తెలుగువారిని అంతఃపురం సేవకులుగా వర్ణించిన సినీ నటి!

సినీ నటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలుగువారి పట్ల చేసిన విమర్శలు ఆమెను వివాదాల్లోకి నెట్టాయి. ఆ నటి తీరు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకి ఆమె తలొగ్గాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా సీనియర్ నటి కస్తూరి కామెంట్స్ కారణంగా చెలరేగిన కలకలం తర్వాత పరిస్థితి. తాజాగా తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారి గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇచ్చారు. ఆమె తెలుగువారినుద్దేశించి చేసిన…

Read More

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుందా, పనులేమయినా జరుగుతున్నాయా?

అమరావతిలో రాకపోకలకు కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం ఆరేళ్ల పాటు ఒక్క అడుగు కూడా పడలేదు. ఏపీ రాజధాని నగర నిర్మాణంలో ముఖ్యమైన రోడ్డు పనులు సాగకపోవడంతో సీఎం, చీఫ్‌ జస్టిస్ సహా అంతా అవస్థలు పడ్డారు. కరకట్ట రోడ్డుని ఆశ్రయించక తప్పని స్థితిలో సాగారు. అయితే రైతులు భూములివ్వకపోవడం వల్ల వెంకటపాలెంలో ఆగిన రోడ్డులో చిన్న పాటి కదలిక వచ్చింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో వీడియోలో చూడండి

Read More

సిక్స్ కొట్టినందుకు రూ. 5లక్షలు ఫైన్ కట్టిన అభిషేక్! ఎందుకంటే?

ఐపీఎల్ అంటేనే మనీ మెషిన్. ఇటు బీసీసీఐకి.. అటు ప్లేయర్లకు కాసుల పంట. ప్రతీ ఏడాది కోట్లాది రూపాయల సాలరీలు అందుకోవడమే కాకుండా.. గేమ్‌లో రాణిస్తే వివిధ రూపాల్లో డబ్బులు వచ్చి పడతాయి. అత్యధిక సిక్సులు కొట్టినందుకు కూడా ప్రైజ్ మనీ గెలుచుకుంటారు. కానీ ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ అభిషేక్ శర్మ శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కొట్టిన సిక్సుకు రూ.5 లక్షలు జరిమానా కట్టాల్సి వచ్చింది. లక్నోలోని ఏక్నా స్టేడియంలో హైదరాబాద్, బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్…

Read More

వైసిపి విమర్శలకు పవన్ ఊతమిచ్చారా?

రాష్ట్రంలో నిన్నటివరకు అధికార ఎన్డీయేకు వైసిపికు మధ్య విమర్శలు, సవాళ్లు నడిచాయి.కానీ నేడు బహిరంగ సభ వేదికపై సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణే అధికార భాగస్వామి మంత్రి పై విమర్శలు గుప్పించారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో అశ్రద్ధ వహిస్తే తానే హోం మంత్రిత్వ శాఖ బాధ్యతను తానే తీసుకుంటానని హెచ్చరించారు. ఇన్నాళ్లు ఎన్డీయే మిద వైసిపి చేసిన విమర్శలనే నేడు పవన్ గుర్తు చేశారు. ఎన్డీయే కూటమి అధికారం చేపట్టిన ఐదు నెలలు కాలంలోనే…

Read More

రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి కారకులెవరు? పవన్ కి ఇది అర్థమయితేనే!

సమస్య మూలాల నుంచి పరిష్కరించాలి. పైపై పూతలు కొంతకాలమే ఫలిస్తాయి. మళ్లీ మళ్లీ వ్యాధి లక్షణాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. సరిగ్గా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో అదే జరుగుతుంది. ఎవరైనా అధికారి లేదా ఇంకో నాయకుడు సందడి చేసిన సమయంలో ఓ వారం సర్ధుమణగడం, మళ్లీ చెలరేగిపోవడం అన్నది ఆనవాయితీగా మారుతోంది. మొన్నటి జూన్ లో ఇదే జరిగింది. సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు స్వీకరించగానే కాకినాడ వెళ్లారు. కలియ తిరిగారు….

Read More

దళిత చేతిలో బీజేపీ పగ్గాలు పెడతారా, వ్యూహాత్మక ప్రచారమా?

బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం కొంతకాలంగా నానుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర క్యాబినెట్లో చేరిన జేపీ నడ్డా రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం వరకూ ఆయన పార్టీ పగ్గాలు మోస్తానని ప్రకటించారు. కానీ తీరా 8 నెలలుగా ఆ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి ఫిబ్రవరి నాటికి నూతన అధ్యక్షుడి విషయంలో స్పష్టత వస్తుందన్న ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి…

Read More

విరాట్ వైఫల్యం టీమిండియాకు శాపంగా మారుతోందా? సీనియర్లే టీమ్ కి భారమా?

టీమిండియా తీవ్రంగా సతమతమవుతోంది. ముఖ్యంగా టెస్టుల్లో జట్టు కుదురుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గడిచిన ఐదు టెస్టుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. నాలుగు టెస్టుల్లో ఓటమి పాలయ్యింది. బ్రిస్బేన్ లో వర్షం ఆపకపోతే ఐదో టెస్ట్ ఓటమి అంచున ఉంది. ఆస్ట్రేలియాకు సిరీస్ అప్పగించే పనిలో కనిపిస్తోంది. జట్టులో ఆటగాళ్లు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమవుతున్నారు. బౌలింగ్ లో బుమ్రా, బ్యాటింగ్ లో కొంత మేర కేఎల్ రాహుల్ మినహా మిగిలిన వాళ్లంతా…

Read More

ఆ పెళ్లి మీద ట్రోలింగ్ ఎందుకు బ్రో..?

సినీ నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ గడుపుతున్నారు. అందులో హీరో ప్రభాస్, టీవీ స్టార్లు యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వంటి వాళ్ల పేర్లుంటాయి. చాలాకాలం పాటు వెయిట్ చేసిన సుబ్బరాజు ప్రస్తుతం వాళ్ల లిస్టు నుంచి బయటపడడం విశేషమే. చాలాకాలంగా తన పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తున్న సుబ్బరాజు తాజాగా తన వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్…

Read More

ఈవీఎంల భాగోతం బయటపడుతున్నా, విపక్షాలు ఎందుకలా ఉంటున్నాయి?

పోలయిన ఓట్ల కన్నా ఎక్కువే లెక్కిస్తున్నారుఈవీఎం ఛార్జింగ్ ఎక్కడా తగ్గడం లేదువీవీ పాట్ల లెక్క తేల్చడం లేదుఈవీఎంలు ఓటేసిన వాళ్లే రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు దేశంలో ఎన్నికల వ్యవస్థ చుట్టూ సందేహాలు చెలరేగుతున్నాయి. ఈ అనుమానాలు రానురాను బలపడుతున్నాయి. ఇప్పటికప్పుడు అపోహలు తొలగించాల్సిన ఎన్నికల కమిషన్ వాటికి మరింత ఊతమిస్తోంది. ప్రజల్లోంచి వస్తున్న సందేహాలు తీర్చడానికి ససేమీరా అంటోంది. భవిష్యత్తులో ఇది పెను దుమారం దిశగా సాగుతోంది. మహారాష్ట్రలో తాము ఓటేసిన పార్టీకి సున్నా ఓట్లు వచ్చి…

Read More