రేషన్ అక్రమరవాణాకు మూలం అవేనట..మాఫియా నియంత్రణ కష్టమట!
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఏపీలో రేషన్ బియ్యం మాఫియాకు డోర్ డెలివరీ కోసమంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలు కారణమంటూ విమర్శించారు. ఏకంగా 1600 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాల ద్వారా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకుని అక్రమంగా బియ్యం తరలిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. దానికి ఆధారంగా గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాలలో జరిగిన బియ్యం ఎగుమతుల విలువను వెల్లడించారు. రూ. 48,537 కోట్ల విలువైన బియ్యం కాకినాడ…
కడప రెడ్డమ్మకు అవమానమా, ఎమ్మెల్యే మాధవి నిరసన
కడప రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా మునిసిపల్ కార్పోరేషన్ వ్యవహారాల్లో పెత్తనం కోసం ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవికి మేయర్ సురేష్ బాబు కి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. తాజాగా మేయర్ ఛాంబర్ లో ఎమ్మెల్యే కుర్చీలు కూడా తీసివేయించారంటూ ఎమ్మెల్యే మాధవి ఆరోపిస్తున్నారు. తమను అవమానించారంటూ ఆమె నిరసనకు దిగారు. తాజాగా మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె నిలబడి తన నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేయర్ స్పందించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్…
మహానటి కీర్తి సురేష్ పెళ్లి మహుర్తం ఫిక్స్, భర్త ఎవరంటే?
హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపీటలెక్కుతోంది. డిసెంబర్ 11, 12 తేదీల్లో వివాహ వేడుక జరుగుతోంది. ఆమె చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడబోతోంది. ఈ పెళ్లికి గోవా వేదిక కానుంది. కీర్తి సురేష్ తెలుగులో ప్రముఖ హీరోలందరి సరసన నటించింది. మహానటి ద్వారా విశేష కీర్తి గడిచింది. ప్రతిభ కలిగిన నటిగా మన్ననలు పొందింది. అనేక అవార్డులు కూడా దక్కించుకుంది. జాతీయ స్థాయి ఉత్తమనటిగానూ ఎదిగింది. తాజాగా తన పెళ్లి వార్తను కన్ఫర్మ్ చేసింది. డిసెంబర్ 11న కుటుంబ సభ్యులు,…
ఊగిసలాటలో పీఏసీ చైర్మన్, పెద్దరెడ్డికి దక్కేనా?
పీఏసీ చైర్మన్ గిరీ కొత్త మలుపు తిరిగింది. దాదాపుగా పెద్దిరెడ్డికి ఖాయం అనుకున్న దశలో కూటమి నేతలు మెలిక పెట్టారు. జనసేన తరుపున కూడా నామినేషన్ దాఖలయ్యింది. దాంతో వ్యవహారం ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీకి పీఏసీ చైర్మన్ గిరీ రాకుండా చేసే ప్రణాళిక సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. అయితే అధికారకూటమి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచిస్తుందా లేక సభలో ఏకైక విపక్షానికి ఇస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఏపీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్టుకి సంబంధించి ఓ…
విశాఖ డెయిరీలో టీడీపీ లక్ష్యం నెరవేరిందా?
విశాఖ డెయిరీని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో పాలక టీడీపీకి సానుకూల సంకేతం దక్కింది. ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీలో ఉన్న ఆ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్, ఇతర డైరెక్టర్లు రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీని వీడుతున్నట్టు వెల్లడించారు. దాంతో వారిని టీడీపీలో చేర్చుకోవడమా లేక బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్న అడారి ఆనంద్ కి సహకరించడమా అన్నదే మిగిలింది. 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరుపున బరిలో దిగిన అడారి ఆనంద్ ఓటమి…
విశాఖలో ఆరుగురు అమ్మాయిలు మాయం, కళ్లలో కారం జల్లిపారిపోయారని ఫిర్యాదు
విశాఖ జిల్లాలో ఒకేరోజు ఆరుగురు అమ్మాయిలు పరారయ్యారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్వధార్ హోం నుంచి వారంతా పారిపోయారు. దాంతో ఈ ఘటన సంచలనంగా మారింది. పెందుర్తి మండలంలోని స్వధార్ గృహం నుంచి ఆరుగురు బాధిత యువతులు పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. వారంతా వివిధ కేసుల్లో న్యాయస్థానం నుంచి ఆదేశాల మేరకు స్వధార్ లో ఉంటున్నారు. వారికి తగిన సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా నిర్వాహకులను కత్తితో బెదిరించి అక్కడి నుంచి పరారయినట్టు పోలీసులకు…
ఎట్టకేలకు కనుమూరి రఘురామకృష్ణంరాజుకి ఛాన్స్!
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినే షనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్ తో విబేధించి ఆపార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం…