జగన్ చొరవ నేరంగా చిత్రీకరించే యత్నంలో చంద్రబాబు, చేతులుడిగిన విపక్షం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకోవడం ఓ చరిత్ర. గతంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వం చేయని సాహసం. అనేక విధాలుగా ఆర్థిక అవస్థల్లో ఉన్న ఏపీలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు, అవి కూడా ప్రభుత్వమే నిర్మించపూనుకోవడం అభినందించాల్సిన అంశం. అందులో 5 కాలేజీలు ప్రారంభించి, మరో 5 కాలేజీల ప్రారంభానికి సన్నాహాలు చేయడం ఆహ్వానించాల్సిన అంశం. ఇదంతా జగన్ పాలనలో ఏపీకి జరిగిన మేలు. ఏపీలో వైద్య విద్య అభ్యసించాలని ఆశిస్తున్న…

Read More

డ్యుయెల్ రోల్స్ చేయడానికి ఇది సినిమా కాదు పవన్..!

కొన్ని సినిమాల్లో హీరో , విలన్ ఒకడే ఉంటారు. హీరో, విలన్ మాత్రమే కాదు..కమెడియన్ పాత్ర సైతం తనే పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది నిజజీవితంలో సాధ్యం కాదు. రాజకీయాల్లోనూ అసాధ్యం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ తీరు చూస్తుంటే అటు అధికారంలో భాగం పంచుకుంటూ, ఇటు విపక్షంగా గొంతు వినిపించాలన్న వ్యూహంలో ఏమైనా ఉన్నారా అన్న సందేహం కలుగుతోంది. ఏపీలో ఎవరికి నచ్చినా నచ్చకున్నా బలమైన ప్రతిపక్షం ఉంది. సీట్ల పరంగా అది ప్రస్ఫుటించకపోవచ్చు…

Read More

జనసేన నాయకుడి ఇంట్లో బాలుడి అనుమానాస్పద మృతి, దర్యాప్తు కోసం ఆందోళన

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడి ఇంట్లో బాలుడి మృతి కలకలం రేపుతోంది. బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ఎల్బీనగర్ కు చెందిన ఆటోడ్రైవర్ కుక్కల మల్లేశ్వరరావు కుమారుడు కుక్కల చరణ్ శ్రీ తేజ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ ఇంటికి సమీపంలోనే ఉన్న రాజేశ్వరి రెసిడెన్సీ వద్ద ఈ ఘటన జరిగింది. అపార్ట్ మెంట్ వాచ్…

Read More

మహానటి కీర్తి సురేష్ పెళ్లి , ప్రేమించి పెళ్లి పీటలెక్కిన స్టార్ హీరోయిన్

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడారు. ఆంటోని తెట్టిల్ ను గోవా వేదికగా జరిగిన పెళ్లిలో సంప్రదాయబద్ధంగా మనువాడారు. కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటి సినిమాతో ఆమెకు జాతీయ అవార్డ్ కూడా దక్కింది. తెలుగులో స్టార్ హీరోలు మహేష్ బాబు సహా పలువురి సరసన నటించి, మెప్పించింది. అయితే తన చిన్న నాటి స్నేహితుడితో ప్రేమాయణం విషయాన్ని…

Read More

అనుష్క మళ్లీ వస్తోంది.. వేదం కాంబినేషన్ రిపీట్!

అనుష్క శెట్టి.. దాదాపు దశాబ్దకాలం పాటు టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్. కానీ కొంతకాలంగా దాదాపు తెరమరుగు అయిపోయింది. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ చిత్రం వచ్చి ఏడాది దాటింది. అప్పటి నుంచి అనుష్క నటించిన సినిమా ఏదీ రాలేదు. దాంతో ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తారా అన్న చర్చ కూడా సాగింది. చివరకు ఆమె కొత్త ప్రాజెక్ట్ ఒకటి పూర్తికాబోతోంది. ‘ఘాటీ’ అంటూ ఓ భారీ బడ్జెట్‌ చిత్రం సిద్ధమవుతోంది. అది కూడా డైరెక్టర్ క్రిష్…

Read More

ఏలూరు మెడికల్ కాలేజీకి యల్లాప్రగడ పేరు ఖరారు

ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాల పేరును “డా. ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ వైద్య కళాశాల, ఏలూరు”గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలపడంతో కాలేజ్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మెడకిల్ కాలేజ్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి బయో కెమిస్ట్రీలో విశేష పరిధోనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన…

Read More

దొమ్మరాజు గుకేశ్ విజయానికి మూలం కోహ్లీ ఫిట్ నెస్ మంత్రం అదే!

2011లో టీమిండియా చివరి సారిగా వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆనాడు టీమిండియా విజయంలో తెరవెనుక కీలకపాత్రధారుల్లో ఆయన ఒకరు. 2024 పారిస్ ఒలింపిక్స్ లో టీమిండియా హాకీ మెడల్ సాధించింది. అప్పుడు కూడా టీమ్ సక్సెస్ లో ఆయన పాత్ర ఉంది. తాజాగా గుకేశ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించాడు. చిన్నవయసులోనే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఆ చిన్నోడి విజయంలోనూ ఆయన పాత్ర ఉంది. ఆటలు వేరు..ఆటగాళ్ళు వేరు. కానీ ఆయన విజేతలను తయారుచేయడంలో…

Read More

హుందాగా అల్లు అర్జున్, విడుదల తర్వాత పెదవి విప్పిన ఐకాన్ స్టార్

పుష్ప2 ద్వారా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన అల్లు అర్జున్ అనుకోని కష్టాల్లో ఏకంగా జైలు పాలుకావడం సంచలనంగా మారింది. చివరకు ఒకరోజు జైలులో గడిపిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. తొలుత భార్య బిడ్డల దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్ అక్కడే మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన హుందాగా వ్యవహరించడం ఆకట్టుకుంది. “చట్టాన్ని…

Read More

ఆడబిడ్డల భద్రతే మొదటి ప్రాధాన్యం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువు తీరి కేవలం నాలుగైదు మాసాలే అయింది. ఈ సమయంలోనే ఏదో జరిగిపోయినట్లు వైసీపీ నాయకులు,వారి మద్దతుదారులు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసే వారిని ఇకపై ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, మద్దతుదారులు ఘోరమైన ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారం మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. మహిళలపై ఎవరు అసభ్య దూషణలు చేసినా…

Read More