ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్! చంద్రబాబు మళ్లీ వెనక్కి మళ్లుతున్నారా?

చంద్రబాబు పదే పదే టెక్నాలజీకి సంబంధించిన పదాలతో ప్రజలను ఆకట్టుకోవాలని చూడడం ఆశ్చర్యం ఏమీ కాదు. దశాబ్దాలుగా ఆయన పాలనా విధానంలో పెద్దగా మార్పు ఉండదు. కానీ ఆనాటికి టెక్ ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలను ఆయన ఉపయోగిస్తూ ఉంటారు. అందరికీ గుర్తుండే ఉంటుంది..2019 కి పూర్వం ఆయన పదే పదే లాజిస్టిక్స్ హబ్ అంటూ చెప్పుకొచ్చేవారు. విశాఖను లాజిస్టిక్స్ హబ్ గా చేస్తానని కూడా ఆయన అన్నారు. మరి ఇప్పుడెందుకు ఆయన మాట మరచిపోయారు. ఇప్పుడెందుకు డీప్…

Read More

మహానటి కీర్తి సురేష్ పెళ్లి , ప్రేమించి పెళ్లి పీటలెక్కిన స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడారు. ఆంటోని తెట్టిల్ ను గోవా వేదికగా జరిగిన పెళ్లిలో సంప్రదాయబద్ధంగా మనువాడారు. కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటి సినిమాతో ఆమెకు జాతీయ అవార్డ్ కూడా దక్కింది. తెలుగులో స్టార్ హీరోలు మహేష్ బాబు సహా పలువురి సరసన నటించి, మెప్పించింది. అయితే తన చిన్న నాటి స్నేహితుడితో ప్రేమాయణం విషయాన్ని…

Read More

వాళ్ల తర్వాత నితీశ్ రెడ్డేనా! కపిల్, అమర్నాథ్ వంటి వారి బాటలో సాగుతాడా?

నిజానికి దేశంలోనే మిగతా క్రికెట్ అసోషియేషన్ల కంటే చిన్నదైనా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) నుండి టీమ్ ఇండియా జట్టులో ఈ మధ్య కాలంలో కాస్త ప్రాతినిధ్యం పెరగడం కాస్త గుడ్ న్యూస్! దానిలో భాగంగానే ఇక్కడ నుండి మొదట MSK ప్రసాద్.. KS భరత్.. హనుమ విహారి ల తర్వాత ఇప్పుడు నాలుగో వాడిగా నితీష్ కుమార్ రెడ్డి (NKR) ఇండియా టెస్ట్ క్యాప్ ధరించడంతో పాటు సెలక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ అంచనాలకు తగ్గట్టు ఈ…

Read More

అక్కడ అన్ని పార్టీలు ఒక్కటే, మరిక్కడ ఇలా కలిసెళ్లి విజయవాడ వరద సహాయం అడగలరా?

పైన ఫోటోలో కేంద్ర హోం శాఖ మంత్రికి వినతిపత్రం అందిస్తున్న నేతలంతా ఒక్క పార్టీ కాదు. కానీ ఒక్క రాష్ట్రం వారే. తమ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల వరకూ తామంతే ఒకటేనని చాటుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని కేంద్రం మీద ఒత్తిడి పెంచుతున్నారు. కేరళకి చెందిన ఎంపీలతో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమావేశం నిర్వహించారు. అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. తమ అభిప్రాయాలు వ్యక్త పరిచారు. ఉమ్మడిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నించాలని నిర్ణయించారు. అందులో…

Read More

ఈ క్రికెటర్ త్వరలో డాక్టర్ అయిపోతున్నాడట..!

జాన్ కోరా,సీనియర్ జర్నలిస్ట్ క్రీడాకారులు ఏం చదువుకున్నారు? సచిన్ టెన్త్, కోహ్లీ ఇంటర్, ధోనీ బీఏ ఫెయిల్ అంటూ చాలా సార్లు మనం సోషల్ మీడియాలో పోస్టులు చూశాం. క్రికెటర్లు, సినిమా నటులు, కళాకారులు చాలా మంది పెద్దగా చదువుకోలేదని.. అయినా వారు పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించడం లేదా అని ప్రశ్నించే వారినీ చూశాం. కానీ.. అది అన్ని వేళలా సాధ్యం‌ కాదు. ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా పిల్లల మనసుల్లో చదువుకు విలువే లేదనేది నాటుతున్నామని…

Read More

సాగనంపాల్సింది రోహిత్ నే కాదు, అతడిని కూడా!

టీమిండియా మేనేజ్మెంట్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మను సాగనంపేసింది. కీలకమైన చివరి టెస్టులో ఆయన్ని పక్కన పెట్టేసింది. వైస్ కెప్టెన్ బుమ్రాకే సారధ్యం దక్కింది. పెర్త్ టెస్టులో గెలుపుబాట పట్టించిన సారధికి చివరి మ్యాచ్ లో కూడా ఛాన్స్ రావడంతో ఈ మ్యాచ్ కూడా గెలిచి, సిరీస్ ను డ్రా చేస్తారా అన్నది ఆసక్తికరం. సిరీస్ మధ్యలో కెప్టెన్ ను పక్కన పెట్టడం టీమిండియాలో అరుదైన అంశం. గతంలో 1985లో కపిల్ దేవ్…

Read More

ట్రంప్- మస్క్ బంధం చెడింది! ‘బ్రొమాన్స్’ ముగిసింది!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన రాజ్యాధినేతకు, బడా బిలియనీర్‌కు మధ్య ఇన్నాళ్లూ కొనసాగిన బ్రొమాన్స్ ఇక ముగిసిపోయింది. అమెరికా ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగిన వ్యక్తి ఎలాన్ మస్క్. అమెరికాలో ఎంతో మంది బిలియనీర్లు, టెక్ జెయింట్లు ఉన్నా.. కేవలం మస్క్ మాత్రమే డొనాల్డ్ ట్రంప్‌ను బహిరంగంగా సపోర్ట్ చేస్తూ.. డెమోక్రటిక్ పార్టీని విమర్శిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ట్రంప్ ఎక్కడకు వెళ్తే.. అక్కడకు వెంట వెళ్లాడు…

Read More
modi strategy

పాకిస్తాన్ కి అదే బలం! మోదీ అంచనా అందుకే తప్పిందా?

ఒక్కో దేశానికి ఒక్కో బలం ఉంటుంది. పాకిస్తాన్ బలం మాత్రం భౌగోళిక స్వరూపమే. అందులోనూ కీలక దేశాలకు నడుమ ఉండడమే. ఓవైపు ఇండియా, రెండోవైపు చైనా, ఇంకో వైపు ఇరాన్, వాటికి తోడు పూర్వపు సోవియట్ రష్యా కూడా సమీపంలోనే ఉండేది. కనుకనే అమెరికా కన్నేసింది. పాకిస్తాన్ ను ఉపయోగించుకుంది. రష్యాని బెదిరించేందుకు, ఇండియాను కట్టడిచేసేందుకు పాకిస్తాన్ ను వినియోగించుకుది. చివరకు ఇరాన్, ఆప్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్య పాలకులను గద్దెదించేందుకు పాకిస్తాన్ కేంద్రంగానే పావులు కదిపింది….

Read More