ఏబీఎన్ ఆర్కే రెండో పెళ్లి చేసుకున్నారా?

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీగా, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అధినేతగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో ఉండే వేమూరి రాధాకృష్ణ వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి ఆయన రెండో పెళ్లి చుట్టూ చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆయన పెళ్లి మీద పలు కథనాలు వచ్చాయి. చివరకు పెళ్ళి పూర్తయ్యిందంటూ తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏబీఎన్ ఆర్కే భార్య, ఆంధ్రజ్యోతి సంస్థల ఫైనాన్స్ డైరెక్టర్ గా పనిచేసిన కనకదుర్గ కొన్నేళ్ల క్రితం మరణించారు….

Read More

పోలీసులే హద్దులు మీరితే ఎలా? క్షమాపణలు చెప్పిన హైదరాబాద్ సీపీ

అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వివాదంలో పోలీసులు కొందరు చేస్తున్న అతి వివాదాలకు దారితీస్తోంది. అల్లు అర్జున్ ని విలన్ గా చిత్రీకరించాలని సీఎం సంకల్పించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వీరంగం చేసిన ఏసీపీ వంటి వాళ్లు అందులో పావులుగా మారారు. ఆఖరికి సీనియర్ అధికారి, హైదరాబాద్ సీపీ కూడా ఆ క్రమంలో హద్దులు మీరి అనవసర వివాదంలో చిక్కుకున్నారు. చివరకు క్షమాపణలు చెప్పాల్సి…

Read More

నారా దేవాన్ష్ రికార్డ్, వేగంగా పావులు కదుపుతున్న సీఎం మనవడు

మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్ “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ “చెక్‌మేట్ మారథాన్” పేరుతో ప్రపంచ రికార్డును…

Read More

సిబిల్ స్కోర్ వ్యవస్థకు చెక్ పడుతుందా? సామాన్యులకు ఊరట దక్కుతుందా?

బ్యాంక్ లోన్ కావాలంటే సిబిల్ స్కోర్, ఏదయినా ఫైనాన్స్ వ్యవహారం చక్కదిద్దాలంటే సిబిల్ స్కోర్. ఇలా ప్రతీదానికి సిబిల్ స్కోర్ తో ముడిపెట్టి చాలామందిని వేధిస్తున్న పరిస్థితి కొంతకాలంగా తీవ్రమవుతోంది. సిబిల్ స్కోర్ పడిపోతుందన్న ఆందోళనతో సతమతమయ్యే మధ్యతరగతి సంఖ్య పెరుగుతోంది. దాంతో ఈ వ్యవహారం మీద తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా సిబిల్ స్కోర్ విషయమై వివాదం ఏకంగా సుప్రీంకోర్టుకి చేరింది. ఈ విధానం వల్ల ఈ దేశ బ్యాంకు అకౌంట్ హోల్డర్ల వ్యక్తిగత గోప్యతకు…

Read More

రాజకీయాల్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్!

వర్తమాన ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం పడని రంగం లేదు. ఇప్పటికే గూగుల వంటి సంస్థలు కూడా తమ సిబ్బందిలో 10 శాతం మందిని ఇంటికి సాగనంపబోతున్నట్టు ప్రకటించేశాయి. అదంతా ఏఐ ప్రభావమేనని చెబుతున్నాయి. అదే సమయంలో రాజకీయ నేతలు కూడా ఏఐ వాడకం విస్తృతం చేస్తున్నారు. ప్రచారానికి దానిని విరివిగా వాడే ప్రయత్నంలో ఉన్నారు. కృత్రిమ మేథ సహాయంలో మరణించిన వారందరి ఆశీస్సులు తమకే ఉన్నాయని చాటేందుకు తగ్గట్టుగా వీడియోలు, ఫోటోలు ప్రచారంలో పెడుతున్నారు. అదే…

Read More

ఆలయ కమిటీల్లో ఆ రెండు కులాలకు చోటు, మరి మిగిలిన వాళ్లేం చేశారు?

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పాలకమండళ్ల నియామకాలకు సిద్ధమవుతోంది. ఆక్రమంలో కొత్తగా కమిటీల్లో రెండు కులాల వారికి చోటు కల్పించాలని నిర్ణయించింది. అందులో బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ దేవాలయ కమిటీల్లో ఆయా ప్రాంతాలను బట్టి కమిటీల్లో చోటు లభిస్తుంది. కులాల వారీగా కేటాయింపులు లేవు. కానీ తొలిసారిగా ఆ రెండు కులాల వారికి చోటు కల్పించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా ఉత్తర్వులు వెలువడ్డాయి….

Read More

విశాఖ డెయిరీలో టీడీపీ లక్ష్యం నెరవేరిందా?

విశాఖ డెయిరీని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో పాలక టీడీపీకి సానుకూల సంకేతం దక్కింది. ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీలో ఉన్న ఆ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్, ఇతర డైరెక్టర్లు రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీని వీడుతున్నట్టు వెల్లడించారు. దాంతో వారిని టీడీపీలో చేర్చుకోవడమా లేక బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్న అడారి ఆనంద్ కి సహకరించడమా అన్నదే మిగిలింది. 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరుపున బరిలో దిగిన అడారి ఆనంద్ ఓటమి…

Read More

జోరు వాన, జారుతున్న బురదలోనూ పవన్ ముందుకే!

మన్యంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పనసభద్ర పంచాయతీ బాగుజోల వెళ్లారు. గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 40 కోట్లతో నిర్మిస్తున్న 19 రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం జరగబోతోంది. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి…

Read More

R Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ ఇక సెలవు చెప్పేశాడు!

టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ కి గుడ్ బై చెప్పేశాడు. ఊహించినట్టుగా ఈసిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తే అందుకు భిన్నంగా మూడో టెస్ట్ ముగియగానే తన నిర్ణయాన్ని అశ్విన్ ప్రకటించాడు. బ్రిస్టేన్ టెస్ట్ తర్వాత అశ్విన్ రిటైర్ ప్రకటించడంతో టీమిండియాలో ఓ శకం ముగిసినట్టుగా భావించాలి. గతంలో ధోనీ కూడా ఇదే రీతిలో సిరీస్ మధ్యలో తన రిటైర్మెంట్ ప్రకటించిన అనుభవం ఉంది. ఆసీస్ గడ్డ మీద బోర్డర్…

Read More

కార్యకర్తలే బలిపశువులు, చంద్రబాబు, జగన్ ఎవరైనా అదే తంతు!

అధికారంలో టీడీపీ ఉందా లేక వైఎస్సార్సీపీనే కొనసాగుతుందా అన్నది తెలీయడం లేదు- ఇదీ ఓ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. అంతకుముందు వైఎస్సార్సీపీ హయంలోనూ ఇలాంటి మాటలే వినిపించాయి. ఇంకా చెప్పాలంటే మేమంతా కష్టపడితే గెలిచిన సీఎం ఈయనేనా అని అప్పుడూ, ఇప్పుడూ సందేహించే పరిస్థితి ఆయా పార్టీల శ్రేణుల్లో ఉంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఏలూరు పరిస్థితి చూద్దాం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ శ్రేణుల మీద పలు కేసులు పెట్టారు. ఆ…

Read More