కార్యకర్తలే బలిపశువులు, చంద్రబాబు, జగన్ ఎవరైనా అదే తంతు!

అధికారంలో టీడీపీ ఉందా లేక వైఎస్సార్సీపీనే కొనసాగుతుందా అన్నది తెలీయడం లేదు- ఇదీ ఓ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. అంతకుముందు వైఎస్సార్సీపీ హయంలోనూ ఇలాంటి మాటలే వినిపించాయి. ఇంకా చెప్పాలంటే మేమంతా కష్టపడితే గెలిచిన సీఎం ఈయనేనా అని అప్పుడూ, ఇప్పుడూ సందేహించే పరిస్థితి ఆయా పార్టీల శ్రేణుల్లో ఉంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఏలూరు పరిస్థితి చూద్దాం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ శ్రేణుల మీద పలు కేసులు పెట్టారు. ఆ…

Read More

మోహన్ బాబు- మనోజ్ బాబు- మీడియా తప్పు ఎవరిది? శిక్ష ఎవరికీ?

మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం కొత్తది కాదు. కొంతకాలంగా దాని ఆనవాళ్లు బయటకు వస్తూనే ఉన్నాయి. వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. చివరికిలా బయటపడింది. అయితే ఈసారి కూడా భౌతికదాడులు, బౌన్సర్ల తో గొడవలు, గేట్లు నెట్టుకోవడాలు, కేసులు పెట్టుకోవడాలు వంటివి చూస్తున్నాం. సహజంగానే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి వాళ్ల చుట్టూ ఏం జరిగినా జనాల్లో ఆసక్తి ఉంటుంది. మీడియాకు మంచి సరుకుగా మారుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అనూహ్యంగా మీడియానే నిందిస్తూ, మితిమీరి…

Read More

అదీ పవన్.. అదే రూటు! పిఠాపురంలో పట్టు సడలకూడదంటే..!

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో దిగి గెలిచారు. అంతకుముందు గాజువాక, భీమవరం ఓటర్లు ఆయన్ని ఓడిస్తే పిఠాపురం ప్రజలు మాత్రం ఆదరించారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కోరిక తీర్చారు. దాంతో ఆయన ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఓటర్లంతా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల పిఠాపురం పట్టణ అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత పిఠాపురం అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ ఏర్పాటునకు…

Read More

సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లికి అంతా రెడీ

ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ మరోసారి పెళ్లి పీటలెక్కుతున్నాడు. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధమయ్యింది. నవంబర్ 10న వారి వివాహం జరుగుతుంది. 16వ తేదీన బంధు మిత్రులు, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటుచేశారు. డైరెక్టర్ క్రిష్ కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆమె కూడా డాక్టర్ రమ్య వైద్యురాలే. తొలుత అమెరికాలో గడిపిన జాగర్లమూడి క్రిష్‌ ఆ తర్వాత సినిమాల…

Read More

బంగ్లా అనిశ్చితి ఇండియాకు కలిసొచ్చింది.. ఎందులో తెలుసా?

ఇండియా టెక్ట్స్ టైల్ మార్కెట్ పుంజుకుంటోంది.. కారణమదే రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా దేశంలో చమురు ధరలు అదుపులోకి వచ్చాయి. అంతేగాకుండా దేశం నుంచి భారీగా ఆయిల్ ఎగుమతులు పెరుగుతున్నాయి. అనూహ్యంగా ప్రస్తుతం యూరప్ కి ఆయిల్ ఎగుమతిదారుల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని దాన్ని శుద్ధి చేసి యూరప్ కి ఎగుమతి చేయడం ద్వారా ఇండియా భారీగా లాభాలు అర్జిస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ పరిణామాలతో కూడా ఇండియాకు ఉపయోగం కనిపిస్తోంది….

Read More

నితీశ్ కెరీర్ కి మీడియా హైప్ ముప్పుగా మారుతుందా?

టీమిండియా ఆటగాళ్ళను ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పతనానికి పడేయడం చాలా సహజం. ఒక్క మ్యాచ్ లో లేదా ఒక సిరీస్ లో రాణించగానే అంతా, ఇంతా అంటూ కొనియాడడం, అంతలోనే కొన్ని ఫెయిల్యూర్స్ కి తీవ్రంగా నిందించడం అనేది అభిమానులకే కాదు మీడియాకు కూడా అలవాటు. తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి ఉదంతం చూస్తుంటే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. మెల్బోర్న్ లో అద్భుతంగా రాణించిన ఆటగాడి పట్ల మీడియా స్పందించిన తీరు అతిగా ఉందనే వాదన వినిపిస్తోంది….

Read More

రేషన్ అక్రమరవాణాకు మూలం అవేనట..మాఫియా నియంత్రణ కష్టమట!

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఏపీలో రేషన్ బియ్యం మాఫియాకు డోర్ డెలివరీ కోసమంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలు కారణమంటూ విమర్శించారు. ఏకంగా 1600 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాల ద్వారా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకుని అక్రమంగా బియ్యం తరలిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. దానికి ఆధారంగా గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాలలో జరిగిన బియ్యం ఎగుమతుల విలువను వెల్లడించారు. రూ. 48,537 కోట్ల విలువైన బియ్యం కాకినాడ…

Read More

జగన్ చొరవ నేరంగా చిత్రీకరించే యత్నంలో చంద్రబాబు, చేతులుడిగిన విపక్షం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకోవడం ఓ చరిత్ర. గతంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వం చేయని సాహసం. అనేక విధాలుగా ఆర్థిక అవస్థల్లో ఉన్న ఏపీలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు, అవి కూడా ప్రభుత్వమే నిర్మించపూనుకోవడం అభినందించాల్సిన అంశం. అందులో 5 కాలేజీలు ప్రారంభించి, మరో 5 కాలేజీల ప్రారంభానికి సన్నాహాలు చేయడం ఆహ్వానించాల్సిన అంశం. ఇదంతా జగన్ పాలనలో ఏపీకి జరిగిన మేలు. ఏపీలో వైద్య విద్య అభ్యసించాలని ఆశిస్తున్న…

Read More

ఈ క్రికెటర్ త్వరలో డాక్టర్ అయిపోతున్నాడట..!

జాన్ కోరా,సీనియర్ జర్నలిస్ట్ క్రీడాకారులు ఏం చదువుకున్నారు? సచిన్ టెన్త్, కోహ్లీ ఇంటర్, ధోనీ బీఏ ఫెయిల్ అంటూ చాలా సార్లు మనం సోషల్ మీడియాలో పోస్టులు చూశాం. క్రికెటర్లు, సినిమా నటులు, కళాకారులు చాలా మంది పెద్దగా చదువుకోలేదని.. అయినా వారు పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించడం లేదా అని ప్రశ్నించే వారినీ చూశాం. కానీ.. అది అన్ని వేళలా సాధ్యం‌ కాదు. ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా పిల్లల మనసుల్లో చదువుకు విలువే లేదనేది నాటుతున్నామని…

Read More