మోహన్ బాబు- మనోజ్ బాబు- మీడియా తప్పు ఎవరిది? శిక్ష ఎవరికీ?

మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం కొత్తది కాదు. కొంతకాలంగా దాని ఆనవాళ్లు బయటకు వస్తూనే ఉన్నాయి. వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. చివరికిలా బయటపడింది. అయితే ఈసారి కూడా భౌతికదాడులు, బౌన్సర్ల తో గొడవలు, గేట్లు నెట్టుకోవడాలు, కేసులు పెట్టుకోవడాలు వంటివి చూస్తున్నాం. సహజంగానే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి వాళ్ల చుట్టూ ఏం జరిగినా జనాల్లో ఆసక్తి ఉంటుంది. మీడియాకు మంచి సరుకుగా మారుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అనూహ్యంగా మీడియానే నిందిస్తూ, మితిమీరి…

Read More

వైసిపి విమర్శలకు పవన్ ఊతమిచ్చారా?

రాష్ట్రంలో నిన్నటివరకు అధికార ఎన్డీయేకు వైసిపికు మధ్య విమర్శలు, సవాళ్లు నడిచాయి.కానీ నేడు బహిరంగ సభ వేదికపై సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణే అధికార భాగస్వామి మంత్రి పై విమర్శలు గుప్పించారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో అశ్రద్ధ వహిస్తే తానే హోం మంత్రిత్వ శాఖ బాధ్యతను తానే తీసుకుంటానని హెచ్చరించారు. ఇన్నాళ్లు ఎన్డీయే మిద వైసిపి చేసిన విమర్శలనే నేడు పవన్ గుర్తు చేశారు. ఎన్డీయే కూటమి అధికారం చేపట్టిన ఐదు నెలలు కాలంలోనే…

Read More

ఏపీలో పెట్టుబడుల మీద తెలంగాణా మంత్రి కీలక వ్యాఖ్యలు

తెలంగాణా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమరావతికి వరద ముప్పు కారణంగా ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదంటూ అభిప్రాయపడ్డారు. ఏపీలో చంద్రబాబు రాగానే హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందనేది తప్పుడు ప్రచారం మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. పెట్టుబడిదారులు అమరావతి కంటే హైదరాబాద్‌, బెంగళూరుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటూ మంత్రి పొంగులేటి అన్నారు. ఏపీలో ఇటీవల ప్రభుత్వం వరుసగా…

Read More

వైయస్ షర్మిలకు భద్రత అవసరమా ? : కాకాని గోవర్ధన్

మాజీ ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తి వివాదాల్లో జోక్యం చేసుకొని వై. యస్. షర్మిలకు తాము భద్రత కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం ఏమిటని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇతరుల కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు.శనివారం నెల్లూరు లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందాకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్…

Read More

ఏపీ శాసనమండలిలో పెరిగిన పీడీఎఫ్‌ బలం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఊపు

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో పీడీఎఫ్‌ తన బలం పెంచుకుంది. సిట్టింగ్ టీచర్ సీటుని నిలబెట్టుకుంది. గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ సీటుకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది. 65 శాతం పైబడి ఓట్లు దక్కించుకుంది. త్వరలో జరగబోతున్న రెండు గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికలకు తమ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. టీచర్ ఎమ్మెల్సీగా ఉండగా షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆ సీటుకి ఉప ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి సునాయాసంగా…

Read More

గోదావరి పుష్కరాల ముహూర్తమిదే, ఈసారి వచ్చే యాత్రికులెందరంటే!

కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. దీంతో, ప్రభుత్వం..స్థానిక నేతలు – యంత్రాంగం అప్రమత్తం అయ్యారు. ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. చేపట్టాల్సిన పనుల పైన నిర్ణయానికి వచ్చారు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాజాగా పుష్కరాల నిర్వహణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి…

Read More

బాబు స్కెచ్ పెద్దది..కానీ అంత సీన్ ఉంటుందా?

గోదావరి జలాలను రాయలసీమ తరలించడం గురించి చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడారు. గోదావరి- పెన్నా అనుసంధానం అంటూ 2014-19 మధ్య పలుమార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టుకి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడది తెరమరుగయ్యింది. కొత్తగా బనకచర్లకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ముందుకు తెచ్చారు. డీపీఆర్ సిద్ధంచేసి, మూడు నెలల్లో టెండర్లని చెబుతున్నారు. పైగా ఇదే ఏపీకి గేమ్ ఛేంజర్ అంటూ వర్ణించారు. ఎప్పుడైనా నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అందరూ ఆహ్వానించాలి. అది అవసరం. కానీ…

Read More
modi strategy

పాకిస్తాన్ కి అదే బలం! మోదీ అంచనా అందుకే తప్పిందా?

ఒక్కో దేశానికి ఒక్కో బలం ఉంటుంది. పాకిస్తాన్ బలం మాత్రం భౌగోళిక స్వరూపమే. అందులోనూ కీలక దేశాలకు నడుమ ఉండడమే. ఓవైపు ఇండియా, రెండోవైపు చైనా, ఇంకో వైపు ఇరాన్, వాటికి తోడు పూర్వపు సోవియట్ రష్యా కూడా సమీపంలోనే ఉండేది. కనుకనే అమెరికా కన్నేసింది. పాకిస్తాన్ ను ఉపయోగించుకుంది. రష్యాని బెదిరించేందుకు, ఇండియాను కట్టడిచేసేందుకు పాకిస్తాన్ ను వినియోగించుకుది. చివరకు ఇరాన్, ఆప్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్య పాలకులను గద్దెదించేందుకు పాకిస్తాన్ కేంద్రంగానే పావులు కదిపింది….

Read More

ఇళయరాజా కొడుకు ముస్లీం మతంలోకి ఎందుకు మారాడు?

తమిళనాడులో ఆలయ ప్రవేశం నిరాకరించారన్న వార్తలతో ఇళయరాజా వార్తల్లోకెక్కారు. అయితే ఆయన గురించి తనయుడు యువన్ శంకర్ రాజా వెల్లడించిన చర్చనీయాంశమవుతున్నాయి. ఇళయరాజా తనయుడు ఇప్పటికే మతం మార్చుకున్నారు. ఆయన హిందూ మతం వీడి ముస్లీం మతం స్వీకరించారు. ఆ సమయంలో తన తండ్రి గురించి ఆయన కీలకమైన వ్యాఖ్యానాలు చేశారు. “మా నాన్న హిందూమతాన్ని ఫాలో అవుతారు, ఆయనకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఇంట్లో చిన్న గాజుగ్లాసు పగిలినా, అదొక అపశకునమని పండితున్ని పిలిచి పూజలు…

Read More