మీకు 2 రోజుల పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఆగిపోతాయి, ఎవరికి, ఎప్పుడో తెలుసా?

యూపీఐ వ్యవస్థ ఇప్పుడు సర్వజనీనమయిపోయింది. చిన్న వ్యాపారాల నుంచి పెద్ద సంస్థల వరకూ అందరూ స్కానర్ ద్వారా పేమెంట్స్ కి ప్రాధాన్యతనిస్తున్నారు. నెలా నెలా పెరుగుతున్న లావాదేవీలతో యూపీఐ పేమెంట్స్ రికార్డుల మోత మోగిస్తోంది. అయితే తాజాగా బ్యాంకుల నిర్వహణ కోసమంటూ యూపీఐ కార్యకలాపాలు బంద్ చేయబోతున్నారు. రెండు రోజుల పాటు వాటిని నిలిపివేసే అవకాశం ఉంది. నవంబర్ లోనే HDFC బ్యాంక్ తన ఖాతాదారులకు ఈ సేవలు నిలిపివేయబోతోంది. తొలుత HDFC అకౌంట్ హోల్డర్లకు రెండు…

Read More

అక్కడికి టీమిండియా వెళ్లడం లేదు.. ఇప్పుడేమవుతుంది?

పాకిస్తాన్ లో నిర్వహించబోయే ఛాంపియన్స్ ట్రోపీకి తమ టీమ్ ని పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టబోదంటూ తేల్చేసింది. దాంతో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫి నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. గత ఏడాది ఆసియా కప్ మ్యాచ్ ల కోసం కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదు. దాంతో హైబ్రీడ్ పద్ధతిలో టీమిండియా మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు కూడా అలాంటి మార్గం అన్వేషించాలని బీసీసీఐ కోరుతోంది. ఇండియా- పాకిస్తాన్…

Read More

ఏపీ శాసనమండలిలో పెరిగిన పీడీఎఫ్‌ బలం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఊపు

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో పీడీఎఫ్‌ తన బలం పెంచుకుంది. సిట్టింగ్ టీచర్ సీటుని నిలబెట్టుకుంది. గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీటుకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది. 65 శాతం పైబడి ఓట్లు దక్కించుకుంది. త్వరలో జరగబోతున్న రెండు గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికలకు తమ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. టీచర్ ఎమ్మెల్సీగా ఉండగా షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆ సీటుకి ఉప ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి సునాయాసంగా…

Read More

ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ వివాదాలు, అడుగులు పడేనా?

ఏపీకి కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది అంతుబట్టకుండా ఉంది. ఆఖరికి అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్ల నిధులు కూడా అప్పుగానా, గ్రాంట్ గానా అన్నది సందేహంగా కనిపిస్తోంది. ఈ సందిగ్ధం కొనసాగుతున్న వేళ తాజాగా కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ ప్రకటనలు చిచ్చుపెడుతున్నాయి. బహుశా పౌరవిమానయాన శాఖ టీడీపీ ఎంపీ చేతిలో ఉండడంతో ఆ శాఖ ద్వారానే ఎక్కువ ఫలితాలను ఆశిస్తూ ఎయిర్ పోర్టుల చుట్టూ హంగామా చేస్తున్నారా అన్న చర్చ…

Read More

తెలుగువారిని అంతఃపురం సేవకులుగా వర్ణించిన సినీ నటి!

సినీ నటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలుగువారి పట్ల చేసిన విమర్శలు ఆమెను వివాదాల్లోకి నెట్టాయి. ఆ నటి తీరు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకి ఆమె తలొగ్గాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా సీనియర్ నటి కస్తూరి కామెంట్స్ కారణంగా చెలరేగిన కలకలం తర్వాత పరిస్థితి. తాజాగా తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారి గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇచ్చారు. ఆమె తెలుగువారినుద్దేశించి చేసిన…

Read More

ఏపీలో పెట్టుబడుల మీద తెలంగాణా మంత్రి కీలక వ్యాఖ్యలు

తెలంగాణా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమరావతికి వరద ముప్పు కారణంగా ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదంటూ అభిప్రాయపడ్డారు. ఏపీలో చంద్రబాబు రాగానే హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందనేది తప్పుడు ప్రచారం మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. పెట్టుబడిదారులు అమరావతి కంటే హైదరాబాద్‌, బెంగళూరుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటూ మంత్రి పొంగులేటి అన్నారు. ఏపీలో ఇటీవల ప్రభుత్వం వరుసగా…

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకున్న వైఎస్సార్సీపీ!ఎవరికి కలిసొస్తుంది?

ఏపీలో శాసనమండలి స్థానాలకు జరుగుతున్న ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని ఆపార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతిభద్రతల కారణంగా ఎన్నికల తీరు మీద తమకు విశ్వాసం లేదని ప్రకటించింది. రెండు జిల్లాల పార్టీ నేతలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. నాయకుల అబిప్రాయం సేకరించారు. తొలుత కార్మిక నాయకుడు పి గౌతమ్ రెడ్డిని పోటీలో పెట్టాలని భావించిన వైఎస్సార్సీపీ చివరకు…

Read More

ఇళయరాజా కొడుకు ముస్లీం మతంలోకి ఎందుకు మారాడు?

తమిళనాడులో ఆలయ ప్రవేశం నిరాకరించారన్న వార్తలతో ఇళయరాజా వార్తల్లోకెక్కారు. అయితే ఆయన గురించి తనయుడు యువన్ శంకర్ రాజా వెల్లడించిన చర్చనీయాంశమవుతున్నాయి. ఇళయరాజా తనయుడు ఇప్పటికే మతం మార్చుకున్నారు. ఆయన హిందూ మతం వీడి ముస్లీం మతం స్వీకరించారు. ఆ సమయంలో తన తండ్రి గురించి ఆయన కీలకమైన వ్యాఖ్యానాలు చేశారు. “మా నాన్న హిందూమతాన్ని ఫాలో అవుతారు, ఆయనకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఇంట్లో చిన్న గాజుగ్లాసు పగిలినా, అదొక అపశకునమని పండితున్ని పిలిచి పూజలు…

Read More

ఇళయరాజాకి కులవివక్ష, గర్భగుడి ప్రవేశాన్ని అడ్డుకున్న అర్చకులు, జీయర్లు

దేశంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకి చుక్కెదురయ్యింది. ఆయన ఆలయంలో అడుగుపెట్టే ప్రయత్నానికి అభ్యంతరం వ్యక్తమయ్యింది. గర్భగుడిలో ఆయన ప్రవేశించడానికి నిరాకరించారు. దాంతో ఇళయరాజా నిరాశ చెందాల్సి వచ్చింది. గర్భగుడిలోకి వెళ్లేందుకు ఇళయరాజా ప్రయత్నించగా ‘గర్బగుడిలోకి మీకు లోపలికి ప్రవేశం లేదని’ పూజారులు, జీయర్లు వెనక్కి పంపించేశారు. తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. గర్భుగడిలో ప్రవేశించేందుకు చేసిన యత్నానికి స్థానిక పూజార్లు, ఆలయ అర్చకులు అంగీకరించకపోవడం వివాదంగా మారుతోంది. ఇళయరాజా…

Read More

బాహుబలిని బీట్ చేసిన పుష్ప2! ఇక మిగిలింది ఆ సినిమానే!

ఇండియన్ మువీ ఇండస్ట్రీలో పుష్ప2 కొత్త రికార్డ్ బ్రేక్ చేసింది. టాలీవుడ్ సత్తాను చాటిచెప్పింది. బాహుబలిని బీట్ చేసి రికార్డ్ కలెక్షన్లు సాధించింది. 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 1799 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. కొత్త రికార్డ్ నెలకొల్పింది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్ మువీ బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు ను పుష్ప 2 బ్రేక్ చేసినట్లు అయింది. బాహబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1788 కోట్ల రూపాయల…

Read More