రాజ్యసభలో డబ్బు కట్టలు

భారత పార్లమెంట్ లోని ఎగువ సభ రాజ్యసభలో డబ్బులు కలకలం రేపాయి. డబ్బుల కట్ట లభించడంతో అంతా అప్రమత్తమయ్యారు. రాజ్యసభ చైర్మన్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. అమెరికాలో అదానీ మీద కేసుల గురించి చర్చించాలని విపక్షం పట్టుబడుతోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించాలని డిమాండ్ చేస్తోంది. శుక్రవారం కూడా సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు ఇరుసభల్లో ఆందోళనకు పూనుకున్నారు. అదే సమయంలో రాజ్యసభలో డబ్బుల కట్ట దుమారం రేపుతోంది. ఎంపీ అభిషేక్‌…

Read More

ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ వివాదాలు, అడుగులు పడేనా?

ఏపీకి కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది అంతుబట్టకుండా ఉంది. ఆఖరికి అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్ల నిధులు కూడా అప్పుగానా, గ్రాంట్ గానా అన్నది సందేహంగా కనిపిస్తోంది. ఈ సందిగ్ధం కొనసాగుతున్న వేళ తాజాగా కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ ప్రకటనలు చిచ్చుపెడుతున్నాయి. బహుశా పౌరవిమానయాన శాఖ టీడీపీ ఎంపీ చేతిలో ఉండడంతో ఆ శాఖ ద్వారానే ఎక్కువ ఫలితాలను ఆశిస్తూ ఎయిర్ పోర్టుల చుట్టూ హంగామా చేస్తున్నారా అన్న చర్చ…

Read More

ఇకపై‌ ఆ విన్యాసాలు కుదరవు..క్రికెట్ లో కొత్త రూల్

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే మార్లిబాన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) క్రికెట్ క్తాచింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. ఎంసీసీ రూల్స్‌నే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అమలు చేస్తుంది. ఇటీవల కాలంలో బౌండరీల వద్ద క్యాచ్‌లు పట్టే సమయంలో ఫీల్డర్ల విన్యాసాలను మనం చూస్తూనే ఉన్నాం. బౌండరీల వద్ద క్యాచ్ చేసే సమయంలో బ్యాలెన్స్ కోల్పోతున్నామని అనుకున్నప్పుడు.. బంతిని గాల్లోకి విసిరి.. బౌండరీ దాటి వెళ్లి..‌మళ్లీ తిరిగి వచ్చి బంతులు పడుతున్నారు. టీ20 వరల్డ్…

Read More

బంగ్లా అనిశ్చితి ఇండియాకు కలిసొచ్చింది.. ఎందులో తెలుసా?

ఇండియా టెక్ట్స్ టైల్ మార్కెట్ పుంజుకుంటోంది.. కారణమదే రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా దేశంలో చమురు ధరలు అదుపులోకి వచ్చాయి. అంతేగాకుండా దేశం నుంచి భారీగా ఆయిల్ ఎగుమతులు పెరుగుతున్నాయి. అనూహ్యంగా ప్రస్తుతం యూరప్ కి ఆయిల్ ఎగుమతిదారుల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని దాన్ని శుద్ధి చేసి యూరప్ కి ఎగుమతి చేయడం ద్వారా ఇండియా భారీగా లాభాలు అర్జిస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ పరిణామాలతో కూడా ఇండియాకు ఉపయోగం కనిపిస్తోంది….

Read More

వైఎస్ కుటుంబ ఆస్తుల తగాదా తేలాలంటే ఇంకో నెల ఆగాల్సిందే..

వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల తగాదాలో వచ్చిన విబేధాల మీద విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన కేసు డిసెంబర్ 13కి వాయిదా వేస్తున్నట్టు ఎన్సీఎల్టీ ప్రకటించింది. దాంతో ఈ వ్యవహారంలో స్పష్టతకు మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. సరస్వతి పవర్ లో వైఎస్ జగన్, ఆయన భార్య భారతి పేరు మీద ఉన్న వాటాలను వైఎస్ విజయమ్మకు గిఫ్ట్ డీడ్ గా రాశారు. దానిని…

Read More

జగనూ, పవనూ ఇద్దరికీ పాఠం చెప్పిన సినిమా రాజకీయాలు!

రాజకీయ పార్టీ లేదా సినిమా ఏదైనా గానీ ఒక కులం, ఒక వర్గం ఆధారంగా సక్సెస్ కొట్టలేవన్నది జగమెరిగిన సత్యం. కానీ ఆయా కులాల అండదండలతో కొంత ఊపు వస్తుంది. పార్టీకయితే పునాది అవుతుంది. సినిమాకయితే ఒకటి రెండు రోజుల వసూళ్లుంటాయి. అంతకుమించి కులాన్ని నెత్తిన పెట్టుకుంటే ఏమవుతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొణిదెల పవన్ కళ్యాణ్ కి అర్థమయ్యి ఉండాలి. ఎందుకుంటే కులం కారణంగా రాజకీయాల్లో ఒకరు, సినిమాల్లో ఒకరు దెబ్బతినాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్…

Read More

ఫీజు రీయంబెర్స్మెంట్ రాకపోవడంతో పిల్లలకు భోజనాలు లేవు- మంత్రి నారా లోకేశ్ చూస్తున్నారా?

కాకినాడలో ఓ నర్సింగ్ కాలేజ్ యజమాన్యం అడ్డగోలుగా వ్యవహరించింది. విద్యార్థులను రోడ్డుకి నెట్టింది. ఫీజు రీయంబెర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఫీజులు కట్టని పిల్లలకు భోజనాలు పెట్టలేం అంటూ హాస్టల్ మూసేసింది. దాంతో విద్యార్థులు తీవ్రంగా సతమతమయ్యారు. చివరకు సమీపంలోని ఫంక్షన్ హాళ్లలో ఓ పూట కడుపు నింపుకున్నారు. కానీ ఆదివారం నాడు అలాంటి అవకాశం కూడా లేకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జోక్యం చేసుకుని ఆర్డీవో మల్లిబాబుని కాలేజ్…

Read More

నాగార్జున వియ్యంకుడు దుబాయ్ లో చానా రిచ్!

అఖిల్ అక్కినేని మరోసారి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పటికే ఓసారి జీవీకే మనుమరాలు శ్రేయస్ భూపాల్ తో నిశ్చితార్థం వరకూ వెళ్ళి వెనక్కి తగ్గిన ఈ అక్కినేని చిన్నోడు ఈసారి కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న తన సహచరి జైనబ్ రావుడ్జీతో పెళ్లికి రెడీ అవుతున్నాడు. జైనబ్ కుటుంబానికి దుబాయ్ లో పెద్ద నెట్ వర్క్ ఉంది. పశ్చిమాసియాలోనే పలుకుబడి కలిగిన బడా బిజినెస్ మేన్ ఆమె తండ్రి. గతంలో ఎనర్జీ సెక్టార్ లో…

Read More

అప్పుగా కాదు…కేంద్ర గ్రాంట్ గా నిధులు ప్రకటించాలి : సి.హెచ్ బాబురావు

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ప్రకటించిన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను అప్పుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ గా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు కోరారు. శనివారం తుళ్లూరులో సిఆర్డిఏ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై మళ్ళీ అనిశ్చిత పరిస్థితి తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా,పటిష్టంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగినందున…

Read More