ఇల్లు కడుతున్నారా? మంచి సిమెంట్ ఎంపిక చేసుకోవడం ఎలా? పూర్తి వివరాలతో!

ఎంతో మంది ఇళ్లు లేదా భవన నిర్మాణాలు చేపడుతుంటారు.కాని అందులో కొందరికి మాత్రమే ఆయా నిర్మాణాలలో ఏ రకమైన “సిమెంట్” వాడాలో తెలిసి ఉంటుంది. ఆ విషయాలు తెలియని వారు అటువంటి విలువైన సాంకేతిక సమాచారం కోసం చదవ వచ్చు.. “ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు” అంటుంటారు పెద్దలు.చాలామందికి సొంతిల్లు సమకూర్చుకోవడం ఒక కల. దాన్ని సాకారం చేసుకోవడానికి వారు పడే కష్టం వర్ణనాతీతం.అలాంటి ఇల్లు మూడు తరాల పాటు నిక్షేపంగా నిలవాలంటే దాని…

Read More

ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?

ప్రపంచం బాధను తన బాధగా భావిస్తారని శ్రీ శ్రీ గురించి.. తన బాధను ప్రపంచం బాధగా చూస్తారని కృష్ణశాస్త్రి గురించి సాహితీ లోకంలో ఉన్న టాక్. ఇప్పుడు టీడీపీ సానుభూతిపరుల్లో కొందరు శ్రీ శ్రీలు, ఇంకొందరు కృష్ణశాస్త్రిలుగా మారిపోయినట్టే కన్పిస్తోంది. జీవీ రెడ్డి-దినేష్ కుమార్ ఎపిసోడులో కొందరు శ్రీ శ్రీలుగా మారిపోయారు.. ఇంకొందరు కృష్ణశాస్త్రిలుగా మారిపోయారు. ఎవరి అభిప్రాయాలను వారు చెప్పేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా చంద్రబాబు కంటే జీవీ రెడ్డే గ్రేట్ అనే స్థాయిలో కామెంట్లు కూడా…

Read More

షర్మిల రాజకీయ సలహాదారుగా ఏబీఎన్ ఆర్కే..!జగన్ ఆస్తుల తగాదా ఇప్పట్లో చల్లారదా?

ఏబీఎన్ రాధాకృష్ణ ఆసక్తికర పాత్ర పోషిస్తున్నారు. కొంతకాలంగా ఆయన రెండు పడవల మీద కాలేశారు. ఓవైపు టీడీపీని ఉద్దరించడమే లక్ష్యంగా చేసుకున్న ఆయన అదే సమయంలో షర్మిలకు చేదోడుగా నిలవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిలను రాజకీయంగా ఎదగించేందుకు ఆర్కే తపన పడడమే ఆసక్తికరం. ఏబీఎన్ రాధాకృష్ణకు వైఎస్సార్ అంటే అసలు గిట్టదు. ఆయన సీఎంగా ఉన్న సయమంలోనూ ఆంధ్రజ్యోతి రెచ్చిపోయింది. ఆరెండు పత్రికలూ అంటూ ఈనాడుతో కలిపి జ్యోతిని వైఎస్సార్ నిందించాల్సి వచ్చేది….

Read More

పీకే అక్కడ ఏమీ పీకలేకపోతున్నారు, యువత తిరుగుబాటుతో తలపట్టుకున్న నేత

ఎన్నికల వ్యూహకర్త ముసుగులో సకల అరాచకాలకు శ్రీకారం చుట్టిన ప్రశాంత్ కిషోర్ కి సొంత రాష్ట్రంలో చీవాట్లు తప్పడం లేదు. 2014లో బీజేపీ, 2019లో వైఎస్సార్సీపీ, 2024లో టీడీపీ కోసం పనిచేసి అడ్డమైన పనులతో ప్రజలను నమ్మించడానికి తెగించిన ఈ తుంటరికి తగిన శాస్తి జరుగుతోందంటూ గిట్టని వారు సంతోషపడుతుండడం విశేషం. ఒక ఎన్నికల్లో బీజేపీకి, ఆ వెంటనే కాంగ్రెస్ కి కూడా పనిచేసిన నేపథ్యం అతడిది. ఏపీలో కూడా వైఎస్సార్సీపీకి, టీడీపీ కి మద్ధతుగా నిలిచిన…

Read More

ఈదుపురంలో దీపం పథకంకు శ్రీకారం

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.O పథకానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం 12.45 నిమిషాలకు ఆయన హెలికాప్టర్లో ఈదుపురం చేరుకున్నారు. అక్కడ సుమారు అరగంట పైన సీనియర్ నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఈదుపురం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్యాస్ సిలిండర్ల వాహనాలకు జెండా ఊపి, కార్యక్రమాన్ని లాంఛనంగా…

Read More

అమరావతి మీద చంద్రబాబు స్వరం మారుతోంది..మునిసిపాల్టీ మాత్రమేనట!

అమరావతిని సింగపూర్, షాంఘై, టోక్యో తరహాలో నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు ఎట్టకేలకు వాస్తవంలోకి వస్తున్నట్టు కనిపిస్తోంది. అమరావతిని 33వేల ఎకరాల్లో నిర్మితే అదో చిన్న మునిసిపాలిటీగా మిగిలిపోతుందని సీఎం వెల్లడించడం ఆసక్తిగా మారింది. అసలు ఆయనేమన్నారు..ఇప్పుడెందుకు ఇలా అంటున్నారన్నది చర్చనీయాంశం. Full Details In Video Link:

Read More

బోరుగడ్డ అనిల్ కేసులో టీవీ5 ప్రతినిధి అరెస్ట్

ఏపీలో విపక్షం మీదనే కాదు.. టీడీపీ గొంతుగా మారిన టీవీ5 జర్నలిస్టులను కూడా పోలీసులు వదలడం లేదు. తాజాగా గుంటూరులో టీవీ5 జర్నలిస్ట్ పాలడుగు వంశీకృష్ణను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గుంటూరులో ఆయన కెమెరామేన్ గా పనిచేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది. బోరుగడ్డ అనిల్ కుమార్ రిమాండ్ లో ఉన్న కాలంలో ఆయనకు సకల సదుపాయాలు కల్పించారంటూ టీవీ5 కొన్ని కథనాలు ప్రచారం చేసింది. పోలీస్ స్టేషన్ కి చెందిన సీసీ ఫుటేజ్ ను…

Read More

సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లికి అంతా రెడీ

ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ మరోసారి పెళ్లి పీటలెక్కుతున్నాడు. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధమయ్యింది. నవంబర్ 10న వారి వివాహం జరుగుతుంది. 16వ తేదీన బంధు మిత్రులు, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటుచేశారు. డైరెక్టర్ క్రిష్ కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆమె కూడా డాక్టర్ రమ్య వైద్యురాలే. తొలుత అమెరికాలో గడిపిన జాగర్లమూడి క్రిష్‌ ఆ తర్వాత సినిమాల…

Read More

రెడ్ బుక్ మూడో చాప్టర్ అంటున్న లోకేశ్, ఈసారి కొడాలి నాని, వంశీ ఉంటారా?

ఏపీ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో కూడా రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావించారు. తను విపక్షంలో ఉండగా పలువురి పేర్లు రెడ్ బుక్ లో ఎక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు వారి మీద చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు రెడ్ బుక్ మూడో చాప్టర్ ఓపెన్ అవుతుందని వెల్లడించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విపక్షం ఆరోపిస్తోంది. మరోవైపు రెడ్ బుక్ పూర్తిగా ఓపెన్ కాలేదని పాలక టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. అప్పట్లో…

Read More