ఇళయరాజా కొడుకు ముస్లీం మతంలోకి ఎందుకు మారాడు?
తమిళనాడులో ఆలయ ప్రవేశం నిరాకరించారన్న వార్తలతో ఇళయరాజా వార్తల్లోకెక్కారు. అయితే ఆయన గురించి తనయుడు యువన్ శంకర్ రాజా వెల్లడించిన చర్చనీయాంశమవుతున్నాయి. ఇళయరాజా తనయుడు ఇప్పటికే మతం మార్చుకున్నారు. ఆయన హిందూ మతం వీడి ముస్లీం మతం స్వీకరించారు. ఆ సమయంలో తన తండ్రి గురించి ఆయన కీలకమైన వ్యాఖ్యానాలు చేశారు. “మా నాన్న హిందూమతాన్ని ఫాలో అవుతారు, ఆయనకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఇంట్లో చిన్న గాజుగ్లాసు పగిలినా, అదొక అపశకునమని పండితున్ని పిలిచి పూజలు…
జోరు వాన, జారుతున్న బురదలోనూ పవన్ ముందుకే!
మన్యంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పనసభద్ర పంచాయతీ బాగుజోల వెళ్లారు. గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 40 కోట్లతో నిర్మిస్తున్న 19 రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం జరగబోతోంది. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి…
బ్యాటర్ల తీరు మారకుంటే సిరీస్ గోవిందా! షమీ ఎప్పుడొస్తాడు?
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సాధించిన రికార్డ్ విజయం మరచిపోకముందే పింక్ బాల్ టెస్టులో ఓటమి పాలయ్యింది. బుమ్రా నాయకత్వంలో గెలిచిన టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీలో అడిలైడ్ లో పరాభవం ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే. టీమిండియా బ్యాటింగ్ పేలవ ప్రదర్శనతో రెండో టెస్టులో ఓటమి పాలయ్యింది. ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ లో చరిత్రలో వేగంగా ముగిసిన టెస్ట్ గా ఈ మ్యాచ్ మిగిలిపోయింది. టీమిండియా బ్యాటర్లలో ముఖ్యంగా సీనియర్లు…
రాజకీయాల్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్!
వర్తమాన ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం పడని రంగం లేదు. ఇప్పటికే గూగుల వంటి సంస్థలు కూడా తమ సిబ్బందిలో 10 శాతం మందిని ఇంటికి సాగనంపబోతున్నట్టు ప్రకటించేశాయి. అదంతా ఏఐ ప్రభావమేనని చెబుతున్నాయి. అదే సమయంలో రాజకీయ నేతలు కూడా ఏఐ వాడకం విస్తృతం చేస్తున్నారు. ప్రచారానికి దానిని విరివిగా వాడే ప్రయత్నంలో ఉన్నారు. కృత్రిమ మేథ సహాయంలో మరణించిన వారందరి ఆశీస్సులు తమకే ఉన్నాయని చాటేందుకు తగ్గట్టుగా వీడియోలు, ఫోటోలు ప్రచారంలో పెడుతున్నారు. అదే…
బాబు స్కెచ్ పెద్దది..కానీ అంత సీన్ ఉంటుందా?
గోదావరి జలాలను రాయలసీమ తరలించడం గురించి చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడారు. గోదావరి- పెన్నా అనుసంధానం అంటూ 2014-19 మధ్య పలుమార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టుకి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడది తెరమరుగయ్యింది. కొత్తగా బనకచర్లకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ముందుకు తెచ్చారు. డీపీఆర్ సిద్ధంచేసి, మూడు నెలల్లో టెండర్లని చెబుతున్నారు. పైగా ఇదే ఏపీకి గేమ్ ఛేంజర్ అంటూ వర్ణించారు. ఎప్పుడైనా నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అందరూ ఆహ్వానించాలి. అది అవసరం. కానీ…
యురేనియం తవ్వకాలపై పవన్ వైఖరి మారిందా?
ప్రతిపక్ష నాయకులు చేసే పోరాటం ఆ కాలానికే సరిపోతుందా? వారు అధికారంలోకి వచ్చాక ఆ సమస్యను పరిష్కరించలేరా? నేడు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నాయకులు గతంలో చెప్పిన మాట ఏమిటి ? నేడు చేస్తుంది ఏమిటి? యురేనియం తవ్వకాలను ఆపాలి.. నల్లమల అడవులను రక్షించాలని నాటి రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి లు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఇది తెలుగు వారి సమస్యని రాష్ట్రాలను పక్కన పెట్టీ…
రుషికొండ నిర్మాణాల మీద జగన్ ను జీవితకాలం జైల్లో పెట్టాలంట..!
రుషికొండ ప్యాలెస్ విషయంలో అధికమొత్తంలో ఖర్చు చేసినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జీవితకాలం జైలులో పెట్టాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. కేవలం సొంత ప్రయోజనాల కోసం కుట్రపూరితంగా నిర్మాణం జరిగిందని మండిపడ్డారు. వేల రూపాయలు వెచ్చించిన ఈ భవనం ప్రభుత్వ అవసరాలకు కూడా ఉపయోగపడదని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా రుషికొండ ప్యాలెస్ గురించి వేసిన ప్రశ్నకు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమాధానమిచ్చారు. రుషికొండ మొత్తం భవనాలు,…
పోలీసుల తీరుతో కలత చెందిన పవన్ కళ్యాణ్, బాధితులకు క్షమాపణ
ఏపీ ఉపముఖ్యమంత్రి మరోసారి పోలీసుల తీరుతో కలత చెందారు. ఈసారి ఏకంగా బాధితులకు క్షమాపణ కూడా చెప్పారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం విషయంలో పోలీసుల వ్యవహారశైలితో పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చింది. అంతేగాకుండా తన ట్రస్ట్ తరుపున బాధిత కుటుంబానికి రూ. 2లక్షల నష్టపరిహారం కూడా అందించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పోలీసులు…