కడప రెడ్డమ్మకు అవమానమా, ఎమ్మెల్యే మాధవి నిరసన

కడప రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా మునిసిపల్ కార్పోరేషన్ వ్యవహారాల్లో పెత్తనం కోసం ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవికి మేయర్ సురేష్ బాబు కి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. తాజాగా మేయర్ ఛాంబర్ లో ఎమ్మెల్యే కుర్చీలు కూడా తీసివేయించారంటూ ఎమ్మెల్యే మాధవి ఆరోపిస్తున్నారు. తమను అవమానించారంటూ ఆమె నిరసనకు దిగారు. తాజాగా మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె నిలబడి తన నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేయర్ స్పందించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్…

Read More

సిబిల్ స్కోర్ వ్యవస్థకు చెక్ పడుతుందా? సామాన్యులకు ఊరట దక్కుతుందా?

బ్యాంక్ లోన్ కావాలంటే సిబిల్ స్కోర్, ఏదయినా ఫైనాన్స్ వ్యవహారం చక్కదిద్దాలంటే సిబిల్ స్కోర్. ఇలా ప్రతీదానికి సిబిల్ స్కోర్ తో ముడిపెట్టి చాలామందిని వేధిస్తున్న పరిస్థితి కొంతకాలంగా తీవ్రమవుతోంది. సిబిల్ స్కోర్ పడిపోతుందన్న ఆందోళనతో సతమతమయ్యే మధ్యతరగతి సంఖ్య పెరుగుతోంది. దాంతో ఈ వ్యవహారం మీద తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా సిబిల్ స్కోర్ విషయమై వివాదం ఏకంగా సుప్రీంకోర్టుకి చేరింది. ఈ విధానం వల్ల ఈ దేశ బ్యాంకు అకౌంట్ హోల్డర్ల వ్యక్తిగత గోప్యతకు…

Read More

రేవంత్ రెడ్డితో భేటీకి చిరంజీవి దూరంగా ఉండడానికి కారణమదేనా, టాలీవుడ్ ఆశించింది జరిగేనా?

ఆకు వెళ్లి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి ఆకు మీద పడినా నష్టపోయేది ఆకు అన్నది నానుడి. సరిగ్గా టాలీవుడ్ కి ఇది వర్తించేలా కనిపిస్తోంది. పాలకపక్ష నేతకు కోపం వచ్చినా టాలీవుడ్ కే నష్టం. టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆగ్రహం కలిగినా వాళ్లే నష్టపోతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్- రేవంత్ రెడ్డి ఉదంతం అందుకు సాక్ష్యంగా ఉంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం అందుకు కొనసాగింపుగానే కనిపిస్తోంది. ప్రభుత్వాలకు…

Read More

చంద్రబాబు ప్లాన్డ్ గానే ఉన్నారు.. జగన్ కు ఇబ్బందులు తప్పవా..?

ఏపీలో కూడా జమిలీ ఎన్నికలు తప్పవా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ప్రకటిస్తున్న వేళ ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు తప్పవనే అంచనాలు పెరుగుతున్నాయి. ఈసారి అసెంబ్లీకి పూర్తి ఆయుష్షు కష్టమనే అభిప్రాయం బలపడుతోంది. మధ్యంతర ఎన్నికలు వస్తే అవి ఎప్పుడా అన్న చర్చ కూడా సాగుతోంది. 2027లోనే యూపీ ఎన్నికలతో పాటుగా ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధమయితే ఏపీ కూడా…

Read More

ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ వివాదాలు, అడుగులు పడేనా?

ఏపీకి కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది అంతుబట్టకుండా ఉంది. ఆఖరికి అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్ల నిధులు కూడా అప్పుగానా, గ్రాంట్ గానా అన్నది సందేహంగా కనిపిస్తోంది. ఈ సందిగ్ధం కొనసాగుతున్న వేళ తాజాగా కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ ప్రకటనలు చిచ్చుపెడుతున్నాయి. బహుశా పౌరవిమానయాన శాఖ టీడీపీ ఎంపీ చేతిలో ఉండడంతో ఆ శాఖ ద్వారానే ఎక్కువ ఫలితాలను ఆశిస్తూ ఎయిర్ పోర్టుల చుట్టూ హంగామా చేస్తున్నారా అన్న చర్చ…

Read More

దళిత చేతిలో బీజేపీ పగ్గాలు పెడతారా, వ్యూహాత్మక ప్రచారమా?

బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం కొంతకాలంగా నానుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర క్యాబినెట్లో చేరిన జేపీ నడ్డా రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం వరకూ ఆయన పార్టీ పగ్గాలు మోస్తానని ప్రకటించారు. కానీ తీరా 8 నెలలుగా ఆ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి ఫిబ్రవరి నాటికి నూతన అధ్యక్షుడి విషయంలో స్పష్టత వస్తుందన్న ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి…

Read More

నాగార్జున వియ్యంకుడు దుబాయ్ లో చానా రిచ్!

అఖిల్ అక్కినేని మరోసారి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పటికే ఓసారి జీవీకే మనుమరాలు శ్రేయస్ భూపాల్ తో నిశ్చితార్థం వరకూ వెళ్ళి వెనక్కి తగ్గిన ఈ అక్కినేని చిన్నోడు ఈసారి కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న తన సహచరి జైనబ్ రావుడ్జీతో పెళ్లికి రెడీ అవుతున్నాడు. జైనబ్ కుటుంబానికి దుబాయ్ లో పెద్ద నెట్ వర్క్ ఉంది. పశ్చిమాసియాలోనే పలుకుబడి కలిగిన బడా బిజినెస్ మేన్ ఆమె తండ్రి. గతంలో ఎనర్జీ సెక్టార్ లో…

Read More

జమిలీ ఎన్నికలకు రెడీ అవుతున్న వైఎస్సార్సీపీ, టీడీపీ అధిష్టానం కూడా సిద్ఢమా?

ఆంధ్రప్రదేశ్‌ లో ముందస్తు ఎన్నికలు తప్పవన్న అంచనాకు రాజకీయ పార్టీలు వచ్చేశాయి. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంటూ మోదీ పదే పదే చెబుతుండడంతో పరిణామాలు అనివార్యంగా భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా జమిలీ ఎన్నికలంటూ తమ క్యాడర్ కి పిలుపునిచ్చారు. మరో రెండేళ్లలో ఎన్నికలు అనివార్యమంటూ చెబుతున్నారు. రాబోయే ఎన్నికలకు అంతా సిద్ధం కావాలని సూచిస్తున్నారు. సాధారణ ఎన్నికలు ముగిసి ఇంకా ఆరు నెలలు కూడా గడవకముందే అప్పుడే…

Read More

సమిష్టి నాయకత్వంతోనే సంక్షేమం : హరిప్రసాద్

ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఉచిత సిలిండర్ల కార్యక్రమాన్ని సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్యం ఎన్నికలముందు ఇచ్చిన హామీ ప్రకారం దీపం 2 పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లను తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. దిగువ మధ్య తరగతి ఇళ్ళల్లో వెలుగులు నింపుతున్న మహోన్నత వ్యక్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఈ ఉచిత సిలిండర్ల…

Read More