దొమ్మరాజు గుకేశ్ విజయానికి మూలం కోహ్లీ ఫిట్ నెస్ మంత్రం అదే!

2011లో టీమిండియా చివరి సారిగా వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆనాడు టీమిండియా విజయంలో తెరవెనుక కీలకపాత్రధారుల్లో ఆయన ఒకరు. 2024 పారిస్ ఒలింపిక్స్ లో టీమిండియా హాకీ మెడల్ సాధించింది. అప్పుడు కూడా టీమ్ సక్సెస్ లో ఆయన పాత్ర ఉంది. తాజాగా గుకేశ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించాడు. చిన్నవయసులోనే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఆ చిన్నోడి విజయంలోనూ ఆయన పాత్ర ఉంది. ఆటలు వేరు..ఆటగాళ్ళు వేరు. కానీ ఆయన విజేతలను తయారుచేయడంలో…

Read More

అనుష్క శర్మ ఉంటేనే కోహ్లీ సెంచరీలా?

విరూష్క అంటూ పిలుచుకునే ఈ జంట గురించి అనేక ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్ కి తెలుసు. తాజాగా టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి మరో విషయం వెలుగులోకి తెచ్చాడు. అనుష్క శర్మ స్టాండ్స్ లో ఉంటే విరాట్ రెచ్చిపోతుంటాడంటూ ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకు గతంలో జరిగిన పరిణామాలను ఉదహరించాడు. తాజాగా పెర్త్ టెస్ట్ లో విరాట్ సెంచరీ చేసిన సమయంలో అనుష్క శర్మ అక్కడే ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. 2015 లో రావిశాస్త్రి మన…

Read More

ఇళయరాజాకి కులవివక్ష, గర్భగుడి ప్రవేశాన్ని అడ్డుకున్న అర్చకులు, జీయర్లు

దేశంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకి చుక్కెదురయ్యింది. ఆయన ఆలయంలో అడుగుపెట్టే ప్రయత్నానికి అభ్యంతరం వ్యక్తమయ్యింది. గర్భగుడిలో ఆయన ప్రవేశించడానికి నిరాకరించారు. దాంతో ఇళయరాజా నిరాశ చెందాల్సి వచ్చింది. గర్భగుడిలోకి వెళ్లేందుకు ఇళయరాజా ప్రయత్నించగా ‘గర్బగుడిలోకి మీకు లోపలికి ప్రవేశం లేదని’ పూజారులు, జీయర్లు వెనక్కి పంపించేశారు. తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. గర్భుగడిలో ప్రవేశించేందుకు చేసిన యత్నానికి స్థానిక పూజార్లు, ఆలయ అర్చకులు అంగీకరించకపోవడం వివాదంగా మారుతోంది. ఇళయరాజా…

Read More

ఏపీ శాసనమండలిలో పెరిగిన పీడీఎఫ్‌ బలం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఊపు

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో పీడీఎఫ్‌ తన బలం పెంచుకుంది. సిట్టింగ్ టీచర్ సీటుని నిలబెట్టుకుంది. గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీటుకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది. 65 శాతం పైబడి ఓట్లు దక్కించుకుంది. త్వరలో జరగబోతున్న రెండు గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికలకు తమ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. టీచర్ ఎమ్మెల్సీగా ఉండగా షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆ సీటుకి ఉప ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి సునాయాసంగా…

Read More

దీపావళి హిట్ కొట్టేసిన ఆ మూడు సినిమాలు ఓటీటీలో ఎక్కడంటే..!

ఈసారి పండుగ సినీ ఇండస్ట్రీకి సంతోషాన్ని నింపింది. ఒకేసారి విడుదలయిన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. అందులో తెలుగు హీరో కిరణ్‌ అబ్బవరం సినిమా క మంచి మార్కులు దక్కించుకుంది. దాంతో పాటుగా తమిళ్ స్టార్ శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్ తో పాటుగా మళయాళీ యంగ్ హీరో దుల్కర్ సల్మన్ స్ట్రయిట్ మువీ లక్కీ భాస్కర్ సైతం మంచి రెస్పాన్స్ సాధించాయి. పాజిటివ్ గా ఓపెనింగ్స్ కనిపించాయి. ఇప్పుడీ మూడు సినిమాలు…

Read More

ఆస్ట్రేలియాతో టెస్టులో టీమిండియాను ఆదుకున్న తెలుగోడు

ఆంధ్రా జట్టు ఆటగాడు ఆరంభ మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల మధ్య టీమిండియా స్కోర్ 150 రన్స్ కి చేరడంలో కీలకంగా వ్యవహరించాడు. తన ఆరంభ మ్యాచ్ లోనే జట్టు తరుపున హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచాడు. కెరీర్ తొలి ఇన్నింగ్స్ లోనే 6 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 41 రన్స్ చేశాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ 37 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు కలిసి కొంత సేపు ఆస్ట్రేలియన్ బౌలర్లను ప్రతిఘటించారు….

Read More

ఇరాన్ మహిళ దుస్తులు విప్పేసింది కారణమేంటి?

ఇరాన్‌ రాజధాని నగరం తెహ్రాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ‌ సైన్స్, రీసర్చ్ బ్లాక్-1 దగ్గర ఓ మహిళ అర్థనగ్నంగా కనిపించారు. ఇన్నర్ వేర్ మాత్రమే ధరించిన ఒక అమ్మాయి యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఒక గోడపై కూర్చున్న వీడియో వైరల్ అయ్యింది. ఆమె నిరసన తెలుపుతూ ఇలా ప్రవర్తించిందనే వాదన వినిపించింది. సోషల్ మీడియాలో ఆమెకు మద్ధతుగా పోస్టింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా ఆమె మానసిక స్థితి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులు…

Read More

భారీ వర్ష సూచన, రైతులు సర్దుకోండి!

నవంబర్ నెలాఖరులో ఏపీలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అంతా అప్రమత్తం కావాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందంటూ అంచనా వేసింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెబుతోంది. తర్వాత,…

Read More

గోదావరి పుష్కరాల ముహూర్తమిదే, ఈసారి వచ్చే యాత్రికులెందరంటే!

కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. దీంతో, ప్రభుత్వం..స్థానిక నేతలు – యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనుల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాజాగా పుష్కరాల నిర్వహణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి…

Read More

మహానాడు వక్తలకు రాజబోగం.. ఐటిడిపికి మొండిచెయ్యి

నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ ఐటిడిపి సోషల్ మీడియా వింగ్ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి, రెండవ జాబితాల్లో ఐటిడిపి నుంచి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇవ్వకపోడంపై మీడియా ముందుకు వచ్చి వాపోతున్నారు. వైసిపి అధికారంలో ఉండగా తాము కూడా కేసులు ఎదుర్కొన్నామని..పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా పదవులు రావడంలేదని మొరపెట్టుకుంటున్నారు. వైసిపి సోషల్ మీడియా వలన ఐదేళ్లుగా వ్యక్తిగతంగా తాము చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నామని.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు న్యాయం చేయలేపోతున్నారాని…

Read More