలి. కానీ ఇప్పుడు చేతులు కాల్చుకుని పలువురిని ప్రపంచంలోని వివిధ దేశాలకు తరలించారు. దాని వల్ల ప్రయోజనమెంత అన్నది ప్రశ్నార్థకమే….

Read More

అల్లు అర్జున్ కి శత్రువులెక్కువయ్యారా? ఈ కేసులో తనకిపోయిందెంత?

సమాజంలో ఏ రంగంలో ఎదిగిన వాళ్లయినా ఎదుటి వాళ్లకు ఈర్ష్యగానే ఉంటుంది. అందులోనూ తమ కళ్లెదురుగా ప్రస్థానం మొదలెట్టి, తాము ఊహించని స్థాయికి ఎదిగిపోతుంటే మరింత ఎక్కువవుతుంది. సరిగ్గా ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో అదే కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ 11వ నిందితుడు. అంటే అతని కంటే ముందు బాధ్యులు మరో పది మంది ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో నమోదుకాని అసలు అంశం ఈ విషయంలో పోలీసులు పాత్ర కూడా…

Read More

జమిలీ వచ్చినా కూటమిగానే బరిలోకి, తేల్చేసిన చంద్రబాబు

ఏపీలో జమిలీ ఎన్నికల అవకాశాన్ని పాలకపక్షాలు కూడా గుర్తించాయి. దానికి తగ్గట్టుగా సన్నద్దమవుతున్నాయి. ఇప్పటికే పాలకకూటమిలోని మూడు పార్టీల మధ్య పలు చోట్ల విబేధాలు పొడచూపినప్పటికీ కూటమి మాత్రం కొనసాగుతుందన్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. తమ పార్టీ శ్రేణులకు దానికి తగ్గట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం లో శాంతి భద్రతలు క్షీణించినట్టు ఇప్పటికీ డీసీఎం పవన్ కళ్యాణ్ విమర్శించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయినప్పటికీ సర్ధుకుపోవడమేనని టీడీపీ భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే…

Read More

ఉపాధ్యాయుల ఒత్తిడికి తలొగ్గిన నారా లోకేశ్

ఏపీ విద్యాశాఖ మంత్రి వెనకడుగు వేశారు. ఓవైపు ఉపాధ్యాయులు, మరోవైపు సంఘాలు ఒత్తిడి తీసుకురావడంతో నిర్ణయం ఉపసంహరించుకున్నారు. హైస్కూళ్ల సమయాలు మార్చాలన్న నిర్ణయం మార్చుకున్నారు. దాంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. డిసెంబరు 2 నుంచి పాఠశాలల వేళలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి అమలుచేసేందుకు పూనుకున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పాఠశాలలు…

Read More