


ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకున్న వైఎస్సార్సీపీ!ఎవరికి కలిసొస్తుంది?
ఏపీలో శాసనమండలి స్థానాలకు జరుగుతున్న ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని ఆపార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతిభద్రతల కారణంగా ఎన్నికల తీరు మీద తమకు విశ్వాసం లేదని ప్రకటించింది. రెండు జిల్లాల పార్టీ నేతలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. నాయకుల అబిప్రాయం సేకరించారు. తొలుత కార్మిక నాయకుడు పి గౌతమ్ రెడ్డిని పోటీలో పెట్టాలని భావించిన వైఎస్సార్సీపీ చివరకు…

కేంద్రం నుంచి అనుమతులు వస్తే విశాఖ మెట్రో!
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక(సీఎంపి) సిద్దం చేశామని ఏపీ పట్టణాభివృద్ధి , మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల్లో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. “ప్రణాళికను ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తాం. గత ప్రభుత్వం విశాఖ,విజయవాడకు మెట్రో రైల్ రాకుండా కక్షపూరితంగా పక్కన పెట్టేసింది. విశాఖలో భోగాపురం ఎయిర్…

బాబు స్కెచ్ పెద్దది..కానీ అంత సీన్ ఉంటుందా?
గోదావరి జలాలను రాయలసీమ తరలించడం గురించి చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడారు. గోదావరి- పెన్నా అనుసంధానం అంటూ 2014-19 మధ్య పలుమార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టుకి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడది తెరమరుగయ్యింది. కొత్తగా బనకచర్లకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ముందుకు తెచ్చారు. డీపీఆర్ సిద్ధంచేసి, మూడు నెలల్లో టెండర్లని చెబుతున్నారు. పైగా ఇదే ఏపీకి గేమ్ ఛేంజర్ అంటూ వర్ణించారు. ఎప్పుడైనా నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అందరూ ఆహ్వానించాలి. అది అవసరం. కానీ…

ఆడబిడ్డల భద్రతే మొదటి ప్రాధాన్యం : పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువు తీరి కేవలం నాలుగైదు మాసాలే అయింది. ఈ సమయంలోనే ఏదో జరిగిపోయినట్లు వైసీపీ నాయకులు,వారి మద్దతుదారులు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసే వారిని ఇకపై ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, మద్దతుదారులు ఘోరమైన ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారం మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. మహిళలపై ఎవరు అసభ్య దూషణలు చేసినా…

అదానీ కేసులో ఏపీ ఐఏఎస్ లు కూడా ఇరుక్కుంటారా?
అదానీ సంస్థల మీద అమెరికాలో నమోదయిన కేసు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయంగానూ, అధికార వర్గాల్లోనూ విస్తృత చర్చకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు దీని చుట్టూనే రాజకీయం రంజుగా సాగుతోంది. అమెరికా అధికారులు కోర్టులో సమర్పించిన పత్రాల్లో మాజీ సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఏపీలో దీనికి సంబంధించి హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఓవైపు ఈ రాజకీయం రంజుగా సాగుతుండగానే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ఓ ట్విట్ ఈ ఎపిసోడును…

తెలుగువారిని అంతఃపురం సేవకులుగా వర్ణించిన సినీ నటి!
సినీ నటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలుగువారి పట్ల చేసిన విమర్శలు ఆమెను వివాదాల్లోకి నెట్టాయి. ఆ నటి తీరు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకి ఆమె తలొగ్గాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా సీనియర్ నటి కస్తూరి కామెంట్స్ కారణంగా చెలరేగిన కలకలం తర్వాత పరిస్థితి. తాజాగా తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారి గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇచ్చారు. ఆమె తెలుగువారినుద్దేశించి చేసిన…

మహానాడు వక్తలకు రాజబోగం.. ఐటిడిపికి మొండిచెయ్యి
నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ ఐటిడిపి సోషల్ మీడియా వింగ్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి, రెండవ జాబితాల్లో ఐటిడిపి నుంచి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోడంపై మీడియా ముందుకు వచ్చి వాపోతున్నారు. వైసిపి అధికారంలో ఉండగా తాము కూడా కేసులు ఎదుర్కొన్నామని..పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా పదవులు రావడంలేదని మొరపెట్టుకుంటున్నారు. వైసిపి సోషల్ మీడియా వలన ఐదేళ్లుగా వ్యక్తిగతంగా తాము చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నామని.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు న్యాయం చేయలేపోతున్నారాని…

రిషబ్ పంత్ కొత్త రికార్డు, శ్రేయస్ అయ్యర్ తో ఆషామాషా కాదు
ఐపీఎల్ మెగా ఆక్షన్ 2025లో టీమిండియా ప్లేయర్లు దుమ్ము రేపుతున్నాడు. ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పొతున్నారు. సెట్ 1లో ఉన్న రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ పరమయ్యాడు. చివరి వరకూ దిల్లీ ఆర్ టీ ఎం ఉపయోగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారీ మొత్తానికి ఎల్ఎస్జీ ఆఫర్ చేయడంతో పంత్ లక్నో టీమ్ సొంతమయ్యాడు. అయితే అందరూ ఊహించిన విధంగా పంత్ కోసం సీఎస్కే, ఆర్సీబీ ఆసక్తి చూపకపోవడం విశేషం. కొంత సేపు…

దీపావళి హిట్ కొట్టేసిన ఆ మూడు సినిమాలు ఓటీటీలో ఎక్కడంటే..!
ఈసారి పండుగ సినీ ఇండస్ట్రీకి సంతోషాన్ని నింపింది. ఒకేసారి విడుదలయిన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. అందులో తెలుగు హీరో కిరణ్ అబ్బవరం సినిమా క మంచి మార్కులు దక్కించుకుంది. దాంతో పాటుగా తమిళ్ స్టార్ శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్ తో పాటుగా మళయాళీ యంగ్ హీరో దుల్కర్ సల్మన్ స్ట్రయిట్ మువీ లక్కీ భాస్కర్ సైతం మంచి రెస్పాన్స్ సాధించాయి. పాజిటివ్ గా ఓపెనింగ్స్ కనిపించాయి. ఇప్పుడీ మూడు సినిమాలు…