ప్రజారోగ్యం పడకేస్తోంది.. ఆరోగ్య మంత్రి ఏమయ్యారో?

ఆంధ్రప్రదేశ్‌ లో వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే పీజీ కోర్సుల్లో చేరే వైద్య విద్యార్థుల విషయంలో ప్రభుత్వ తీరు మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. నేరుగా మంత్రి సత్యకుమార్ నే నిలదీశారు. గుంటూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్నలకు మంత్రి ఖంగుతిన్నారు. పీజీ కోసం ఫీజులు ఖరారు చేయకుండా అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేసి పీజీలో ఫీజులు పెంచే ప్రతిపాదన మీద మండిపడ్డారు. అది మరచిపోకముందే తాజాగా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు నిరసనలకు…

Read More

సినీ డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లికి అంతా రెడీ

ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ మరోసారి పెళ్లి పీటలెక్కుతున్నాడు. హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను వివాహం చేసుకునేందుకు అంతా సిద్ధమయ్యింది. నవంబర్ 10న వారి వివాహం జరుగుతుంది. 16వ తేదీన బంధు మిత్రులు, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటుచేశారు. డైరెక్టర్ క్రిష్ కి ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో ఇటీవల విడాకులు తీసుకున్నారు. ఆమె కూడా డాక్టర్ రమ్య వైద్యురాలే. తొలుత అమెరికాలో గడిపిన జాగర్లమూడి క్రిష్‌ ఆ తర్వాత సినిమాల…

Read More

అన్నం- చపాతి, ఏది బెస్ట్, ఏం తినాలి?

చాలామంది ఆహారం విషయంలో సందిగ్ధం ఉంటుంది. తమ ఆరోగ్యానికి ఏది మంచిదన్న సందేహాలు చుట్టుముడుతూ ఉంటాయి. ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో అన్నమే ప్రధాన ఆహారం. ఉత్తరాది రాష్ట్రాలలో రొట్టెలు, చపాతీలు ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ కాలం మారుతోంది. క్రమంగా ఆహారపు ఆలవాట్లలో కూడా మార్పులు వస్తున్నాయి. షుగర్, బిపి, అధిక బరువు, హార్మోన్ సమస్యలు వంటివి ప్రభావితం చేస్తున్న దశలో అందరూ ఆహారం మీద కేంద్రీకరణ పెంచుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం కోసమంటూ కొందరు అన్నానికి బదులు…

Read More

గోదావరి పుష్కరాల ముహూర్తమిదే, ఈసారి వచ్చే యాత్రికులెందరంటే!

కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. దీంతో, ప్రభుత్వం..స్థానిక నేతలు – యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనుల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాజాగా పుష్కరాల నిర్వహణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి…

Read More

ఏపీ పీఏసీ కోసం ఎన్నికలే, ఏకగ్రీవానికి అంగీకరించని కూటమి నేతలు

సంప్రదాయానికి భిన్నంగా సాగుతోంది ఎన్డీయే ప్రభుత్వం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని విపక్షానికి అప్పగించడం 1966 నుంచి అమలవుతోంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆపార్టీ పక్షాన పులవర్తి రామాంజనేయులుకి పీఏసీ దక్కబోతోంది. తొలుత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని వైఎస్సార్సీపీ ప్రతిపాదించగానే ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు ప్రచారం సాగుతోంది. దాంతో అంతా ఏకగ్రీవం అనుకున్నారు. తీరా అందుకు భిన్నంగా జనసేన నేతను బరిలో దింపాలని కూటమి నేతలు…

Read More

రేషన్ బియ్యం మాఫియాపై రంగంలోకి పవన్ కళ్యాణ్‌, అధికారులపై సీరియస్

కాకినాడ నుంచి పోర్ట్ నుంచి అక్రమంగా తరలిపోతున్న బియ్యం వ్యవహారం దుమరం రేపుతోంది. రేషన్ బియ్యం మాఫియా యధేశ్ఛగా బియ్యం తరలింపు సాగిస్తున్న తరుణంలో నేరుగా డిప్యూటీ సీఎం రంగంలో దిగడం ఆసక్తిగా మారింది. కాకినాడ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్…

Read More

‘సీజ్ ద షిప్’ చివరికి అలా ఉపయోగపడింది..!

కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా ఫలితాన్నిచ్చినట్టు కనిపించడం లేదు. పది రోజులు గడుస్తున్నా ఆయన ఆదేశాలు అమలులోకి రాలేదు. ఇంకా ఆ బియ్యం ఎవరివన్నది తేల్చలేదు. చివరకు బుధవారం శాంపిల్స్ సేకరించారు. అవి పీడీఎస్ బియ్యమా కాదా అన్నది తేల్చడానికే పది రోజులు పడుతుంటే ఇక అసలు కథ కొలిక్కివచ్చేదెన్నడూ అన్నది ప్రశ్నార్థకం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మాత్రం సినిమాట్రిక్ గా ఉండడంతో ఏకంగా సినిమా టైటిల్ ఒకటి సిద్ధమయ్యింది….

Read More

మంచు ఇంట్లో చిచ్చు, మోహన్ బాబు మీద మనోజ్ ఫ్యామిలీ ఫిర్యాదు!

ఆస్తుల కోసం, పెత్తనం కోసం సాగే వివాదాలు ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టడం చాలా సహజం. అందులో చిన్నా, పెద్దా, సెలబ్రిటీ అన్న తేడా ఏమీ ఉండదని తాజాగా మంచు ఫ్యామిలీ నిరూపిస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారంలో తగాదా తారస్థాయికి చేరింది. తాజాగా తమకు అన్యాయం జరుగుతోందంటూ మోహన్ మీద మంచు మనోజ్, ఆయన భార్య ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది. చిత్తూరు జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారంలో మంచు విష్ణు,…

Read More

యశశ్వి జైశ్వాల్ రికార్డులతో టీమిండియా పట్టు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. యంగ్ ఓపెనర్ యశశ్వి జైశ్వాల్ అద్భుత సెంచరీతో పర్యటక జట్టు ముందు ఆసీస్ పేస్ త్రయం తేలిపోయింది. ఆ క్రమంలోనే టీమిండియా నయా సంచలనం రికార్డుల మోత మోగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోపీ తొలిటెస్టులో సెంచరీ సాధించి ఆస్ట్రేలియా గడ్డ మీద మొదటి మ్యాచ్ లో వంద పరుగులు సాధించిన ఉద్దండుల సరసన చేరాడు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్,…

Read More

సీఎం రమేశ్ ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి పంపించిన ఎంపీ

అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేశ్ కి షాక్ తగిలింది. ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం తగదంటూ ఆయనకు సహచర మంత్రి హితువు పలికారు. ఖరీదైన కానుకలతో ఎంపీలను మభ్యపెట్టాలనే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. బీహార్ ఎంపీ సుదామ ప్రసాద్ తీరుతో సీఎం రమేశ్‌ ఖంగుతినాల్సి వచ్చింది. పార్లమెంట్ లో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేశ్ ఉన్నారు. ఆయన నాయకత్వంలోని కమిటీ స్టడీ టూర్ కి వెళ్లిన సమయంలో కమిటీ సభ్యులకు…

Read More