బ్యాటర్ల తీరు మారకుంటే సిరీస్ గోవిందా! షమీ ఎప్పుడొస్తాడు?

ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సాధించిన రికార్డ్ విజయం మరచిపోకముందే పింక్ బాల్ టెస్టులో ఓటమి పాలయ్యింది. బుమ్రా నాయకత్వంలో గెలిచిన టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీలో అడిలైడ్ లో పరాభవం ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే. టీమిండియా బ్యాటింగ్ పేలవ ప్రదర్శనతో రెండో టెస్టులో ఓటమి పాలయ్యింది. ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ లో చరిత్రలో వేగంగా ముగిసిన టెస్ట్ గా ఈ మ్యాచ్ మిగిలిపోయింది. టీమిండియా బ్యాటర్లలో ముఖ్యంగా సీనియర్లు…

Read More

దళిత చేతిలో బీజేపీ పగ్గాలు పెడతారా, వ్యూహాత్మక ప్రచారమా?

బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం కొంతకాలంగా నానుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర క్యాబినెట్లో చేరిన జేపీ నడ్డా రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం వరకూ ఆయన పార్టీ పగ్గాలు మోస్తానని ప్రకటించారు. కానీ తీరా 8 నెలలుగా ఆ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి ఫిబ్రవరి నాటికి నూతన అధ్యక్షుడి విషయంలో స్పష్టత వస్తుందన్న ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి…

Read More

రాజకీయాల్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్!

వర్తమాన ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం పడని రంగం లేదు. ఇప్పటికే గూగుల వంటి సంస్థలు కూడా తమ సిబ్బందిలో 10 శాతం మందిని ఇంటికి సాగనంపబోతున్నట్టు ప్రకటించేశాయి. అదంతా ఏఐ ప్రభావమేనని చెబుతున్నాయి. అదే సమయంలో రాజకీయ నేతలు కూడా ఏఐ వాడకం విస్తృతం చేస్తున్నారు. ప్రచారానికి దానిని విరివిగా వాడే ప్రయత్నంలో ఉన్నారు. కృత్రిమ మేథ సహాయంలో మరణించిన వారందరి ఆశీస్సులు తమకే ఉన్నాయని చాటేందుకు తగ్గట్టుగా వీడియోలు, ఫోటోలు ప్రచారంలో పెడుతున్నారు. అదే…

Read More

జనసేన నాయకుడి ఇంట్లో బాలుడి అనుమానాస్పద మృతి, దర్యాప్తు కోసం ఆందోళన

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడి ఇంట్లో బాలుడి మృతి కలకలం రేపుతోంది. బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ఎల్బీనగర్ కు చెందిన ఆటోడ్రైవర్ కుక్కల మల్లేశ్వరరావు కుమారుడు కుక్కల చరణ్ శ్రీ తేజ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ ఇంటికి సమీపంలోనే ఉన్న రాజేశ్వరి రెసిడెన్సీ వద్ద ఈ ఘటన జరిగింది. అపార్ట్ మెంట్ వాచ్…

Read More

అక్కడికి టీమిండియా వెళ్లడం లేదు.. ఇప్పుడేమవుతుంది?

పాకిస్తాన్ లో నిర్వహించబోయే ఛాంపియన్స్ ట్రోపీకి తమ టీమ్ ని పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టబోదంటూ తేల్చేసింది. దాంతో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫి నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. గత ఏడాది ఆసియా కప్ మ్యాచ్ ల కోసం కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదు. దాంతో హైబ్రీడ్ పద్ధతిలో టీమిండియా మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు కూడా అలాంటి మార్గం అన్వేషించాలని బీసీసీఐ కోరుతోంది. ఇండియా- పాకిస్తాన్…

Read More

రుషికొండ నిర్మాణాల మీద జగన్ ను జీవితకాలం జైల్లో పెట్టాలంట..!

రుషికొండ ప్యాలెస్ విషయంలో అధికమొత్తంలో ఖర్చు చేసినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జీవితకాలం జైలులో పెట్టాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. కేవలం సొంత ప్రయోజనాల కోసం కుట్రపూరితంగా నిర్మాణం జరిగిందని మండిపడ్డారు. వేల రూపాయలు వెచ్చించిన ఈ భవనం ప్రభుత్వ అవసరాలకు కూడా ఉపయోగపడదని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా రుషికొండ ప్యాలెస్ గురించి వేసిన ప్రశ్నకు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమాధానమిచ్చారు. రుషికొండ మొత్తం భవనాలు,…

Read More

బాలినేని బల ప్రదర్శనకు అడ్డంకులు ఏమిటి ?

బహిరంగ వేదికలపై టీడిపి, జనసేన నాయకుల కోట్లాటలు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు తల నొప్పిగా మారాయి. ఇలాంటి ఘటనల వలన… వలస నేతలను చేర్చుకునేందుకు టిడిపి జనసేనలు భయపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో మొదలయిన ఈ అసంతృప్త జ్వాలలు అన్నీ నియోజకవర్గాలకు విస్తరించాయి. ఒంగోలు, దెందులూరు, నెల్లిమర్ల,పిఠాపురం నియోజకవర్గాల బాటలో చాలా నియోజకవర్గాలు చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరి దాదాపు 50 రోజులు పైనే…

Read More

ఏపీ పీఏసీ కోసం ఎన్నికలే, ఏకగ్రీవానికి అంగీకరించని కూటమి నేతలు

సంప్రదాయానికి భిన్నంగా సాగుతోంది ఎన్డీయే ప్రభుత్వం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని విపక్షానికి అప్పగించడం 1966 నుంచి అమలవుతోంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆపార్టీ పక్షాన పులవర్తి రామాంజనేయులుకి పీఏసీ దక్కబోతోంది. తొలుత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని వైఎస్సార్సీపీ ప్రతిపాదించగానే ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు ప్రచారం సాగుతోంది. దాంతో అంతా ఏకగ్రీవం అనుకున్నారు. తీరా అందుకు భిన్నంగా జనసేన నేతను బరిలో దింపాలని కూటమి నేతలు…

Read More

మహానటి కీర్తి సురేష్ పెళ్లి , ప్రేమించి పెళ్లి పీటలెక్కిన స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడారు. ఆంటోని తెట్టిల్ ను గోవా వేదికగా జరిగిన పెళ్లిలో సంప్రదాయబద్ధంగా మనువాడారు. కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటి సినిమాతో ఆమెకు జాతీయ అవార్డ్ కూడా దక్కింది. తెలుగులో స్టార్ హీరోలు మహేష్ బాబు సహా పలువురి సరసన నటించి, మెప్పించింది. అయితే తన చిన్న నాటి స్నేహితుడితో ప్రేమాయణం విషయాన్ని…

Read More