సూపర్ స్టార్ కృష్ణకి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పోలిక ఏంటి?

తెలుగునాట ఎవరికిష్టమున్నా లేకున్నా సినిమాల ప్రభావం అసామాన్యం. సినీ హీరోలను కొలిచే యువతరం ఎప్పుడూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా సినిమాల నుంచి వచ్చి రాజకీయాలను, ప్రజల జీవితాలను శాసించే ప్రయత్నం కొందరు చేస్తుంటారు. వారిలో కొందరు సక్సెస్ అయిన చరిత్ర కూడా తెలుగునేల మీద ఉంది. తెలుగు హీరోలలో నెంబర్ వన్ గేమ్ ఆరంభం నుంచి ఆసక్తికరమే. అందులోనూ ఎన్టీఆర్ హవా సాగిన తర్వాత ఆయన కొత్త ట్రాక్ ఎంచుకోవడంతో ఆయన తర్వాత ఎవరూ అన్న ప్రశ్న…

Read More

వైఎస్ కుటుంబ ఆస్తుల తగాదా తేలాలంటే ఇంకో నెల ఆగాల్సిందే..

వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల తగాదాలో వచ్చిన విబేధాల మీద విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన కేసు డిసెంబర్ 13కి వాయిదా వేస్తున్నట్టు ఎన్సీఎల్టీ ప్రకటించింది. దాంతో ఈ వ్యవహారంలో స్పష్టతకు మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. సరస్వతి పవర్ లో వైఎస్ జగన్, ఆయన భార్య భారతి పేరు మీద ఉన్న వాటాలను వైఎస్ విజయమ్మకు గిఫ్ట్ డీడ్ గా రాశారు. దానిని…

Read More

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్! చంద్రబాబు మళ్లీ వెనక్కి మళ్లుతున్నారా?

చంద్రబాబు పదే పదే టెక్నాలజీకి సంబంధించిన పదాలతో ప్రజలను ఆకట్టుకోవాలని చూడడం ఆశ్చర్యం ఏమీ కాదు. దశాబ్దాలుగా ఆయన పాలనా విధానంలో పెద్దగా మార్పు ఉండదు. కానీ ఆనాటికి టెక్ ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలను ఆయన ఉపయోగిస్తూ ఉంటారు. అందరికీ గుర్తుండే ఉంటుంది..2019 కి పూర్వం ఆయన పదే పదే లాజిస్టిక్స్ హబ్ అంటూ చెప్పుకొచ్చేవారు. విశాఖను లాజిస్టిక్స్ హబ్ గా చేస్తానని కూడా ఆయన అన్నారు. మరి ఇప్పుడెందుకు ఆయన మాట మరచిపోయారు. ఇప్పుడెందుకు డీప్…

Read More

కెప్టెన్ మీద కోపగించి గ్రౌండ్ నుంచి వెళ్లిపోయిన క్రికెటర్..!

క్రికెట్లో చాలామందికి టెంపర్ మెంట్ ఉంటుంది. కొందరు దాన్ని ఫీల్డ్ లోనే ప్రదర్శిస్తారు. అలాంటిదే ఒకటి తాజాగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో వన్డే సందర్భంగా బయటపడింది. విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ అనూహ్యంగా గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. తన బౌలింగ్ లో కెప్టెన్ నిర్ణయం నచ్చలేదని డ్రెస్సింగ్ రూమ్ కి దారితీశాడు. దాంతో కొంతసేపు ఆ జట్టు పది మందితోనే ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ తీరుతో జోసెఫ విబేధించి…

Read More

రాజ్యసభలో డబ్బు కట్టలు

భారత పార్లమెంట్ లోని ఎగువ సభ రాజ్యసభలో డబ్బులు కలకలం రేపాయి. డబ్బుల కట్ట లభించడంతో అంతా అప్రమత్తమయ్యారు. రాజ్యసభ చైర్మన్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. అమెరికాలో అదానీ మీద కేసుల గురించి చర్చించాలని విపక్షం పట్టుబడుతోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించాలని డిమాండ్ చేస్తోంది. శుక్రవారం కూడా సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు ఇరుసభల్లో ఆందోళనకు పూనుకున్నారు. అదే సమయంలో రాజ్యసభలో డబ్బుల కట్ట దుమారం రేపుతోంది. ఎంపీ అభిషేక్‌…

Read More

కేంద్రం నుంచి అనుమతులు వస్తే విశాఖ మెట్రో!

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై స‌మ‌గ్ర ర‌వాణా ప్ర‌ణాళిక‌(సీఎంపి) సిద్దం చేశామని ఏపీ పట్టణాభివృద్ధి , మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్ర‌శ్నోత్త‌రాల్లో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై ప్రశ్నకు ఆయన స‌మాధానమిచ్చారు. “ప్ర‌ణాళిక‌ను ఇప్ప‌టికే కేంద్ర‌ప్ర‌భుత్వానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే ప్రాజెక్ట్ ప‌నులు ప్రారంభిస్తాం. గ‌త ప్ర‌భుత్వం విశాఖ‌,విజ‌య‌వాడ‌కు మెట్రో రైల్ రాకుండా క‌క్ష‌పూరితంగా ప‌క్క‌న పెట్టేసింది. విశాఖ‌లో భోగాపురం ఎయిర్…

Read More

భగవద్గీత అమ్మకాలను అడ్డుకున్న ఎమ్మెల్యే

గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు చర్చనీయాంశమవుతోంది. ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాలను అమ్ముతుండగా ఆమె అడ్డుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇస్కాన్ పేరుతో కొందరు భగవద్గీత అమ్మకాల పేరుతో వీధి వీధి తిరుగుతుండగా గుంటూరులో వారు ఎమ్మెల్యే కంటబట్టారు. వారిని నిలదీసిన గల్లా మాధవి వారిని నిలదీశారు. భగవద్గీత పుస్తకాలు అమ్మే అధికారం మీకు ఎక్కడిదీ అంటూ ప్రశ్నించారు. దాంతో ఆమె తీరు మీద ఇస్కాన్ ప్రతినిధులు విస్తుపోవాల్సి వచ్చింది….

Read More

బాబు స్కెచ్ పెద్దది..కానీ అంత సీన్ ఉంటుందా?

గోదావరి జలాలను రాయలసీమ తరలించడం గురించి చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడారు. గోదావరి- పెన్నా అనుసంధానం అంటూ 2014-19 మధ్య పలుమార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టుకి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడది తెరమరుగయ్యింది. కొత్తగా బనకచర్లకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ముందుకు తెచ్చారు. డీపీఆర్ సిద్ధంచేసి, మూడు నెలల్లో టెండర్లని చెబుతున్నారు. పైగా ఇదే ఏపీకి గేమ్ ఛేంజర్ అంటూ వర్ణించారు. ఎప్పుడైనా నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అందరూ ఆహ్వానించాలి. అది అవసరం. కానీ…

Read More