చంద్రబాబు మన్ కీ బాత్ ముహూర్తం సిద్ధం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం గడిచిన పదేళ్లుగా జరుగుతోంది. తాజాగా దానిని ఏపీ ప్రభుత్వం కూడా అనుసరించబోతోంది. సీఎం చంద్రబాబు కూడా అలాంటి కార్యక్రమ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే సంక్రాంతికి ప్రారంభించే ప్రయత్నం జరుగుతోంది. “మీతో.. మీ చంద్రబాబు” పేరుతో నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉంది….

Read More

ఎట్టకేలకు కనుమూరి రఘురామకృష్ణంరాజుకి ఛాన్స్!

ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినే షనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్‌ తో విబేధించి ఆపార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం…

Read More

యశశ్వి జైశ్వాల్ రికార్డులతో టీమిండియా పట్టు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. యంగ్ ఓపెనర్ యశశ్వి జైశ్వాల్ అద్భుత సెంచరీతో పర్యటక జట్టు ముందు ఆసీస్ పేస్ త్రయం తేలిపోయింది. ఆ క్రమంలోనే టీమిండియా నయా సంచలనం రికార్డుల మోత మోగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోపీ తొలిటెస్టులో సెంచరీ సాధించి ఆస్ట్రేలియా గడ్డ మీద మొదటి మ్యాచ్ లో వంద పరుగులు సాధించిన ఉద్దండుల సరసన చేరాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్,…

Read More
pawan kalyan serious on varma

పిఠాపురం వర్మ మీద వేటు తప్పదా, పవన్ కళ్యాణ్‌ తో వివాదానికి ప్రతిఫలం చెల్లించాల్సిందేనా?

నేరుగా కాకున్నా.. పరోక్షంగానైనా పిఠాపురం వర్మ.. జనసేనానితో యుద్దానికి కాలు దువ్వుతున్నట్టే కన్పిస్తోంది. పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే రకమైన డౌట్లు వస్తున్నాయి. పిఠాపురం సెగ్మెంట్లో వర్మకు బలం ఉంటే ఉండొచ్చు.. అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ పవన్ కల్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతతో.. అది కూడా టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న ఓ పార్టీ అధినేతతో నేరుగా యుద్దానికి దిగేటంతటి రేంజీకి పరిస్థితిని తెచ్చుకోవడం వర్మ రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బందని…

Read More

ప్రజారోగ్యం పడకేస్తోంది.. ఆరోగ్య మంత్రి ఏమయ్యారో?

ఆంధ్రప్రదేశ్‌ లో వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే పీజీ కోర్సుల్లో చేరే వైద్య విద్యార్థుల విషయంలో ప్రభుత్వ తీరు మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. నేరుగా మంత్రి సత్యకుమార్ నే నిలదీశారు. గుంటూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్నలకు మంత్రి ఖంగుతిన్నారు. పీజీ కోసం ఫీజులు ఖరారు చేయకుండా అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేసి పీజీలో ఫీజులు పెంచే ప్రతిపాదన మీద మండిపడ్డారు. అది మరచిపోకముందే తాజాగా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు నిరసనలకు…

Read More

ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ వివాదాలు, అడుగులు పడేనా?

ఏపీకి కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది అంతుబట్టకుండా ఉంది. ఆఖరికి అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్ల నిధులు కూడా అప్పుగానా, గ్రాంట్ గానా అన్నది సందేహంగా కనిపిస్తోంది. ఈ సందిగ్ధం కొనసాగుతున్న వేళ తాజాగా కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ ప్రకటనలు చిచ్చుపెడుతున్నాయి. బహుశా పౌరవిమానయాన శాఖ టీడీపీ ఎంపీ చేతిలో ఉండడంతో ఆ శాఖ ద్వారానే ఎక్కువ ఫలితాలను ఆశిస్తూ ఎయిర్ పోర్టుల చుట్టూ హంగామా చేస్తున్నారా అన్న చర్చ…

Read More

శ్రేయస్ అయ్యర్ మళ్లీ అక్కడికే..!

వచ్చే ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం శ్రేయస్ అయ్యార్ సిద్ధమవుతున్నాడు. ఇటీవల కేకేఆర్ రిటెన్షన్ లిస్టులో మనోడు పేరు లేదన్న సంగతి తెలిసిందే. దాంతో నెక్ట్స్ సీజన్ కోసం మెగా ఆక్షన్ లో అయ్యర్ ను ఎవరు సొంతం చేసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. అయితే తాజాగా అయ్యర్ కోసం దిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపుతోంది. డీసీ కూడా తమ కెప్టెన్ రిషబ్ పంత్ ను రీటైన్ చేసుకోలేదు. పంత్ కోసం ఆర్సీబీ, సీఎస్కేలు పోటీ పడుతుండగా, శ్రేయస్…

Read More

జగన్ ఇల్లు ప్యాలెస్ అయితే చంద్రబాబుది నివాసం మాత్రమే ఎలా అయ్యింది?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని సీఎం ఇల్లు అనే అంటారు. కానీ మాజీ ముఖ్యమంత్రి ఇంటిని మాత్రం తాడేపల్లి ప్యాలెస్ అంటారు. నిజానికి చెప్పాలంటే సీఎం చంద్రబాబు నివశిస్తోంది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడం. ప్రభుత్వం నుంచి నోటీసులు కూడా అందుకున్న నదీ గర్భంలో ఉన్న భవనం. అయినా దానిని జనం అంగీకరించేలా చేయడం సాధారణ నైపుణ్యం కాదు. అది నేరం కాదని జనాలను నమ్మించడం చిన్న విషయం కాదు. హైకోర్టు నోటీసులు ఇచ్చిన భవనంలో…

Read More

పులివెందుల ఫలితాల వెనుక అసలేం జరిగింది? ఓటర్ల మనోగతమేంటి? Exclusive Ground Report

“Public opinion is everything. With public sentiment, nothing can fail; without it nothing can succeed.” ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని అంతా అంగీకరిస్తారు. కానీ జనాభిప్రాయానికి విలువనివ్వకపోతే ఏమీ సాధించలేమన్న అబ్రహం లింకన్ చెప్పిన మాటలను అధికారం దక్కగానే విస్మరిస్తారు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రత్యేకమైనవి. ఏడాది పాలనకి గడువు ఉండగా నిర్వహించిన చిన్న ఎన్నికే అయినప్పటికీ దాని…

Read More

బాహుబలిని బీట్ చేసిన పుష్ప2! ఇక మిగిలింది ఆ సినిమానే!

ఇండియన్ మువీ ఇండస్ట్రీలో పుష్ప2 కొత్త రికార్డ్ బ్రేక్ చేసింది. టాలీవుడ్ సత్తాను చాటిచెప్పింది. బాహుబలిని బీట్ చేసి రికార్డ్ కలెక్షన్లు సాధించింది. 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 1799 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. కొత్త రికార్డ్ నెలకొల్పింది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్ మువీ బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డు ను పుష్ప 2 బ్రేక్ చేసినట్లు అయింది. బాహబలి 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1788 కోట్ల రూపాయల…

Read More