అప్పుగా కాదు…కేంద్ర గ్రాంట్ గా నిధులు ప్రకటించాలి : సి.హెచ్ బాబురావు

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ప్రకటించిన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను అప్పుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ గా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు కోరారు. శనివారం తుళ్లూరులో సిఆర్డిఏ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై మళ్ళీ అనిశ్చిత పరిస్థితి తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా,పటిష్టంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగినందున…

Read More

మోదీ నాయకత్వ వైఫల్యం అదే! దీర్ఘకాల నష్టాలు తప్పవు!

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. కానీ పూర్తిగా దాని ఫలితం దక్కడం లేదు. కవ్వింపు చర్యలు కొనసాగుతుండడం కలవరపరుస్తోంది. దానికి మించి అమెరికా ఆదేశాలను భారత ప్రభుత్వం అనుసరించడం అనేక మందిని ఆశ్చర్యపరుస్తోంది. కాల్పుల విరమణకి పాల్పడిన దేశాల కన్నా ముందే అమెరికా ఈ ప్రకటన చేయడం విస్మయకరంగా మారింది. ట్రంప్ పోస్టులోని కామన్ సెన్స్, ఇంటిలిజెన్స్ వంటి పదాలు అవమానకరంగా కనిపిస్తున్నాయి. అసలింతకీ ఇండియా ఇక్కడి వరకూ ఎందుకొచ్చిందన్నదే ముఖ్య ప్రశ్న. ఉగ్రవాద…

Read More
babu pawan

చంద్రబాబుని పవన్ కళ్యాణ్‌ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

తమ ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని స్వయంగా పవన్ కళ్యాణ్‌ అంగీకరించారు. నిజానికి అలాంటి విమర్శలు విపక్షం నుంచి వస్తుంటాయి. దానిని పాలక కూటమి నేతలు తప్పుబడుతూ ఉంటారు. అందుకు విరుద్ధంగా పరిస్థితి అదుపుతప్పిందని అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం చెప్పడంతో టీడీపీ డిఫెన్స్ లో పడింది. పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక లక్ష్యం ఏమిటా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. యధాలాపంగా ఆయన ఇంతటి తీవ్రమైన విమర్శలు చేసి ఉండకపోవచ్చన్నది అంగీకరించాల్సిన విషయం. అందులోనూ లా…

Read More

డ్యుయెల్ రోల్స్ చేయడానికి ఇది సినిమా కాదు పవన్..!

కొన్ని సినిమాల్లో హీరో , విలన్ ఒకడే ఉంటారు. హీరో, విలన్ మాత్రమే కాదు..కమెడియన్ పాత్ర సైతం తనే పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది నిజజీవితంలో సాధ్యం కాదు. రాజకీయాల్లోనూ అసాధ్యం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ తీరు చూస్తుంటే అటు అధికారంలో భాగం పంచుకుంటూ, ఇటు విపక్షంగా గొంతు వినిపించాలన్న వ్యూహంలో ఏమైనా ఉన్నారా అన్న సందేహం కలుగుతోంది. ఏపీలో ఎవరికి నచ్చినా నచ్చకున్నా బలమైన ప్రతిపక్షం ఉంది. సీట్ల పరంగా అది ప్రస్ఫుటించకపోవచ్చు…

Read More

జగన్ పుంజుకుంటున్నాడంటున్న ఏబీఎన్ ఆర్కే, ఎందుకలా?

ఏబీఎన్ రాధాకృష్ణ ఆందోళన చెందుతున్నాడా.. చంద్రబాబు పాలనా తీరుతో అసంతృప్తిగా ఉన్నారా.. బాబు విధానాల కారణంగా మళ్లీ వైఎస్ జగన్ కి ఆదరణ పెరుగుతోందని కలత చెందుతున్నారా. తాజాగా ఆయన రాతలు అందుకు సాక్ష్యంగా ఉన్నాయి. వైఎస్ జగన్ పుంజుకుంటున్నారని ఆందోళన చెందుతున్నట్టు చాటుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి బలపడుతున్న అంశాన్ని వేమూరి రాధాకృష్ణ తన వీకెంట్ కామెంట్ లో పరోక్షంగా చెప్పేశారు. చంద్రబాబుని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని వెల్లడించేశారు. సీఎంగా అద్భుత పనితీరు అంటే విజన్…

Read More

ఇల్లు కడుతున్నారా? మంచి సిమెంట్ ఎంపిక చేసుకోవడం ఎలా? పూర్తి వివరాలతో!

ఎంతో మంది ఇళ్లు లేదా భవన నిర్మాణాలు చేపడుతుంటారు.కాని అందులో కొందరికి మాత్రమే ఆయా నిర్మాణాలలో ఏ రకమైన “సిమెంట్” వాడాలో తెలిసి ఉంటుంది. ఆ విషయాలు తెలియని వారు అటువంటి విలువైన సాంకేతిక సమాచారం కోసం చదవ వచ్చు.. “ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు” అంటుంటారు పెద్దలు.చాలామందికి సొంతిల్లు సమకూర్చుకోవడం ఒక కల. దాన్ని సాకారం చేసుకోవడానికి వారు పడే కష్టం వర్ణనాతీతం.అలాంటి ఇల్లు మూడు తరాల పాటు నిక్షేపంగా నిలవాలంటే దాని…

Read More

చంద్రబాబు మన్ కీ బాత్ ముహూర్తం సిద్ధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం గడిచిన పదేళ్లుగా జరుగుతోంది. తాజాగా దానిని ఏపీ ప్రభుత్వం కూడా అనుసరించబోతోంది. సీఎం చంద్రబాబు కూడా అలాంటి కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ప్రారంభించే ప్రయత్నం జరుగుతోంది. “మీతో.. మీ చంద్రబాబు” పేరుతో నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉంది….

Read More

పుష్ప2 కోసం స్టార్ క్రికెటర్లు బరిలో దిగుతున్నారా?

అల్లు అర్జున్ రీసెంట్ సెన్సేషన్ పుష్ప2 చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆ క్రమంలోనే ప్రచారపర్వంలో ఎక్కడా తగ్గకూడదని సినిమా యూనిట్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా ప్రచారం కోసం భారీ ప్లాన్ వేశారు. దానికి తగ్గట్టుగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తి పెంచే ప్రయత్నం జరుగుతోంది. వివిధ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈవెంట్స్ ను నిర్వహించే స్కెచ్ వేసింది. నార్త్ ఇండియాలోని అన్ని స్టేట్స్ లో కూడా ఈ…

Read More

యశశ్వి జైశ్వాల్ రికార్డులతో టీమిండియా పట్టు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. యంగ్ ఓపెనర్ యశశ్వి జైశ్వాల్ అద్భుత సెంచరీతో పర్యటక జట్టు ముందు ఆసీస్ పేస్ త్రయం తేలిపోయింది. ఆ క్రమంలోనే టీమిండియా నయా సంచలనం రికార్డుల మోత మోగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోపీ తొలిటెస్టులో సెంచరీ సాధించి ఆస్ట్రేలియా గడ్డ మీద మొదటి మ్యాచ్ లో వంద పరుగులు సాధించిన ఉద్దండుల సరసన చేరాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్,…

Read More

అదానీ కేసులో ఏపీ ఐఏఎస్ లు కూడా ఇరుక్కుంటారా?

అదానీ సంస్థల మీద అమెరికాలో నమోదయిన కేసు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయంగానూ, అధికార వర్గాల్లోనూ విస్తృత చర్చకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు దీని చుట్టూనే రాజకీయం రంజుగా సాగుతోంది. అమెరికా అధికారులు కోర్టులో సమర్పించిన పత్రాల్లో మాజీ సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఏపీలో దీనికి సంబంధించి హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఓవైపు ఈ రాజకీయం రంజుగా సాగుతుండగానే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ఓ ట్విట్ ఈ ఎపిసోడును…

Read More