ఫీజు రీయంబెర్స్మెంట్ రాకపోవడంతో పిల్లలకు భోజనాలు లేవు- మంత్రి నారా లోకేశ్ చూస్తున్నారా?

కాకినాడలో ఓ నర్సింగ్ కాలేజ్ యజమాన్యం అడ్డగోలుగా వ్యవహరించింది. విద్యార్థులను రోడ్డుకి నెట్టింది. ఫీజు రీయంబెర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఫీజులు కట్టని పిల్లలకు భోజనాలు పెట్టలేం అంటూ హాస్టల్ మూసేసింది. దాంతో విద్యార్థులు తీవ్రంగా సతమతమయ్యారు. చివరకు సమీపంలోని ఫంక్షన్ హాళ్లలో ఓ పూట కడుపు నింపుకున్నారు. కానీ ఆదివారం నాడు అలాంటి అవకాశం కూడా లేకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జోక్యం చేసుకుని ఆర్డీవో మల్లిబాబుని కాలేజ్…

Read More

చంద్రబాబు ప్లాన్డ్ గానే ఉన్నారు.. జగన్ కు ఇబ్బందులు తప్పవా..?

ఏపీలో కూడా జమిలీ ఎన్నికలు తప్పవా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ప్రకటిస్తున్న వేళ ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు తప్పవనే అంచనాలు పెరుగుతున్నాయి. ఈసారి అసెంబ్లీకి పూర్తి ఆయుష్షు కష్టమనే అభిప్రాయం బలపడుతోంది. మధ్యంతర ఎన్నికలు వస్తే అవి ఎప్పుడా అన్న చర్చ కూడా సాగుతోంది. 2027లోనే యూపీ ఎన్నికలతో పాటుగా ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధమయితే ఏపీ కూడా…

Read More

ప్రజారోగ్యం పడకేస్తోంది.. ఆరోగ్య మంత్రి ఏమయ్యారో?

ఆంధ్రప్రదేశ్‌ లో వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే పీజీ కోర్సుల్లో చేరే వైద్య విద్యార్థుల విషయంలో ప్రభుత్వ తీరు మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. నేరుగా మంత్రి సత్యకుమార్ నే నిలదీశారు. గుంటూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్నలకు మంత్రి ఖంగుతిన్నారు. పీజీ కోసం ఫీజులు ఖరారు చేయకుండా అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేసి పీజీలో ఫీజులు పెంచే ప్రతిపాదన మీద మండిపడ్డారు. అది మరచిపోకముందే తాజాగా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు నిరసనలకు…

Read More

జగనూ, పవనూ ఇద్దరికీ పాఠం చెప్పిన సినిమా రాజకీయాలు!

రాజకీయ పార్టీ లేదా సినిమా ఏదైనా గానీ ఒక కులం, ఒక వర్గం ఆధారంగా సక్సెస్ కొట్టలేవన్నది జగమెరిగిన సత్యం. కానీ ఆయా కులాల అండదండలతో కొంత ఊపు వస్తుంది. పార్టీకయితే పునాది అవుతుంది. సినిమాకయితే ఒకటి రెండు రోజుల వసూళ్లుంటాయి. అంతకుమించి కులాన్ని నెత్తిన పెట్టుకుంటే ఏమవుతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొణిదెల పవన్ కళ్యాణ్ కి అర్థమయ్యి ఉండాలి. ఎందుకుంటే కులం కారణంగా రాజకీయాల్లో ఒకరు, సినిమాల్లో ఒకరు దెబ్బతినాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్…

Read More

విరాట్ వైఫల్యం టీమిండియాకు శాపంగా మారుతోందా? సీనియర్లే టీమ్ కి భారమా?

టీమిండియా తీవ్రంగా సతమతమవుతోంది. ముఖ్యంగా టెస్టుల్లో జట్టు కుదురుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గడిచిన ఐదు టెస్టుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. నాలుగు టెస్టుల్లో ఓటమి పాలయ్యింది. బ్రిస్బేన్ లో వర్షం ఆపకపోతే ఐదో టెస్ట్ ఓటమి అంచున ఉంది. ఆస్ట్రేలియాకు సిరీస్ అప్పగించే పనిలో కనిపిస్తోంది. జట్టులో ఆటగాళ్లు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమవుతున్నారు. బౌలింగ్ లో బుమ్రా, బ్యాటింగ్ లో కొంత మేర కేఎల్ రాహుల్ మినహా మిగిలిన వాళ్లంతా…

Read More

సూపర్ స్టార్ కృష్ణకి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పోలిక ఏంటి?

తెలుగునాట ఎవరికిష్టమున్నా లేకున్నా సినిమాల ప్రభావం అసామాన్యం. సినీ హీరోలను కొలిచే యువతరం ఎప్పుడూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా సినిమాల నుంచి వచ్చి రాజకీయాలను, ప్రజల జీవితాలను శాసించే ప్రయత్నం కొందరు చేస్తుంటారు. వారిలో కొందరు సక్సెస్ అయిన చరిత్ర కూడా తెలుగునేల మీద ఉంది. తెలుగు హీరోలలో నెంబర్ వన్ గేమ్ ఆరంభం నుంచి ఆసక్తికరమే. అందులోనూ ఎన్టీఆర్ హవా సాగిన తర్వాత ఆయన కొత్త ట్రాక్ ఎంచుకోవడంతో ఆయన తర్వాత ఎవరూ అన్న ప్రశ్న…

Read More

రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి కారకులెవరు? పవన్ కి ఇది అర్థమయితేనే!

సమస్య మూలాల నుంచి పరిష్కరించాలి. పైపై పూతలు కొంతకాలమే ఫలిస్తాయి. మళ్లీ మళ్లీ వ్యాధి లక్షణాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. సరిగ్గా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో అదే జరుగుతుంది. ఎవరైనా అధికారి లేదా ఇంకో నాయకుడు సందడి చేసిన సమయంలో ఓ వారం సర్ధుమణగడం, మళ్లీ చెలరేగిపోవడం అన్నది ఆనవాయితీగా మారుతోంది. మొన్నటి జూన్ లో ఇదే జరిగింది. సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు స్వీకరించగానే కాకినాడ వెళ్లారు. కలియ తిరిగారు….

Read More

అప్పుగా కాదు…కేంద్ర గ్రాంట్ గా నిధులు ప్రకటించాలి : సి.హెచ్ బాబురావు

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ప్రకటించిన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను అప్పుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ గా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు కోరారు. శనివారం తుళ్లూరులో సిఆర్డిఏ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై మళ్ళీ అనిశ్చిత పరిస్థితి తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా,పటిష్టంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగినందున…

Read More

కాకినాడ పోర్టులో షిప్ సీజ్ చేయలేమని తేల్చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్న పనామా స్టెల్లా షిప్ ను సీజ్ చేయలేమని ఏపీ ప్రభుత్వం తేల్చేసింది. అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దానికి తగ్గట్టుగా ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులు సహా ఇతర అక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ…

Read More

టీమిండియాలో గంభీర్ చిచ్చు పెట్టారా.. పరాజయాల పరంపరలో కోచ్ పాత్ర ఎంత?

టీమిండియా ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత పేలవ ప్రదర్శన చేసింది. న్యూజీలాండ్ తో సొంత గడ్డ మీద సిరీస్ లో ఏకంగా మూడుకి మూడు టెస్టులు ఓడిపోయింది. అయితే ఓటమి కన్నా జట్టులో కీలక ఆటగాళ్ల ప్రదర్శన మీద తీవ్ర చర్చ సాగుతోంది. అందులో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముంగిట జట్టులో పరిణామాల మీద ఆందోళన వ్యక్తమవుతోంది. జట్టు కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా తగిన స్థాయిలో ప్రతిభ కనబర్చలేకపోతోంది….

Read More