పోలీసులే హద్దులు మీరితే ఎలా? క్షమాపణలు చెప్పిన హైదరాబాద్ సీపీ

అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వివాదంలో పోలీసులు కొందరు చేస్తున్న అతి వివాదాలకు దారితీస్తోంది. అల్లు అర్జున్ ని విలన్ గా చిత్రీకరించాలని సీఎం సంకల్పించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో వీరంగం చేసిన ఏసీపీ వంటి వాళ్లు అందులో పావులుగా మారారు. ఆఖరికి సీనియర్ అధికారి, హైదరాబాద్ సీపీ కూడా ఆ క్రమంలో హద్దులు మీరి అనవసర వివాదంలో చిక్కుకున్నారు. చివరకు క్షమాపణలు చెప్పాల్సి…

Read More

ఊగిసలాటలో పీఏసీ చైర్మన్, పెద్దరెడ్డికి దక్కేనా?

పీఏసీ చైర్మన్ గిరీ కొత్త మలుపు తిరిగింది. దాదాపుగా పెద్దిరెడ్డికి ఖాయం అనుకున్న దశలో కూటమి నేతలు మెలిక పెట్టారు. జనసేన తరుపున కూడా నామినేషన్ దాఖలయ్యింది. దాంతో వ్యవహారం ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీకి పీఏసీ చైర్మన్ గిరీ రాకుండా చేసే ప్రణాళిక సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. అయితే అధికారకూటమి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచిస్తుందా లేక సభలో ఏకైక విపక్షానికి ఇస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. ఏపీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్టుకి సంబంధించి ఓ…

Read More

ఏబీఎన్, టీవీ5 తగాదాకి మూలమైన తలనూనె మళ్లీ వచ్చింది!

నూజెన్ హెయిర్ ఆయిల్ గుర్తుందా, చాన్నాళ్లకు మళ్లీ వచ్చింది. కొంతకాలం మరుగున పడిన ఆ తలనూనె మళ్లీ తడాఖా చూపించే దిశలో సాగుతోంది. టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుకి ఇటీవల పదవీయోగం దక్కింది. ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి సొంతం చేసుకున్నారు. ఆయనకు అధికార హోదా దక్కిన తర్వాత చాలాకాలానికి మళ్లీ నూజెన్ హెయిర్ ఆయిల్ తెరమీదకు వచ్చింది. ప్రకటనలు కనిపిస్తున్నాయి. పదేళ్లకు పూర్వం నూజెన్ హెయిర్ ఆయిల్ ఓ సంచలనం. బట్టతల మీద జట్టు మొలిపించేస్తామంటూ…

Read More

ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ వివాదాలు, అడుగులు పడేనా?

ఏపీకి కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది అంతుబట్టకుండా ఉంది. ఆఖరికి అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్ల నిధులు కూడా అప్పుగానా, గ్రాంట్ గానా అన్నది సందేహంగా కనిపిస్తోంది. ఈ సందిగ్ధం కొనసాగుతున్న వేళ తాజాగా కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ ప్రకటనలు చిచ్చుపెడుతున్నాయి. బహుశా పౌరవిమానయాన శాఖ టీడీపీ ఎంపీ చేతిలో ఉండడంతో ఆ శాఖ ద్వారానే ఎక్కువ ఫలితాలను ఆశిస్తూ ఎయిర్ పోర్టుల చుట్టూ హంగామా చేస్తున్నారా అన్న చర్చ…

Read More

అక్కడికి టీమిండియా వెళ్లడం లేదు.. ఇప్పుడేమవుతుంది?

పాకిస్తాన్ లో నిర్వహించబోయే ఛాంపియన్స్ ట్రోపీకి తమ టీమ్ ని పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టబోదంటూ తేల్చేసింది. దాంతో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫి నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. గత ఏడాది ఆసియా కప్ మ్యాచ్ ల కోసం కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదు. దాంతో హైబ్రీడ్ పద్ధతిలో టీమిండియా మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు కూడా అలాంటి మార్గం అన్వేషించాలని బీసీసీఐ కోరుతోంది. ఇండియా- పాకిస్తాన్…

Read More

కార్యకర్తలే బలిపశువులు, చంద్రబాబు, జగన్ ఎవరైనా అదే తంతు!

అధికారంలో టీడీపీ ఉందా లేక వైఎస్సార్సీపీనే కొనసాగుతుందా అన్నది తెలీయడం లేదు- ఇదీ ఓ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. అంతకుముందు వైఎస్సార్సీపీ హయంలోనూ ఇలాంటి మాటలే వినిపించాయి. ఇంకా చెప్పాలంటే మేమంతా కష్టపడితే గెలిచిన సీఎం ఈయనేనా అని అప్పుడూ, ఇప్పుడూ సందేహించే పరిస్థితి ఆయా పార్టీల శ్రేణుల్లో ఉంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకు ఏలూరు పరిస్థితి చూద్దాం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ శ్రేణుల మీద పలు కేసులు పెట్టారు. ఆ…

Read More

రాహుల్ గాంధీకి వర్తించని నిభందన…మీకు ఎలా సాధ్యం జగన్ ?

ప్రభుత్వ విధానాలను చర్చిండానికి, ప్రశ్నించడానికి ప్రతిపక్షానికి గొప్ప వేదికలు చట్ట సభలు.అలాంటి ప్రజాస్వామ్య అవకాశం అందరికి దొరుకుతుందా? రాజ్యంగ బద్ధ సంస్థ ద్వారా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష శాసనసభ్యలు ఆ విషయాన్నే మర్చిపోయారా? ప్రతిపక్ష నేతగా గుర్తించనప్పుడు అసెంబ్లీ ఎందుకు అని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తున్నారు? పార్టీ కార్యాలయం నుంచే పాలక పార్టీ ని ప్రశ్నిస్తూ ఉంటాము అని ప్రకటిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అధికార ప్రతినిధి వరకు…

Read More

వివాదాస్పద నిర్ణయానికి వెనుదిరిగిన రిషబ్ పంత్, టీమిండియా ఓటమి

న్యూజీలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. మూడు టెస్టు మ్యాచుల్లో కూడా ప్రధాన బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వైపల్యం టీమిండియా ఓటమికి కారణంగా మారింది. అదే సమయంలో ముంబై టెస్టులో రెండు ఇన్నింగ్సులలోనూ పోరాడిన రిషబ్ పంత్ కీలక సమయంలో అవుట్ కావడంతో జట్టు విజయావకాశాలు దెబ్బతీసింది. డీఆర్ఎస్ లో పంత్ ను అవుట్ గా ప్రకటించారు. అయితే బ్యాట్ ను బాల్…

Read More

జనసేన నాయకుడి ఇంట్లో బాలుడి అనుమానాస్పద మృతి, దర్యాప్తు కోసం ఆందోళన

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడి ఇంట్లో బాలుడి మృతి కలకలం రేపుతోంది. బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ఎల్బీనగర్ కు చెందిన ఆటోడ్రైవర్ కుక్కల మల్లేశ్వరరావు కుమారుడు కుక్కల చరణ్ శ్రీ తేజ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ ఇంటికి సమీపంలోనే ఉన్న రాజేశ్వరి రెసిడెన్సీ వద్ద ఈ ఘటన జరిగింది. అపార్ట్ మెంట్ వాచ్…

Read More

లౌకిక రాజ్యానికి ప్రతీకగా విశాఖ రాస్‌హిల్‌ … విశాఖ క‌న్నెమ‌రియ‌ గుడికి నాగుల‌చ‌వితి శోభ‌

భార‌తీయ‌త‌ సంస్కృతికి మూలం భిన్న‌త్వంలో ఏక‌త్వమే. వేల ఏళ్లుగా అది మ‌న సంస్కృతిలో జీర్ణించుకు పోయింది. కుల‌, మ‌త విభేదాలు వెర్రిత‌ల‌లు వేసే ఘ‌ర్ష‌ణ‌లు అక్క‌డ లేవు. ఆచారం, అనాచారం అసుంట‌సుంట వంటి విభ‌జ‌న రేఖ‌లు అక్క‌డ భూత‌ద్ధం పెట్టినా క‌నిపించ‌వు. ఇదంతా ఆధునిక నాగ‌రిక స‌మాజానికి దూరంగా ఎక్క‌డో అడ‌వుల్లోనో, ఏ కొండ కోన‌ల్లోనో అనుకుంటే త‌ప్పులో కాలు వేసిన‌ట్టే. అన్ని రంగాల‌్లో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మ‌హాన‌గ‌రంలోనే. అన్య‌మ‌త ప్ర‌చారం…

Read More